ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలను నిషేధిస్తున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇటీవలే పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్ దగ్గర ఏర్పడిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూసే ఉద్దేశంతో బన్నీ అక్కడికి రావడంతో ఒక్కసారిగా తోపులాట పెరిగిపోయి ఈ విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తో పాటు దీనికి బాధ్యులైన వారి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇప్పుడు నైజామ్ లో బెనిఫిట్ షోలు రద్దు చేయడమంటే ఇకపై ప్యాన్ ఇండియా నిర్మాతలకు పడబోయే దెబ్బ చిన్నగా ఉండదు. ఎందుకంటే జనవరి పండక్కు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ రిలీజులు ఉన్నాయి. ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు పెద్ద ఎత్తున హైక్ ఇవ్వడంతో పుష్ప 2 అంత కాకపోయినా తమకు అదనంగా ప్రయోజనం ఉంటుందనే కోణంలో నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కేవలం రెగ్యులర్ షోలంటే భారీగా వచ్చే రెవిన్యూకి గండి పడుతుంది. ఒకవేళ మొన్న ట్రాజెడీ జరగకపోయి ఉంటే ఇప్పుడీ బ్యాన్ ఉండేది కాదన్నది వాస్తవం.
మరి ఏపీలో ముందస్తు షోలు కొనసాగిస్తారా లేదా అనేది ప్రొడ్యూసర్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజ్ కి అడ్డాగా మారిన ఆర్టిసి క్రాస్ రోడ్స్ వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చింది. అభిమానులు అత్యుత్సాహంతో అక్కడ సినిమా చూస్తేనే ఏదో సాధించినట్టు ఫీలవ్వడం కూడా దీనికి దోహదం చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఇదే తరహాలో బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ మాములు అయ్యింది. మరిప్పుడు సుదీర్ఘ కాలం ఈ బ్యాన్ ఉంటుందా లేక కొంత కాలం అయ్యాక మినహాయింపులు ఇస్తారా చూడాలి.
This post was last modified on December 6, 2024 12:45 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…