Movie News

ఏపీ టికెట్ రేట్లు వచ్చేశాయి… పవన్ కి థాంక్స్ చెప్పిన బన్నీ!

తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం జరగడం ఐకాన్ స్టార్ అభిమానులను టెన్షన్ పెట్టింది. ఇదిగో అదిగో అంటూ నిన్నటి నుంచి ఊరింపులే తప్ప సరైన అప్డేట్ లేక ఆందోళన చెందారు. రావడం ఖరారే అయినప్పటికీ ఎంత మొత్తంలో హైక్ ఉంటుందనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వాటికి చెక్ పెడుతూ జీవో వచ్చేసింది. కొంచెం అటుఇటుగా తేదీలలో మార్పులతో నైజామ్ రేట్లే ఇక్కడ అమలు కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ధర ఉండటం చాలా ఏళ్ళ తర్వాత ఇదే.

ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 4 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు వేయబోయే ప్రీమియర్లకు టికెట్ కు 800 రూపాయల చొప్పున పెంచుకోవచ్చు. దీనికి అదనంగా జిఎస్టి ఉంటుంది. డిసెంబర్ 5 రిలీజ్ రోజు మొత్తం ఆరు షోలకు పర్మిషన్ వచ్చింది. సింగల్ స్క్రీన్లలో రెండో తరగతి అదనంగా 100 రూపాయలు, మొదటి తరగతి 150 రూపాయలు అదనంగా ధర ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు ప్రతి టికెట్ మీద ఎక్స్ ట్రా ఛార్జ్ చేయొచ్చు. డిసెంబర్ 6 నుంచి ఇవే ధరలతో అయిదు షోలు కొనసాగుతాయి. ఈ రేట్లన్నీ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటాయి. మూడో వారం నుంచి సాధారణ స్థితి.

సో ఏ క్షణమైనా ఏపీ టికెట్ బుకింగ్స్ ఆన్ లైన్ లో పెట్టేస్తారు. ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్ రేపటి నుంచి నమోదు చేయబోయే నెంబర్లకు మతులు పోవడం ఖాయం. ముఖ్యంగా ధర ఎక్కువగా ఉన్నా సరే ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లా మారిపోతున్నాయి. ఇంకా యాప్స్ లో పెట్టనప్పటికీ థియేటర్ యాజమాన్యాల మీద ఒత్తిడి మొదలైపోయింది. జిఓ ఇచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ వెంటనే ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేయడం విశేషం. పెద్ద సస్పెన్స్ కు తెరపడిపోయింది. ఇక ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.

This post was last modified on December 3, 2024 11:33 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

59 minutes ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

3 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

4 hours ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

4 hours ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

5 hours ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

5 hours ago