ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘విరాట పర్వం’ తర్వాత అతను హీరోగా నటించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ‘స్పై’ మూవీలో క్యామియో రోల్, ‘వేట్టయాన్’ల విలన్ పాత్రల్లో మెరిసిన అతను.. హీరోగా మాత్రం ఏ సినిమా కన్ఫమ్ చేయట్లేదు. చాన్నాళ్ల ముందే ఓకే అయిన సినిమాలు ఏవీ ఇప్పట్లో పట్టాలెక్కే సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. దీంతో రానా ఫ్యాన్స్ ఒకింత నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ కోసం టాక్ షో చేస్తున్న రానా.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన నుంచి మూడు క్రేజీ ప్రాజెక్టులు వస్తాయని.. కానీ వాటికి కొంచెం టైం పడుతుందని అతను స్పష్టత ఇచ్చాడు.
రానా డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘హిరణ్య కశ్యప’ను చాన్నాళ్ల కిందటే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ముందు గుణశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడన్నారు. ఆయన ఈ ప్రాజెక్టు మీద చాన్నాళ్లు పని చేశారు. కానీ తర్వాత ఆయన్ని తప్పించేశారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తుండగా.. దర్శకుడిని ఓకే చేసి సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. దీని గురించి రానా మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద స్కేల్లో చేయాల్సిన సినిమా అని.. అమర్ చిత్ర కథల నుంచి స్క్రిప్టు తీసుకున్న తాము… ప్రి ప్రొడక్షన్ అంతా పూర్తి చేసి సినిమాను మొదలుపెడతామని చెప్పాడు.
ఇక తేజతో చేయాల్సిన ‘రాక్షస రాజు’ గురించి చెబుతూ.. తమ కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ పెద్ద హిట్టయిందని.. దానికి ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమా చేయాల్సి ఉందని.. కథ కూడా ఆ స్టయిల్లోనే ఉంటుందని.. ఇంకా బాగా చేయాలనే లక్ష్క్ష్యంతోనే టీం పని చేస్తోందని.. అందుకే ఇది కూడా ఆలస్యం అవుతోందని రానా తెలిపాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్తో తాను చేయాల్సిన ఓ సినిమా కూడా కచ్చితంగా ఉంటుందని.. ఆయన కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నాడని.. కానీ తమ కలయికలో సినిమా మాత్రం వస్తుందని రానా కన్ఫమ్ చేశాడు. బహుశా వచ్చే ఏడాది రాక్షస రాజు, హిరణ్య కశ్యప ఒకదాని తర్వాత ఒకటి మొదలు కావచ్చేమో. త్రివిక్రమ్తో రానా సినిమాకు మాత్రం బాగానే టైం పట్టొచ్చు.
This post was last modified on December 3, 2024 6:06 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…