ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘విరాట పర్వం’ తర్వాత అతను హీరోగా నటించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ‘స్పై’ మూవీలో క్యామియో రోల్, ‘వేట్టయాన్’ల విలన్ పాత్రల్లో మెరిసిన అతను.. హీరోగా మాత్రం ఏ సినిమా కన్ఫమ్ చేయట్లేదు. చాన్నాళ్ల ముందే ఓకే అయిన సినిమాలు ఏవీ ఇప్పట్లో పట్టాలెక్కే సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. దీంతో రానా ఫ్యాన్స్ ఒకింత నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ కోసం టాక్ షో చేస్తున్న రానా.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన నుంచి మూడు క్రేజీ ప్రాజెక్టులు వస్తాయని.. కానీ వాటికి కొంచెం టైం పడుతుందని అతను స్పష్టత ఇచ్చాడు.
రానా డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘హిరణ్య కశ్యప’ను చాన్నాళ్ల కిందటే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ముందు గుణశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడన్నారు. ఆయన ఈ ప్రాజెక్టు మీద చాన్నాళ్లు పని చేశారు. కానీ తర్వాత ఆయన్ని తప్పించేశారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తుండగా.. దర్శకుడిని ఓకే చేసి సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. దీని గురించి రానా మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద స్కేల్లో చేయాల్సిన సినిమా అని.. అమర్ చిత్ర కథల నుంచి స్క్రిప్టు తీసుకున్న తాము… ప్రి ప్రొడక్షన్ అంతా పూర్తి చేసి సినిమాను మొదలుపెడతామని చెప్పాడు.
ఇక తేజతో చేయాల్సిన ‘రాక్షస రాజు’ గురించి చెబుతూ.. తమ కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ పెద్ద హిట్టయిందని.. దానికి ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమా చేయాల్సి ఉందని.. కథ కూడా ఆ స్టయిల్లోనే ఉంటుందని.. ఇంకా బాగా చేయాలనే లక్ష్క్ష్యంతోనే టీం పని చేస్తోందని.. అందుకే ఇది కూడా ఆలస్యం అవుతోందని రానా తెలిపాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్తో తాను చేయాల్సిన ఓ సినిమా కూడా కచ్చితంగా ఉంటుందని.. ఆయన కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నాడని.. కానీ తమ కలయికలో సినిమా మాత్రం వస్తుందని రానా కన్ఫమ్ చేశాడు. బహుశా వచ్చే ఏడాది రాక్షస రాజు, హిరణ్య కశ్యప ఒకదాని తర్వాత ఒకటి మొదలు కావచ్చేమో. త్రివిక్రమ్తో రానా సినిమాకు మాత్రం బాగానే టైం పట్టొచ్చు.
This post was last modified on December 3, 2024 6:06 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…