నందమూరి వారసుడి కోసం ఎదురు చూపులు తీరాయని అభిమానులు సంతోష పడుతున్న టైంలో హఠాత్తుగా పిడుగు లాంటి వార్త వాళ్ళ నెత్తి మీద పడింది. ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమైతే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సింది. కానీ వాయిదా వేస్తున్నట్టు మీడియాకు నోట్ పంపించారు తప్పించి కారణాలు పేర్కొనలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం మోక్షజ్ఞ మరికొంత టైం అడుగుతున్నాడని సమాచారం. కొంచెం ఆలస్యంగానా లేక అసలు వద్దనుకుంటున్నాడా అనేది బయటికి తెలియడం లేదు. ఇప్పుడప్పుడే కాదని అన్నట్టు వినికిడి.
ఆల్రెడీ మోక్షజ్ఞ కోసం మంచి లైనప్ సిద్ధంగా ఉంచారు బాలయ్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒక ప్రాజెక్టు అనుకుందట. తర్వాత ఆదిత్య 999 మ్యాక్స్ ని కొడుకు హీరోగా తన డైరెక్షన్ లో చేయాలని బాలయ్య ఆలోచన. మరికొందరు దర్శక నిర్మాతలు మోక్షజ్ఞ కథలు వింటానంటే వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెరంగేట్రంకు అంతా సిద్ధం ఉండి, ఫోటో షూట్ కూడా అయిపోయిన తరుణంలో హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం వెనుక లోగుట్టు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రశాంత్ వర్మది దాదాపు క్యాన్సిలని ఫిలిం నగర్ టాక్. అతనుగా చెబుతాడేమో చూడాలి.
సింబా ఈజ్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి న్యూస్ వినాల్సి రావడం ఊహించని పరిణామం. ఇప్పటికే బాగా లేట్ అయిపోయిన మోక్షజ్ఞ ప్రవేశం వీలైనంత త్వరగా చేస్తే బెటర్. మేకోవర్ చేసుకుని, నటనతో పాటు కీలకమైన శాఖలకు సంబంధించిన శిక్షణ తీసుకుని, ఫోటోల్లో భేష్ అనిపించుకుని అన్ని జరిగాక ఇప్పుడు వద్దని చెప్పడం వెనుక గుట్టు ఏమై ఉంటుందోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బాలయ్య త్వరలో డాకు మహారాజ్ ప్రమోషన్లలో పాల్గొనబోతున్నారు కాబట్టి ఆ టైంకి ఇచ్చే ఇంటర్వ్యూలలో మోక్షజ్ఞ గురించి ఏం చెబుతారో చూడాలి. అప్పటిదాకా జస్ట్ వెయిట్.
This post was last modified on December 5, 2024 7:28 pm
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…