పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కనీసం ఒక్కసారైనా తలవకుండా ఉండలేని పేరు ఓజి. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముందు రిలీజయ్యేది హరిహర వీరమల్లే అయినా ఫ్యాన్స్ మాత్రం ఓజినే డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే బ్యాలన్స్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్న టీమ్ జనవరి లేదా ఫిబ్రవరిలో గుమ్మడికాయ కొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఒక కీలకమైన క్యామియో గురించి గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగడం చూస్తున్నాం.
ప్రభాస్ అని ఒకరు కాదు నాని అని మరొకరు ఇలా ఏదేదో తిరుగుతోంది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పాత్ర చేయబోయేది ఈ ఇద్దరు కాదట. బాబాయ్ అబ్బాయి మొదటిసారి కలయికని సాధ్యం చేస్తూ దర్శకుడు సుజిత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఒప్పించిన్నట్టు లేటెస్ట్ అప్డేట్. కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన చర్చ జరిగిందని, తక్కువ కాల్ షీట్ కాబట్టి అవసరమైనప్పుడు అడిగితే ఇస్తానని హామీ ఇచ్చాడట. దానికి అనుగుణంగానే త్వరలోనే దీన్ని షూట్ చేయొచ్చని అంటున్నారు. అధికారిక ప్రకటన లాంటిదేదీ లేదు కానీ ఇన్ సైడ్ టాక్ ఊరికే వచ్చిన గాలి మాట అయితే కాదు.
ఇది నిజమైతే కనక థియేటర్లు బ్లాస్ట్ కావడం ఖాయం. ఓజిలో పవన్ కళ్యాణ్ హీరోయిజంకి కొన్ని నిమిషాలే అయినా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే రోలెక్స్ రేంజ్ లో ఆ ఎపిసోడ్ కు పూనకాలు వచ్చేస్తాయి. 2025లో ఎప్పుడు విడుదల చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. క్వాలిటీ విషయంలో సుజిత్ రాజీ పడకుండా చూసుకుంటున్నాడు. విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోయినా విజువల్స్ నుంచి యాక్షన్ బ్లాక్స్ దాకా ప్రతిదీ శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నాడట. సంక్రాంతికి టీజర్ లేదా పాట రూపంలో ఏదైనా కీలక అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు.
సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అయ్యేలా ఉన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో…
తన కెరీర్లో ఇంకే చిత్రానికీ పడనంత కష్టాన్ని ‘పెద్ది’ సినిమా కోసం పడ్డాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.…
జాతీయ రాజకీయాలకు సంబంధించి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు…
వైసీపీ హయాంలో చెలరేగిపోయిన భూ మాఫియా కోరలు పీకామని.. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి…
దృశ్యం 3 థియేటర్లలో 200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకుల బుర్రలో…
‘గుంటూరు కారం’ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయాలనుకున్న చిత్రం.. గాడ్ ఆఫ్ వార్. తన కెరీర్లో తొలిసారిగా…