మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కెరీర్ పరంగా మామూలు ఇబ్బందుల్లో లేడు. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు విజయం దక్కి కూడా చాలా ఏళ్లయిపోయింది. గని, గాండీవధారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్.. ఇలా తన చివరి మూడు సోలో హీరో సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లవడంతో తన మార్కెట్ దారుణంగా దెబ్బ తింది. ఈ స్థితిలో తన ఆశలన్నీ ‘మట్కా’ మీదే నిలిచాయి.
గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే.. ఈ చిత్రం మీద నిర్మాతలు పెద్ద బడ్జెట్టే పెట్టారు. దాదాపు రూ.40 కోట్లతో ఈ సినిమా తీశారు. ఇది తనకు మంచి బ్రేక్ ఇస్తుందని వరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తీరా చూస్తే వరుణ్ గత సినిమాలే నయం అనుకునేలా చేసింది ‘మట్కా’. మినిమం బుకింగ్స్ లేక.. తొలి రోజే థియేటర్లు వెలవెలబోయి.. ఏ దశలోనూ పుంజుకోలేక బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది ‘మట్కా’. 40 కోట్ల సినిమాకు కోటి రూపాయల షేర్ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మట్కా రిజల్ట్ వరుణ్ కొత్త సినిమా మీద కూడా ప్రభావం చూపిస్తున్నట్లు సమాచారం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంతకుముందు ఓకే చెప్పింది. గాంధీ తీసిన ‘ఎక్స్ప్రెస్ రాజా’ చిత్రాన్ని ఆ సంస్థే ప్రొడ్యూస్ చేసింది. కానీ ‘మట్కా’ రిజస్ట్ చూసో ఏమో.. ఆ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు సమాచారం. దీంతో వేరే నిర్మాతలను వెదుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
వరుసగా నాలుగు డిజాస్టర్లంటే ఎలాంటి హీరోకైనా మార్కెట్ దెబ్బ తింటుంది. వరుణ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ స్థితి నుంచి పుంజుకుని మళ్లీ మార్కెట్ సంపాదించుకోవడం అంత తేలిక కాదు. మరి తన తర్వాతి సినిమాను ప్రొడ్యూస్ చేసే సాహసం ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. గాంధీ కూడా ఫెయిల్యూర్లలో ఉండడం ఈ ప్రాజెక్టుకు మైనస్. తన చివరి రెండు చిత్రాలు ‘లైక్ షేర్ సబ్స్క్రైబ్’, ‘కృష్ణార్జున యుద్ధం’ డిజాస్టర్లు అయ్యాయి.
This post was last modified on December 1, 2024 11:03 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…