ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలను నిషేధిస్తున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇటీవలే పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్ దగ్గర ఏర్పడిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూసే ఉద్దేశంతో బన్నీ అక్కడికి రావడంతో ఒక్కసారిగా తోపులాట పెరిగిపోయి ఈ విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తో పాటు దీనికి బాధ్యులైన వారి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇప్పుడు నైజామ్ లో బెనిఫిట్ షోలు రద్దు చేయడమంటే ఇకపై ప్యాన్ ఇండియా నిర్మాతలకు పడబోయే దెబ్బ చిన్నగా ఉండదు. ఎందుకంటే జనవరి పండక్కు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ రిలీజులు ఉన్నాయి. ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు పెద్ద ఎత్తున హైక్ ఇవ్వడంతో పుష్ప 2 అంత కాకపోయినా తమకు అదనంగా ప్రయోజనం ఉంటుందనే కోణంలో నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కేవలం రెగ్యులర్ షోలంటే భారీగా వచ్చే రెవిన్యూకి గండి పడుతుంది. ఒకవేళ మొన్న ట్రాజెడీ జరగకపోయి ఉంటే ఇప్పుడీ బ్యాన్ ఉండేది కాదన్నది వాస్తవం.
మరి ఏపీలో ముందస్తు షోలు కొనసాగిస్తారా లేదా అనేది ప్రొడ్యూసర్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజ్ కి అడ్డాగా మారిన ఆర్టిసి క్రాస్ రోడ్స్ వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చింది. అభిమానులు అత్యుత్సాహంతో అక్కడ సినిమా చూస్తేనే ఏదో సాధించినట్టు ఫీలవ్వడం కూడా దీనికి దోహదం చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఇదే తరహాలో బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ మాములు అయ్యింది. మరిప్పుడు సుదీర్ఘ కాలం ఈ బ్యాన్ ఉంటుందా లేక కొంత కాలం అయ్యాక మినహాయింపులు ఇస్తారా చూడాలి.
This post was last modified on December 6, 2024 12:45 pm
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…