Movie News

మోక్షజ్ఞ రెండో సినిమాకి ‘లక్కీ’ డైరెక్టర్ రెడీ…

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తెరంగేట్రం ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ కం ఫాంటసీ డ్రామా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే మోక్షజ్ఞ ప్రీ లుక్స్ ఫోటోలు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. గతంలో చూసినదానికి ఇప్పటికి బోలెడు వ్యత్యాసం చూపించడంతో కుర్రాడి మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో జూనియర్ బాలకృష్ణతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా రెండో ప్రాజెక్ట్ లాక్ అయ్యే దిశగా ఉందని సమాచారం.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒక భారీ చిత్రానికి రంగం సిద్ధం చేస్తోందని తెలిసింది. డాకు మహారాజ్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే నిర్మాత నాగవంశీ బాలయ్యకు వెంకీ అట్లూరి నెరేషన్ ఇప్పించారట. అప్పటికే లక్కీ భాస్కర్ చూసి ఉండటంతో కథ నచ్చిన బాలకృష్ణ సానుకూలంగా స్పందించి ఫుల్ వెర్షన్ సిద్ధం చేసుకోమని చెప్పారని తెలిసింది. అనౌన్స్ మెంట్ ఇప్పటికిప్పుడు ఇచ్చే అవసరం లేదు కాబట్టి ప్రీ ప్రొడక్షన్ ముందు పూర్తి చేసుకుని ఆ తర్వాత ప్రకటన గురించి చూద్దామని చెప్పారట. ఒకవేళ నిజమైతే మాత్రం మోస్ట్ ఇంటరెస్టింగ్ కాంబోగా మోక్షజ్ఞ మూవీ నిలిచిపోతుంది.

సార్, లక్కీ భాస్కర్ రెండు బ్లాక్ బస్టర్స్ ని తమ సంస్థకు ఇచ్చిన వెంకీ అట్లూరిని సితార సంస్థ వదలడం లేదు. అందుకే మూడోది తమ బ్యానర్ లోనే లాక్ చేయించుకుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంట్రీనే కొంత లేట్ అయ్యింది కాబట్టి సినిమాలు చేసే విషయంలో మరీ నెమ్మదిగా ఉండకూడదని బాలయ్య, మోక్షజ్ఞ నిర్ణయించుకున్నారట. అందులోనూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు దొరికే పరిస్థితి అంత సులభం లేదు కాబట్టి దొరికినప్పుడే లాక్ చేసుకోవాలనే ఆలోచనతో కథలు వింటున్నారని ఇన్ సైడ్ టాక్. ఇవి కాకుండా ఆదిత్య 369 సీక్వెల్ లోనూ మోక్షజ్ఞ కనిపించే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పట్లో కాదు.

Kumar

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

28 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago