తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం జరగడం ఐకాన్ స్టార్ అభిమానులను టెన్షన్ పెట్టింది. ఇదిగో అదిగో అంటూ నిన్నటి నుంచి ఊరింపులే తప్ప సరైన అప్డేట్ లేక ఆందోళన చెందారు. రావడం ఖరారే అయినప్పటికీ ఎంత మొత్తంలో హైక్ ఉంటుందనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వాటికి చెక్ పెడుతూ జీవో వచ్చేసింది. కొంచెం అటుఇటుగా తేదీలలో మార్పులతో నైజామ్ రేట్లే ఇక్కడ అమలు కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ధర ఉండటం చాలా ఏళ్ళ తర్వాత ఇదే.
ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 4 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు వేయబోయే ప్రీమియర్లకు టికెట్ కు 800 రూపాయల చొప్పున పెంచుకోవచ్చు. దీనికి అదనంగా జిఎస్టి ఉంటుంది. డిసెంబర్ 5 రిలీజ్ రోజు మొత్తం ఆరు షోలకు పర్మిషన్ వచ్చింది. సింగల్ స్క్రీన్లలో రెండో తరగతి అదనంగా 100 రూపాయలు, మొదటి తరగతి 150 రూపాయలు అదనంగా ధర ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు ప్రతి టికెట్ మీద ఎక్స్ ట్రా ఛార్జ్ చేయొచ్చు. డిసెంబర్ 6 నుంచి ఇవే ధరలతో అయిదు షోలు కొనసాగుతాయి. ఈ రేట్లన్నీ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటాయి. మూడో వారం నుంచి సాధారణ స్థితి.
సో ఏ క్షణమైనా ఏపీ టికెట్ బుకింగ్స్ ఆన్ లైన్ లో పెట్టేస్తారు. ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్ రేపటి నుంచి నమోదు చేయబోయే నెంబర్లకు మతులు పోవడం ఖాయం. ముఖ్యంగా ధర ఎక్కువగా ఉన్నా సరే ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లా మారిపోతున్నాయి. ఇంకా యాప్స్ లో పెట్టనప్పటికీ థియేటర్ యాజమాన్యాల మీద ఒత్తిడి మొదలైపోయింది. జిఓ ఇచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ వెంటనే ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేయడం విశేషం. పెద్ద సస్పెన్స్ కు తెరపడిపోయింది. ఇక ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
This post was last modified on December 3, 2024 11:33 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…