నందమూరి వారసుడి కోసం ఎదురు చూపులు తీరాయని అభిమానులు సంతోష పడుతున్న టైంలో హఠాత్తుగా పిడుగు లాంటి వార్త వాళ్ళ నెత్తి మీద పడింది. ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమైతే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సింది. కానీ వాయిదా వేస్తున్నట్టు మీడియాకు నోట్ పంపించారు తప్పించి కారణాలు పేర్కొనలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం మోక్షజ్ఞ మరికొంత టైం అడుగుతున్నాడని సమాచారం. కొంచెం ఆలస్యంగానా లేక అసలు వద్దనుకుంటున్నాడా అనేది బయటికి తెలియడం లేదు. ఇప్పుడప్పుడే కాదని అన్నట్టు వినికిడి.
ఆల్రెడీ మోక్షజ్ఞ కోసం మంచి లైనప్ సిద్ధంగా ఉంచారు బాలయ్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒక ప్రాజెక్టు అనుకుందట. తర్వాత ఆదిత్య 999 మ్యాక్స్ ని కొడుకు హీరోగా తన డైరెక్షన్ లో చేయాలని బాలయ్య ఆలోచన. మరికొందరు దర్శక నిర్మాతలు మోక్షజ్ఞ కథలు వింటానంటే వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెరంగేట్రంకు అంతా సిద్ధం ఉండి, ఫోటో షూట్ కూడా అయిపోయిన తరుణంలో హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం వెనుక లోగుట్టు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రశాంత్ వర్మది దాదాపు క్యాన్సిలని ఫిలిం నగర్ టాక్. అతనుగా చెబుతాడేమో చూడాలి.
సింబా ఈజ్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి న్యూస్ వినాల్సి రావడం ఊహించని పరిణామం. ఇప్పటికే బాగా లేట్ అయిపోయిన మోక్షజ్ఞ ప్రవేశం వీలైనంత త్వరగా చేస్తే బెటర్. మేకోవర్ చేసుకుని, నటనతో పాటు కీలకమైన శాఖలకు సంబంధించిన శిక్షణ తీసుకుని, ఫోటోల్లో భేష్ అనిపించుకుని అన్ని జరిగాక ఇప్పుడు వద్దని చెప్పడం వెనుక గుట్టు ఏమై ఉంటుందోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బాలయ్య త్వరలో డాకు మహారాజ్ ప్రమోషన్లలో పాల్గొనబోతున్నారు కాబట్టి ఆ టైంకి ఇచ్చే ఇంటర్వ్యూలలో మోక్షజ్ఞ గురించి ఏం చెబుతారో చూడాలి. అప్పటిదాకా జస్ట్ వెయిట్.
This post was last modified on December 5, 2024 7:28 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…