తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం జరగడం ఐకాన్ స్టార్ అభిమానులను టెన్షన్ పెట్టింది. ఇదిగో అదిగో అంటూ నిన్నటి నుంచి ఊరింపులే తప్ప సరైన అప్డేట్ లేక ఆందోళన చెందారు. రావడం ఖరారే అయినప్పటికీ ఎంత మొత్తంలో హైక్ ఉంటుందనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వాటికి చెక్ పెడుతూ జీవో వచ్చేసింది. కొంచెం అటుఇటుగా తేదీలలో మార్పులతో నైజామ్ రేట్లే ఇక్కడ అమలు కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ధర ఉండటం చాలా ఏళ్ళ తర్వాత ఇదే.
ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 4 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు వేయబోయే ప్రీమియర్లకు టికెట్ కు 800 రూపాయల చొప్పున పెంచుకోవచ్చు. దీనికి అదనంగా జిఎస్టి ఉంటుంది. డిసెంబర్ 5 రిలీజ్ రోజు మొత్తం ఆరు షోలకు పర్మిషన్ వచ్చింది. సింగల్ స్క్రీన్లలో రెండో తరగతి అదనంగా 100 రూపాయలు, మొదటి తరగతి 150 రూపాయలు అదనంగా ధర ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు ప్రతి టికెట్ మీద ఎక్స్ ట్రా ఛార్జ్ చేయొచ్చు. డిసెంబర్ 6 నుంచి ఇవే ధరలతో అయిదు షోలు కొనసాగుతాయి. ఈ రేట్లన్నీ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటాయి. మూడో వారం నుంచి సాధారణ స్థితి.
సో ఏ క్షణమైనా ఏపీ టికెట్ బుకింగ్స్ ఆన్ లైన్ లో పెట్టేస్తారు. ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్ రేపటి నుంచి నమోదు చేయబోయే నెంబర్లకు మతులు పోవడం ఖాయం. ముఖ్యంగా ధర ఎక్కువగా ఉన్నా సరే ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లా మారిపోతున్నాయి. ఇంకా యాప్స్ లో పెట్టనప్పటికీ థియేటర్ యాజమాన్యాల మీద ఒత్తిడి మొదలైపోయింది. జిఓ ఇచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ వెంటనే ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేయడం విశేషం. పెద్ద సస్పెన్స్ కు తెరపడిపోయింది. ఇక ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…