పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కనీసం ఒక్కసారైనా తలవకుండా ఉండలేని పేరు ఓజి. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముందు రిలీజయ్యేది హరిహర వీరమల్లే అయినా ఫ్యాన్స్ మాత్రం ఓజినే డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే బ్యాలన్స్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్న టీమ్ జనవరి లేదా ఫిబ్రవరిలో గుమ్మడికాయ కొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఒక కీలకమైన క్యామియో గురించి గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగడం చూస్తున్నాం.
ప్రభాస్ అని ఒకరు కాదు నాని అని మరొకరు ఇలా ఏదేదో తిరుగుతోంది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పాత్ర చేయబోయేది ఈ ఇద్దరు కాదట. బాబాయ్ అబ్బాయి మొదటిసారి కలయికని సాధ్యం చేస్తూ దర్శకుడు సుజిత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఒప్పించిన్నట్టు లేటెస్ట్ అప్డేట్. కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన చర్చ జరిగిందని, తక్కువ కాల్ షీట్ కాబట్టి అవసరమైనప్పుడు అడిగితే ఇస్తానని హామీ ఇచ్చాడట. దానికి అనుగుణంగానే త్వరలోనే దీన్ని షూట్ చేయొచ్చని అంటున్నారు. అధికారిక ప్రకటన లాంటిదేదీ లేదు కానీ ఇన్ సైడ్ టాక్ ఊరికే వచ్చిన గాలి మాట అయితే కాదు.
ఇది నిజమైతే కనక థియేటర్లు బ్లాస్ట్ కావడం ఖాయం. ఓజిలో పవన్ కళ్యాణ్ హీరోయిజంకి కొన్ని నిమిషాలే అయినా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే రోలెక్స్ రేంజ్ లో ఆ ఎపిసోడ్ కు పూనకాలు వచ్చేస్తాయి. 2025లో ఎప్పుడు విడుదల చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. క్వాలిటీ విషయంలో సుజిత్ రాజీ పడకుండా చూసుకుంటున్నాడు. విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోయినా విజువల్స్ నుంచి యాక్షన్ బ్లాక్స్ దాకా ప్రతిదీ శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నాడట. సంక్రాంతికి టీజర్ లేదా పాట రూపంలో ఏదైనా కీలక అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు.
This post was last modified on December 2, 2024 2:08 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…