కరోనా కల్లోలంలో చాలా మంది దర్శకులు, హీరోల ప్లాన్స్ భగ్నమయ్యాయి. వరుస హిట్లు కొడుతోన్న అనిల్ రావిపూడి తన ‘ఎఫ్ 3’ సినిమా మొదలు పెట్టే వీల్లేని సిట్యువేషన్లో పడ్డాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ వచ్చే ఏప్రిల్ తర్వాతే అందుబాటులోకి వస్తారు. మిగతా హీరోలంతా కూడా బిజీగా వున్నారు. దీంతో ఎప్పట్నుంచో తన దగ్గరున్న ఒక హీరోయిన్ సెంట్రిక్ కథను తెరకెక్కించాలని రావిపూడి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
హీరోయిన్ ప్రధాన కథ అయినా కానీ తన మార్కు వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవని వెరైటీ కాన్సెప్ట్ అట. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ అయితే బాగుంటుందని ఆమెను కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. సాయి పల్లవి ఈమధ్య ఎక్కువ సినిమాలు సైన్ చేస్తోంది. గతంలో తన పాత్ర, కథ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా వుండేది కానీ ఇప్పుడు కొంచెం అటు, ఇటు అయినా ఓకే అనేస్తోంది.
అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ఫుల్ దర్శకుడు, హీరోయిన్ ప్రధాన సినిమా అంటే ఆమె నో చెప్పడానికి రీజన్ ఏమీ లేదు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో వున్న ఈ చిత్రం అన్నీ ఓకే అయితే త్వరలోనే అనౌన్స్ కావచ్చు.
This post was last modified on October 8, 2020 4:01 pm
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీ.జోసెఫ్ విజయ్ అను నాను..…
ఇప్పటి హీరోల్లో వచ్చామా నటించామా వెళ్లిపోయామా అనుకునే వాళ్లు తక్కువమంది. కథా చర్చల్లో భాగమవుతున్నారు. స్క్రిప్టులు రాస్తున్నారు. దర్శకత్వం కూడా…
తమిళేనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్న స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అదినేత జోసెఫ్ విజయ్ కి…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…