కరోనా కల్లోలంలో చాలా మంది దర్శకులు, హీరోల ప్లాన్స్ భగ్నమయ్యాయి. వరుస హిట్లు కొడుతోన్న అనిల్ రావిపూడి తన ‘ఎఫ్ 3’ సినిమా మొదలు పెట్టే వీల్లేని సిట్యువేషన్లో పడ్డాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ వచ్చే ఏప్రిల్ తర్వాతే అందుబాటులోకి వస్తారు. మిగతా హీరోలంతా కూడా బిజీగా వున్నారు. దీంతో ఎప్పట్నుంచో తన దగ్గరున్న ఒక హీరోయిన్ సెంట్రిక్ కథను తెరకెక్కించాలని రావిపూడి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
హీరోయిన్ ప్రధాన కథ అయినా కానీ తన మార్కు వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవని వెరైటీ కాన్సెప్ట్ అట. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ అయితే బాగుంటుందని ఆమెను కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. సాయి పల్లవి ఈమధ్య ఎక్కువ సినిమాలు సైన్ చేస్తోంది. గతంలో తన పాత్ర, కథ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా వుండేది కానీ ఇప్పుడు కొంచెం అటు, ఇటు అయినా ఓకే అనేస్తోంది.
అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ఫుల్ దర్శకుడు, హీరోయిన్ ప్రధాన సినిమా అంటే ఆమె నో చెప్పడానికి రీజన్ ఏమీ లేదు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో వున్న ఈ చిత్రం అన్నీ ఓకే అయితే త్వరలోనే అనౌన్స్ కావచ్చు.
This post was last modified on October 8, 2020 4:01 pm
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…