Movie News

ఫ్లాప్‍ హీరోకి దూరంగా నాగ చైతన్య!

నాగ చైతన్య తమ అన్నపూర్ణ, మనం ఎంటర్‍టైన్‍మెంట్స్ కి సంబంధం లేకుండా స్వయంగా ఒక నిర్మాణ సంస్థ మొదలు పెడుతున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. భారీ చిత్రాలు కాకుండా ఒక లో బడ్జెట్‍ సినిమాతో చైతన్య సంస్థ మొదలవుతుందని, మొదటి సినిమాలో రాజ్‍ తరుణ్‍ హీరోగా నటిస్తాడని కూడా న్యూస్‍ వచ్చింది. ఒరేయ్‍ బుజ్జిగా క్లిక్‍ అయినట్టయితే ఈ చిత్రం చేసి వుండేవాడో లేదో తెలియదు కానీ ఇప్పుడయితే రాజ్‍ తరుణ్‍తో సినిమా చైతన్య డ్రాప్‍ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

చూస్తూ, చూస్తూ ఫ్లాప్స్లో వున్న హీరోతో సినిమా ఎందుకనుకున్నాడో, లేక లాక్‍డౌన్‍ వల్ల తన సినిమాలు డిలే అవడం వల్ల ఇప్పుడు నిర్మాణం చేసే తీరిక లేదో తెలియదు కానీ నాగచైతన్య సొంత బ్యానర్‍ మొదలు కావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. ఇక రాజ్‍ తరుణ్‍ విషయానికి వస్తే అతడికి జనాకర్షణ బాగా తగ్గిపోయిందనే ఫీలింగ్‍ నిర్మాతలకు వచ్చేయడంతో అతడితో మూవీస్‍ ప్లాన్‍ చేసిన నిర్మాతలు కూడా వెనకాడుతున్నారు. పెద్ద నిర్మాతలకు రెమ్యూనరేషన్‍ లేకుండా చేయడానికి కూడా అతను సిద్ధంగా వున్నా కానీ సినిమాపై పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించక ఎవరూ ముందుకు రావడం లేదట.

This post was last modified on October 8, 2020 4:00 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

4 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

7 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

11 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

12 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

13 hours ago