నాగ చైతన్య తమ అన్నపూర్ణ, మనం ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధం లేకుండా స్వయంగా ఒక నిర్మాణ సంస్థ మొదలు పెడుతున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. భారీ చిత్రాలు కాకుండా ఒక లో బడ్జెట్ సినిమాతో చైతన్య సంస్థ మొదలవుతుందని, మొదటి సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తాడని కూడా న్యూస్ వచ్చింది. ఒరేయ్ బుజ్జిగా క్లిక్ అయినట్టయితే ఈ చిత్రం చేసి వుండేవాడో లేదో తెలియదు కానీ ఇప్పుడయితే రాజ్ తరుణ్తో సినిమా చైతన్య డ్రాప్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చూస్తూ, చూస్తూ ఫ్లాప్స్లో వున్న హీరోతో సినిమా ఎందుకనుకున్నాడో, లేక లాక్డౌన్ వల్ల తన సినిమాలు డిలే అవడం వల్ల ఇప్పుడు నిర్మాణం చేసే తీరిక లేదో తెలియదు కానీ నాగచైతన్య సొంత బ్యానర్ మొదలు కావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే అతడికి జనాకర్షణ బాగా తగ్గిపోయిందనే ఫీలింగ్ నిర్మాతలకు వచ్చేయడంతో అతడితో మూవీస్ ప్లాన్ చేసిన నిర్మాతలు కూడా వెనకాడుతున్నారు. పెద్ద నిర్మాతలకు రెమ్యూనరేషన్ లేకుండా చేయడానికి కూడా అతను సిద్ధంగా వున్నా కానీ సినిమాపై పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించక ఎవరూ ముందుకు రావడం లేదట.
This post was last modified on October 8, 2020 4:00 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…