కరోనా కల్లోలంలో చాలా మంది దర్శకులు, హీరోల ప్లాన్స్ భగ్నమయ్యాయి. వరుస హిట్లు కొడుతోన్న అనిల్ రావిపూడి తన ‘ఎఫ్ 3’ సినిమా మొదలు పెట్టే వీల్లేని సిట్యువేషన్లో పడ్డాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ వచ్చే ఏప్రిల్ తర్వాతే అందుబాటులోకి వస్తారు. మిగతా హీరోలంతా కూడా బిజీగా వున్నారు. దీంతో ఎప్పట్నుంచో తన దగ్గరున్న ఒక హీరోయిన్ సెంట్రిక్ కథను తెరకెక్కించాలని రావిపూడి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
హీరోయిన్ ప్రధాన కథ అయినా కానీ తన మార్కు వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవని వెరైటీ కాన్సెప్ట్ అట. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ అయితే బాగుంటుందని ఆమెను కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. సాయి పల్లవి ఈమధ్య ఎక్కువ సినిమాలు సైన్ చేస్తోంది. గతంలో తన పాత్ర, కథ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా వుండేది కానీ ఇప్పుడు కొంచెం అటు, ఇటు అయినా ఓకే అనేస్తోంది.
అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ఫుల్ దర్శకుడు, హీరోయిన్ ప్రధాన సినిమా అంటే ఆమె నో చెప్పడానికి రీజన్ ఏమీ లేదు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో వున్న ఈ చిత్రం అన్నీ ఓకే అయితే త్వరలోనే అనౌన్స్ కావచ్చు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…