కరోనా కల్లోలంలో చాలా మంది దర్శకులు, హీరోల ప్లాన్స్ భగ్నమయ్యాయి. వరుస హిట్లు కొడుతోన్న అనిల్ రావిపూడి తన ‘ఎఫ్ 3’ సినిమా మొదలు పెట్టే వీల్లేని సిట్యువేషన్లో పడ్డాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ వచ్చే ఏప్రిల్ తర్వాతే అందుబాటులోకి వస్తారు. మిగతా హీరోలంతా కూడా బిజీగా వున్నారు. దీంతో ఎప్పట్నుంచో తన దగ్గరున్న ఒక హీరోయిన్ సెంట్రిక్ కథను తెరకెక్కించాలని రావిపూడి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
హీరోయిన్ ప్రధాన కథ అయినా కానీ తన మార్కు వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవని వెరైటీ కాన్సెప్ట్ అట. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ అయితే బాగుంటుందని ఆమెను కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. సాయి పల్లవి ఈమధ్య ఎక్కువ సినిమాలు సైన్ చేస్తోంది. గతంలో తన పాత్ర, కథ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా వుండేది కానీ ఇప్పుడు కొంచెం అటు, ఇటు అయినా ఓకే అనేస్తోంది.
అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ఫుల్ దర్శకుడు, హీరోయిన్ ప్రధాన సినిమా అంటే ఆమె నో చెప్పడానికి రీజన్ ఏమీ లేదు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో వున్న ఈ చిత్రం అన్నీ ఓకే అయితే త్వరలోనే అనౌన్స్ కావచ్చు.
This post was last modified on October 8, 2020 4:01 pm
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…