పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఏదైనా పెద్ద సినిమా వస్తోందంటే.. దాని ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.. రికార్డులేమైనా బద్దలవుతాయా అనే చర్చ జరుగుతుంది. ‘పుష్ప: ది రూల్’కు ఏ స్థాయిలో హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ తర్వాత అంతగా అంచనాలు పెంచిన సీక్వెల్ ఇది. దీంతో ఈ సినిమా రిలీజ్ ముంగిట వసూళ్ల గురించి చర్చ మొదలైంది. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం.. వసూళ్లలో కూడా ఆ మార్కును ఈజీగా అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్.. నార్త్ ఇండియాలో తిరుగులేని హైప్ తెచ్చుకోవడం. ‘బాహుబలి-2’ తర్వాత అంత హైప్ ఈ చిత్రానికే ఉంది.నార్త్ ఇండియన్ రూరల్ బెల్ట్స్లో ‘పుష్ప-2’ కోసం జనం ఊగిపోతున్నారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ను పాట్నాలో నిర్వహించగా వచ్చిన రెస్పాన్సే దీనికి నిదర్శనం. దీంతో హిందీ వెర్షన్ ఓపెనింగ్స్ మామూలుగా ఉండవని అర్థమవుతోంది.తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ రికార్డ్ బ్రేకింగ్ టికెట్ రేట్లతో రిలీజవుతోంది. ఉత్తరాదినే కాక.. దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.
అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. కాబట్టి ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉంటాయనడంలో సందేహం లేదు. ‘పుష్ప-2’ ఓపెనింగ్స్ కౌంట్ రూ.200 కోట్లకు తగ్గేలా లేదు. వైడ్ రిలీజ్, రౌండ్ ద క్లాక్ షోలు, భారీ టికెట్ల రేట్లు.. ఈ మూడు విషయాలనూ పరిగణనలోకి తీసుకుని చూస్తే ‘పుష్ప-2’ రూ.250 కోట్ల మేర తొలి రోజు వసూళ్లు రాబడుతుందని అంచనా. నిజంగా ఆ స్థాయిలో సినిమా కలెక్షన్ రాబడితే ఇండియన్ సినిమా లో ఒక సరికొత్త రికార్డు నమోదైనట్లే.
ఫుట్ ఫాాల్స్ విషయంలో ‘బాహుబలి-2’ను ఏ సినిమా కొట్టే పరిస్థితి లేదు కానీ.. పెరిగిన టికెట్ల ధరలు, వైడ్ రిలీజ్ వల్ల ఆ సినిమా వసూళ్లను ఇప్పటి సినిమాలు దాటేస్తున్నాయి. ‘పుష్ప-2’కు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ రావడం మాత్రం లాంఛనమే. టాక్ను బట్టి సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. ఓవరాల్ వసూళ్లను దాటడం కూడా దాని మీదే ఆధారపడి ఉంది.
This post was last modified on December 4, 2024 4:12 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…