బాహుబలి అప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్కు పరిచయం లేని ఫీట్లు ఎన్నో సాధించింది. ఒక్క రోజులో వంద కోట్లు.. ఓవరాల్గా వెయ్యి కోట్లు.. ఇలా అప్పటిదాకా ఊహకు కూడా అందని వసూళ్ల ఘనతలను సాధించింది. అలా అని తర్వాత వచ్చిన భారీ చిత్రాలన్నీ ఈ ఫీట్లను సాధించేయలేదు. ఇప్పటికీ తొలి రోజు వంద కోట్లు.. ఓవరాల్గా వెయ్యి కోట్లు అన్నది చాలా పెద్ద ఘనతగానే ఉంది. ఇలాంటి సమయంలో ఓ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్తోనే వంద కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకోవడం అంటే గొప్ప విషయమే.
అల్లు అర్జున్-సుకుమార్ల క్రేజీ సీక్వెల్ ‘పుష్ప-2’ ఈ ఘనత సాధించింది. వరల్డ్ వైడ్ అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్తో సాగిపోతున్న ‘పుష్ప-2’ కేవలం ప్రి సేల్స్తోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేసింది. దీని గురించి ట్రేడ్ పండిట్లు గొప్పగా చెబుతున్నారు.ఒక్క యుఎస్లోనే ‘పుష్ప-2’ ప్రి సేల్స్తో 4 మిలియన్ డాలర్ల మార్కును ముందే టచ్ చేసేయడం విశేషం. యుఎస్లోనే అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో.. నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా వెయ్యి రూపాయల రేటుతో రిలీజ్కు ఒక్క రోజు ముందే ప్రిమియర్స్ వేస్తున్నారు. ఆ షోలన్నీ ఫుల్స్ పడుతున్నాయి. ఇక తొలి రోజుకు వైడ్ రిలీజ్ ప్లాన్ చేయగా.. షోలు చాలా వరకు సోల్డ్ ఔట్ అయిపోయాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భారీగా వసూళ్లు రాబట్టింది ‘పుష్ప-2’. రిలీజ్కు ఒక్క రోజు ముందే వంద కోట్ల వసూళ్లంటే సామాన్యమైన విషయం కాదు.
తొలి రోజు మొత్తం రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ఈజీగా రూ.200 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం. ట్రేడ్ పండిట్లయితే డే-1 రూ.250 కోట్ల మార్కును కూడా టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావాలే కానీ.. వెయ్యి కోట్ల వసూళ్లు కేక్ వాకే.
This post was last modified on December 4, 2024 7:34 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…