పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కనీసం ఒక్కసారైనా తలవకుండా ఉండలేని పేరు ఓజి. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముందు రిలీజయ్యేది హరిహర వీరమల్లే అయినా ఫ్యాన్స్ మాత్రం ఓజినే డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే బ్యాలన్స్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్న టీమ్ జనవరి లేదా ఫిబ్రవరిలో గుమ్మడికాయ కొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఒక కీలకమైన క్యామియో గురించి గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగడం చూస్తున్నాం.
ప్రభాస్ అని ఒకరు కాదు నాని అని మరొకరు ఇలా ఏదేదో తిరుగుతోంది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పాత్ర చేయబోయేది ఈ ఇద్దరు కాదట. బాబాయ్ అబ్బాయి మొదటిసారి కలయికని సాధ్యం చేస్తూ దర్శకుడు సుజిత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఒప్పించిన్నట్టు లేటెస్ట్ అప్డేట్. కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన చర్చ జరిగిందని, తక్కువ కాల్ షీట్ కాబట్టి అవసరమైనప్పుడు అడిగితే ఇస్తానని హామీ ఇచ్చాడట. దానికి అనుగుణంగానే త్వరలోనే దీన్ని షూట్ చేయొచ్చని అంటున్నారు. అధికారిక ప్రకటన లాంటిదేదీ లేదు కానీ ఇన్ సైడ్ టాక్ ఊరికే వచ్చిన గాలి మాట అయితే కాదు.
ఇది నిజమైతే కనక థియేటర్లు బ్లాస్ట్ కావడం ఖాయం. ఓజిలో పవన్ కళ్యాణ్ హీరోయిజంకి కొన్ని నిమిషాలే అయినా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే రోలెక్స్ రేంజ్ లో ఆ ఎపిసోడ్ కు పూనకాలు వచ్చేస్తాయి. 2025లో ఎప్పుడు విడుదల చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. క్వాలిటీ విషయంలో సుజిత్ రాజీ పడకుండా చూసుకుంటున్నాడు. విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోయినా విజువల్స్ నుంచి యాక్షన్ బ్లాక్స్ దాకా ప్రతిదీ శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నాడట. సంక్రాంతికి టీజర్ లేదా పాట రూపంలో ఏదైనా కీలక అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు.
This post was last modified on December 2, 2024 2:08 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…