నాగ చైతన్య తమ అన్నపూర్ణ, మనం ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధం లేకుండా స్వయంగా ఒక నిర్మాణ సంస్థ మొదలు పెడుతున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. భారీ చిత్రాలు కాకుండా ఒక లో బడ్జెట్ సినిమాతో చైతన్య సంస్థ మొదలవుతుందని, మొదటి సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తాడని కూడా న్యూస్ వచ్చింది. ఒరేయ్ బుజ్జిగా క్లిక్ అయినట్టయితే ఈ చిత్రం చేసి వుండేవాడో లేదో తెలియదు కానీ ఇప్పుడయితే రాజ్ తరుణ్తో సినిమా చైతన్య డ్రాప్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చూస్తూ, చూస్తూ ఫ్లాప్స్లో వున్న హీరోతో సినిమా ఎందుకనుకున్నాడో, లేక లాక్డౌన్ వల్ల తన సినిమాలు డిలే అవడం వల్ల ఇప్పుడు నిర్మాణం చేసే తీరిక లేదో తెలియదు కానీ నాగచైతన్య సొంత బ్యానర్ మొదలు కావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే అతడికి జనాకర్షణ బాగా తగ్గిపోయిందనే ఫీలింగ్ నిర్మాతలకు వచ్చేయడంతో అతడితో మూవీస్ ప్లాన్ చేసిన నిర్మాతలు కూడా వెనకాడుతున్నారు. పెద్ద నిర్మాతలకు రెమ్యూనరేషన్ లేకుండా చేయడానికి కూడా అతను సిద్ధంగా వున్నా కానీ సినిమాపై పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించక ఎవరూ ముందుకు రావడం లేదట.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…