హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్ జాతరలో అల్లు అరవింద్ తన పుత్రోత్సాహాన్ని పంచుకున్నారు. వారం రోజుల క్రితమే సినిమా చూశానని, షో అయ్యాక ఇంట్లో భార్య పలకరించి మొహం ఏంటి ఇంత వెలిగిపోతుందని అడిగారట. దానికి సమాధానంగా అరవింద్ పుష్ప 2 బాగుందని, బ్రహ్మాండంగా నచ్చిందని అన్నారట. దానికావిడ నీ మొహం ఇన్ని సంవత్సరాల్లో రెండుసార్లే ఇలా వెలగడం చూశాను, ఒకటి మగధీర రిలీజ్ కు ముందు మరొకటి ఇప్పుడు పుష్ప 2 ముందు అన్నారట. అంటే దశాబ్దాల అనుభవంలో అరవింద్ అరుదైన క్షణాలు ఇవేనన్న మాట.
మేనల్లుడు రామ్ చరణ్, కొడుకు అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన ఆనందాన్ని అల్లు అరవింద్ ఈ రకంగా ఆస్వాదించడాన్ని అభిమానులు ఈ రోజు చూశారు. ఇలాంటి హిట్లు, బ్లాక్ బస్టర్లు గతంలో ఆయన ఎన్నో చూశారు. చిరంజీవి హీరోగా తీసిన ఎన్నో చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి. కానీ వాళ్లిద్దరూ ఒకే తరానికి చెందినవాళ్లు, అందులోనూ స్నేహితుల్లా మెలిగిన బావాబావమరుదులు కాబట్టి పైకి చెప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ పిల్లలు సాధిస్తున్న వాటిని చూస్తూ ఆ సంతోషాన్ని వ్యక్తపరిచే సందర్భం వచ్చినప్పుడు మాత్రం వదులుకోకూడదు. అరవింద్ అదే చేశారు.
మగధీర ప్రస్తావన తేవడం ద్వారా అరవింద్ చెప్పిన మాటలు మెగా ఫ్యాన్స్ కి రీచ్ అవుతాయి. ఇప్పటికే పలు కారణాల వల్ల ఆన్ లైన్ లో కొన్ని వర్గాలు ఉప్పునిప్పు గా మారిన నేపథ్యంలో ఇలాంటివి చెప్పడం అవసరం. పుష్ప 2 గురించి వచ్చిన గెస్టులు ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే మాత్రం డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో రచ్చ ఓ రేంజ్ లో ఉండబోతోందనేది అర్థమైపోయింది. అరవింద్ ఒక్కరే కాదు అతిథులుగా వచ్చిన రాజమౌళి, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ ఒకరిని మించి మరొకరు పుష్ప 2 గురించి వర్ణిస్తూ అంతకంతా అంచనాలు పెంచేశారు. ఇక బాక్సాఫీస్ బద్దలవ్వడమే బాకీ.
This post was last modified on December 2, 2024 10:58 pm
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…