పుష్ప 2 ది రూల్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరికిచ్చారనే సందిగ్ధం తొలగీ తొలగనట్టు కనిపిస్తోంది. ముందు తమన్ అన్నారు. అతనూ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ లో తనకిచ్చిన బాధ్యత పూర్తి చేశానని అన్నాడు. తర్వాత అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ పేర్లు వినిపించాయి. కానీ నిన్న హైదరాబాద్ వేడుకలో ఎక్కడా వీళ్ళ ప్రస్తావన రాలేదు. ఇంట్రో గురించి రాజమౌళి మాట్లాడుతూ డిఎస్పినే హైలైట్ చేశాడు. సుకుమార్, నిర్మాతలు సైతం తన పనితనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి బాగా ఎలివేట్ చేశారు. కట్ చేస్తే ఇవాళ సామ్ సిఎస్ థాంక్స్ ట్వీట్ పెట్టడం చిన్న ట్విస్ట్.
తనకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి మ్యాగ్నమ్ ఓపస్ కు పని చేయడం గొప్ప అనుభూతి ఇచ్చిందని పేర్కొంటూ ప్రత్యేకంగా పవర్ ప్యాక్డ్ ఫైట్ ఎపిసోడ్లు, క్లైమాక్స్ కు నేపధ్య సంగీతం ఇవ్వడం గురించి పేర్కొన్నారు. మరి దేవి ఎంత భాగానికి ఇచ్చాడు, సామ్ ఏఏ భాగాలకు పని చేశాడన్నది గుర్తించడం కష్టమనేలా ఉంది. రేపు థియేటర్లో చూశాక సౌండింగ్, ఇన్స్ ట్రుమెంట్స్ ని బట్టి ఏమైనా ట్రై చేయాలి తప్పించి ఒకే ప్రాజెక్టు మీద ఇద్దరు ముగ్గురు పని చేసినప్పుడు ఇదే సమస్య ఉంటుంది. ఎల్లుండి పుష్ప 2 బిగినింగ్ లేదా ముగింపు టైటిల్స్ లో పేర్లు చూశాకే ఒక క్లారిటీ వచ్చేలా ఉంది.
ఏది ఏమైనా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2కి బెస్ట్ ఇచ్చాడనేది వాస్తవం. పాటలు దాన్ని ప్రూవ్ చేశాయి. పీలింగ్స్ లాంటి మాస్ సాంగ్ సైతం జనంలోకి బాగా వెళ్ళింది. దెబ్బలు పడతాయి ముందు అనుకున్నట్టు స్లో పాయిజన్ అయ్యింది. దానికి ముందు టైటిల్ సాంగ్, సూసెకి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ట్రైలర్ బీజీఎమ్ ఇచ్చింది దేవినే. నిన్న ఎక్కువ పొగడ్తలు దక్కింది కూడా తనకే. ఫైనల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అయితే అదే సంతోషం. ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కోరుకుంటున్నది అదే. కిరణ్ అబ్బవరం ‘క’ విజయంలో కీలక పాత్ర పోషించిన సామ్ పుష్ప 2కి అంతకు పదింతలు ఇచ్చి ఉంటాడు.
This post was last modified on December 3, 2024 1:18 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…