ధనుష్ కి తెలుగులో మార్కెట్ ఏర్పడేందుకు దోహదపడిన సినిమా రఘువరన్ బిటెక్. అనిరుధ్ రవిచందర్ మేజిక్ మొదలయ్యింది కూడా ఇక్కడి నుంచే. అందులో ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉండే తెలివైన కుర్రాడిగా ధనుష్ పాత్ర టాలీవుడ్ యువతకు బాగా ఎక్కేసింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. కొన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత తనకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఆపై తన స్థాయి బ్లాక్ బస్టర్ దక్కకపోయినా ధనుష్ డబ్బింగ్ మూవీస్ క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. ఆ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ప్రభావం అంతలా ఉంది.
రీ రిలీజుల ట్రెండ్ క్రమంగా తగ్గిందనుకుంటున్న టైంలో రఘువరన్ బిటెక్ మళ్ళీ థియేటర్లకు వస్తోంది. జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణముంది. ధనుష్ 3 మొదటిసారి విడుదలైనప్పుడు పెద్ద డిజాస్టర్. కానీ గత ఏడాది కాలంలో రెండు మూడుసార్లు రిలీజ్ చేస్తే వసూళ్ల వర్షం కురిసింది. కాలేజీ కుర్రకారు ఎగబడి చూశారు. హైదరాబాదే కాదు చిన్న సెంటర్లలోనూ వసూళ్లు తెప్పించి డిస్ట్రిబ్యూటర్ జేబు నింపింది. దానికే అంత స్పందన వచ్చినప్పుడు నిజమైన కల్ట్ గా నిలిచిన రఘువరన్ బిటెక్ కు ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు.
తెలివిగా సంక్రాంతి హడావిడికి ఆరు రోజుల ముందు రిలీజ్ చేయడం మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. జనవరి 10 గేమ్ ఛేంజర్ నుంచి ఎలాగూ థియేటర్లు పూర్తిగా పండగ సినిమాలకు అంకితమవుతాయి. దానికి ముందు వారం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఫీడింగ్ కు రఘువరన్ బిటెక్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో పాటలకు పెద్ద రీచ్ ఉంది. చూడండి సారూ, పోపోవే ఏకాంతంతో పాటు మదర్ సెంటిమెంట్ సాంగ్ అప్పట్లో చార్ట్ బస్టర్స్. ఇంతగా మేజిక్ చేసింది కాబట్టే మళ్ళీ వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో తీసుకొస్తున్నారు. ఇప్పుడెలా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి.
This post was last modified on December 4, 2024 11:52 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…