ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలను నిషేధిస్తున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇటీవలే పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్ దగ్గర ఏర్పడిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూసే ఉద్దేశంతో బన్నీ అక్కడికి రావడంతో ఒక్కసారిగా తోపులాట పెరిగిపోయి ఈ విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తో పాటు దీనికి బాధ్యులైన వారి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇప్పుడు నైజామ్ లో బెనిఫిట్ షోలు రద్దు చేయడమంటే ఇకపై ప్యాన్ ఇండియా నిర్మాతలకు పడబోయే దెబ్బ చిన్నగా ఉండదు. ఎందుకంటే జనవరి పండక్కు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ రిలీజులు ఉన్నాయి. ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు పెద్ద ఎత్తున హైక్ ఇవ్వడంతో పుష్ప 2 అంత కాకపోయినా తమకు అదనంగా ప్రయోజనం ఉంటుందనే కోణంలో నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కేవలం రెగ్యులర్ షోలంటే భారీగా వచ్చే రెవిన్యూకి గండి పడుతుంది. ఒకవేళ మొన్న ట్రాజెడీ జరగకపోయి ఉంటే ఇప్పుడీ బ్యాన్ ఉండేది కాదన్నది వాస్తవం.
మరి ఏపీలో ముందస్తు షోలు కొనసాగిస్తారా లేదా అనేది ప్రొడ్యూసర్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజ్ కి అడ్డాగా మారిన ఆర్టిసి క్రాస్ రోడ్స్ వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చింది. అభిమానులు అత్యుత్సాహంతో అక్కడ సినిమా చూస్తేనే ఏదో సాధించినట్టు ఫీలవ్వడం కూడా దీనికి దోహదం చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఇదే తరహాలో బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ మాములు అయ్యింది. మరిప్పుడు సుదీర్ఘ కాలం ఈ బ్యాన్ ఉంటుందా లేక కొంత కాలం అయ్యాక మినహాయింపులు ఇస్తారా చూడాలి.
This post was last modified on December 6, 2024 12:45 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…