పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఏదైనా పెద్ద సినిమా వస్తోందంటే.. దాని ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.. రికార్డులేమైనా బద్దలవుతాయా అనే చర్చ జరుగుతుంది. ‘పుష్ప: ది రూల్’కు ఏ స్థాయిలో హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ తర్వాత అంతగా అంచనాలు పెంచిన సీక్వెల్ ఇది. దీంతో ఈ సినిమా రిలీజ్ ముంగిట వసూళ్ల గురించి చర్చ మొదలైంది. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం.. వసూళ్లలో కూడా ఆ మార్కును ఈజీగా అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్.. నార్త్ ఇండియాలో తిరుగులేని హైప్ తెచ్చుకోవడం. ‘బాహుబలి-2’ తర్వాత అంత హైప్ ఈ చిత్రానికే ఉంది.నార్త్ ఇండియన్ రూరల్ బెల్ట్స్లో ‘పుష్ప-2’ కోసం జనం ఊగిపోతున్నారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ను పాట్నాలో నిర్వహించగా వచ్చిన రెస్పాన్సే దీనికి నిదర్శనం. దీంతో హిందీ వెర్షన్ ఓపెనింగ్స్ మామూలుగా ఉండవని అర్థమవుతోంది.తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ రికార్డ్ బ్రేకింగ్ టికెట్ రేట్లతో రిలీజవుతోంది. ఉత్తరాదినే కాక.. దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.
అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. కాబట్టి ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉంటాయనడంలో సందేహం లేదు. ‘పుష్ప-2’ ఓపెనింగ్స్ కౌంట్ రూ.200 కోట్లకు తగ్గేలా లేదు. వైడ్ రిలీజ్, రౌండ్ ద క్లాక్ షోలు, భారీ టికెట్ల రేట్లు.. ఈ మూడు విషయాలనూ పరిగణనలోకి తీసుకుని చూస్తే ‘పుష్ప-2’ రూ.250 కోట్ల మేర తొలి రోజు వసూళ్లు రాబడుతుందని అంచనా. నిజంగా ఆ స్థాయిలో సినిమా కలెక్షన్ రాబడితే ఇండియన్ సినిమా లో ఒక సరికొత్త రికార్డు నమోదైనట్లే.
ఫుట్ ఫాాల్స్ విషయంలో ‘బాహుబలి-2’ను ఏ సినిమా కొట్టే పరిస్థితి లేదు కానీ.. పెరిగిన టికెట్ల ధరలు, వైడ్ రిలీజ్ వల్ల ఆ సినిమా వసూళ్లను ఇప్పటి సినిమాలు దాటేస్తున్నాయి. ‘పుష్ప-2’కు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ రావడం మాత్రం లాంఛనమే. టాక్ను బట్టి సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. ఓవరాల్ వసూళ్లను దాటడం కూడా దాని మీదే ఆధారపడి ఉంది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…