ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను యూట్యూబ్ లో చూసిన ఫ్యాన్స్ నేరుగా తమను ఎప్పుడు కలుస్తాడాని వెయిట్ చేశారు. వాళ్ళ నిరీక్షణ ఫలిస్తూ హైదరాబాద్ లో జరిగిన వైల్డ్ ఫైర్ మాస్ జాతరలో బన్నీ మాట్లాడాడు. సాధారణంగా జరిగే ఈవెంట్లకు భిన్నంగా ఈసారి కొంత ఆలస్యం కావడంతో హీరో స్పీచ్ ఏకంగా రాత్రి పదకొండుగంటలకు జరగడం అరుదు. అయినా అంత సేపు చలిలో వేలాది ఫ్యాన్స్ గ్రౌండ్ లోనే ఉండటం విశేషం. ఒక ఫ్యాన్ ఏకంగా స్టేజి మీదకు దూసుకొస్తే బన్నీ ఫోటో ఇచ్చాడు.
ఇక తన ప్రసంగంలో అల్లు అర్జున్ థాంక్స్ చెప్పడానికి మాత్రమే పరిమితం కావడం తప్ప ఏమి చేయలేనని చెబుతూ టెక్నీషియన్లు, నటీనటులు, నిర్మాతల గురించి ప్రస్తావించాడు. ముఖ్యంగా క్యూబా, దేవిశ్రీ ప్రసాద్, రవి శంకర్, నవీన్ యెర్నేనిలతో పాటు చెర్రీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. రష్మిక మీద పొగడ్తల వర్షం కురిపించాడు. రెండు రోజులు వరసగా నిద్ర లేకుండా పీలింగ్స్ పాట కోసం కష్టపడటం చూశానని, ప్రొఫెషనలిజం ఉంటే తప్ప అంత అంకిత భావం ఉండదని, అయిదు సంవత్సరాలు కలిసి పని చేయడం గురించి జ్ఞాపకాలు పంచుకున్నాడు. శ్రీలీల చలాకీదనం వర్ణించడం మరో హైలైట్.
సుకుమార్ గురించి చెబుతూ మూడు సందర్భాల్లో పుష్ప 2 బలంగా ఆడాలని కోరుకున్నానని, యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్కరు మూడేళ్లు తమ జీవితాన్ని త్యాగం చేశారని వాటి గురించి చెప్పుకొచ్చాడు. ఆర్యతో మొదలైన అనుబంధం సుకుమార్ ని తన జీవితంలో భాగం చేసిందన్న అల్లు అర్జున్ ఒకసారి సుక్కు ఒత్తిడికి బ్రేక్ డౌన్ అయితే ఆయన కోసమే ఈ సినిమా బ్లాక్ బస్టరవ్వాలని కోరుకున్నానని చెప్పాడు. చాలా హైగా ప్రిపేరై వస్తే భావోద్వేగం వల్ల స్పీచ్ మార్చుకోవాల్సి వచ్చిందని, 12 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల కాబోతున్న పుష్ప 2 ఖచ్చితంగా అలరిస్తుందని గ్యారెంటీ ఇస్తూ బన్నీ ప్రసంగం ముగిసింది.
This post was last modified on December 2, 2024 11:49 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…