నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తెరంగేట్రం ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ కం ఫాంటసీ డ్రామా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే మోక్షజ్ఞ ప్రీ లుక్స్ ఫోటోలు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. గతంలో చూసినదానికి ఇప్పటికి బోలెడు వ్యత్యాసం చూపించడంతో కుర్రాడి మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో జూనియర్ బాలకృష్ణతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా రెండో ప్రాజెక్ట్ లాక్ అయ్యే దిశగా ఉందని సమాచారం.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒక భారీ చిత్రానికి రంగం సిద్ధం చేస్తోందని తెలిసింది. డాకు మహారాజ్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే నిర్మాత నాగవంశీ బాలయ్యకు వెంకీ అట్లూరి నెరేషన్ ఇప్పించారట. అప్పటికే లక్కీ భాస్కర్ చూసి ఉండటంతో కథ నచ్చిన బాలకృష్ణ సానుకూలంగా స్పందించి ఫుల్ వెర్షన్ సిద్ధం చేసుకోమని చెప్పారని తెలిసింది. అనౌన్స్ మెంట్ ఇప్పటికిప్పుడు ఇచ్చే అవసరం లేదు కాబట్టి ప్రీ ప్రొడక్షన్ ముందు పూర్తి చేసుకుని ఆ తర్వాత ప్రకటన గురించి చూద్దామని చెప్పారట. ఒకవేళ నిజమైతే మాత్రం మోస్ట్ ఇంటరెస్టింగ్ కాంబోగా మోక్షజ్ఞ మూవీ నిలిచిపోతుంది.
సార్, లక్కీ భాస్కర్ రెండు బ్లాక్ బస్టర్స్ ని తమ సంస్థకు ఇచ్చిన వెంకీ అట్లూరిని సితార సంస్థ వదలడం లేదు. అందుకే మూడోది తమ బ్యానర్ లోనే లాక్ చేయించుకుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంట్రీనే కొంత లేట్ అయ్యింది కాబట్టి సినిమాలు చేసే విషయంలో మరీ నెమ్మదిగా ఉండకూడదని బాలయ్య, మోక్షజ్ఞ నిర్ణయించుకున్నారట. అందులోనూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు దొరికే పరిస్థితి అంత సులభం లేదు కాబట్టి దొరికినప్పుడే లాక్ చేసుకోవాలనే ఆలోచనతో కథలు వింటున్నారని ఇన్ సైడ్ టాక్. ఇవి కాకుండా ఆదిత్య 369 సీక్వెల్ లోనూ మోక్షజ్ఞ కనిపించే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పట్లో కాదు.
This post was last modified on December 2, 2024 11:44 am
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…