ప్రాణం తీసిన అభిమానం.. బన్నీని చూసేందుకు తొక్కిసలాట.. మహిళ మృతిఅభిమానం ప్రాణం తీసింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప2’ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు జనాలు ఎగబడటం ఒక ఎత్తు అయితే.. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ ను చూసేందుకు జనం పోటెత్తారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఒక మహిళ మరణానికి కారణమైతే.. ఒక బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదానికి కారణమైంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప2 ప్రీమియర్ షోలను బుధవారం రాత్రి నుంచి మొదలు కావటం తెలిసిందే. ఈ నేషథ్యంలో తన ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు బన్నీ అలియాస్ అల్లు అర్జున్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్ని థియేటర్లు ఉన్నా.. క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న కొన్ని థియేటర్లు ఎంత స్పెషల్ అన్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. సంధ్య 70ఎంఎం థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్వయంగా విచ్చేశారు.
ఈ సినిమా ప్రీమియర్ షోను వీక్షించేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకున్నారు. భారీగా వచ్చిన అభిమానులు.. మరోవైపు అల్లు అర్జున్ ను చూడాలన్న ఆత్రుత వెరసి.. తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఒక మహిళ ప్రాణాల్ని తీసింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా మారింది.
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన 39 ఏళ్ల రేవతిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాల్ని విడిచింది. మరోవైపు తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ కు పోలీసులు సీపీఆర్ చేసి.. బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలెటర్ మీద చికిత్స అందిసతున్నారు. అభిమానుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
కుటుంబం మొత్తంతో కలిసి సినిమాచూసేందుకు వచ్చిన రేవతి.. ఆమె కుమారుడు ఇద్దరు తొక్కిసలాటతో తీవ్రంగా గాయపడ్డారు. కాసేపట్లో సినిమా చూసేందుకు కాస్త ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం తీవ్ర విషాదాన్ని నింపింది. అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మూవీ మీద నెలకొన్న క్రేజ్ నేపథ్యంలో పోలీసులు మరింత భారీగా మొహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు.
ఈ విషాద ఉదంతం నేపథ్యంలో థియేటరర్ వద్ద దాదాపు 200 మందికి పైగా పోలీసుల్ని మొహరించారు. అల్లు అర్జున్ మీద అభిమానంతో ప్రీమియర్ షోకు రేవతి కుటుంబం సినిమా చూసేందుకు దిల్ షుక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on December 5, 2024 9:46 am
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…