పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కనీసం ఒక్కసారైనా తలవకుండా ఉండలేని పేరు ఓజి. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముందు రిలీజయ్యేది హరిహర వీరమల్లే అయినా ఫ్యాన్స్ మాత్రం ఓజినే డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే బ్యాలన్స్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్న టీమ్ జనవరి లేదా ఫిబ్రవరిలో గుమ్మడికాయ కొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఒక కీలకమైన క్యామియో గురించి గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగడం చూస్తున్నాం.
ప్రభాస్ అని ఒకరు కాదు నాని అని మరొకరు ఇలా ఏదేదో తిరుగుతోంది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పాత్ర చేయబోయేది ఈ ఇద్దరు కాదట. బాబాయ్ అబ్బాయి మొదటిసారి కలయికని సాధ్యం చేస్తూ దర్శకుడు సుజిత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఒప్పించిన్నట్టు లేటెస్ట్ అప్డేట్. కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన చర్చ జరిగిందని, తక్కువ కాల్ షీట్ కాబట్టి అవసరమైనప్పుడు అడిగితే ఇస్తానని హామీ ఇచ్చాడట. దానికి అనుగుణంగానే త్వరలోనే దీన్ని షూట్ చేయొచ్చని అంటున్నారు. అధికారిక ప్రకటన లాంటిదేదీ లేదు కానీ ఇన్ సైడ్ టాక్ ఊరికే వచ్చిన గాలి మాట అయితే కాదు.
ఇది నిజమైతే కనక థియేటర్లు బ్లాస్ట్ కావడం ఖాయం. ఓజిలో పవన్ కళ్యాణ్ హీరోయిజంకి కొన్ని నిమిషాలే అయినా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే రోలెక్స్ రేంజ్ లో ఆ ఎపిసోడ్ కు పూనకాలు వచ్చేస్తాయి. 2025లో ఎప్పుడు విడుదల చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. క్వాలిటీ విషయంలో సుజిత్ రాజీ పడకుండా చూసుకుంటున్నాడు. విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోయినా విజువల్స్ నుంచి యాక్షన్ బ్లాక్స్ దాకా ప్రతిదీ శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నాడట. సంక్రాంతికి టీజర్ లేదా పాట రూపంలో ఏదైనా కీలక అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు.
This post was last modified on December 2, 2024 2:08 pm
ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…