Movie News

ఆన్ లైన్ టికెట్ల పోటీ – బుక్ మై షో మీద ‘డిస్ట్రిక్ట్’ దెబ్బ పడుతుందా?

సినిమాలకు సంబంధించి థియేటర్లు, ఓటిటిల మధ్యే పోటీ ఉండటం చూశాం కానీ తాజాగా ఇప్పుడీ లిస్టులో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాపులు చేరుతున్నాయి. ఇప్పటిదాకా ప్రధానంగా ఉన్న ప్లేయర్లు రెండే. ఒకటి బుక్ మై షో, మరొకటి పేటిఎం. నైజామ్ కు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు ఎక్కువగా ఆధారపడేది మొదటిదానిమీదే. ఎప్పటికప్పుడు గంటకు, రోజుకు ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయనే సమాచారం ఇస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ సైతం దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటుంది. పేటిఎం వాడకం జిల్లా కేంద్రాలు, బిసి సెంటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ఇప్పుడో కొత్త ఆటగాడు వచ్చాడు.

పుష్ప 2 ది రూల్ అధికారిక టికెటింగ్ పార్ట్ నర్ గా కొత్తగా అవతరించిన ‘డిస్ట్రిక్ట్’కి మంచి పబ్లిసిటీ దక్కుతోంది. అలాని ఇదేమి కొత్త కంపెనీ కాదు. గతంలో ఉన్న టికెట్ న్యూని నడిపిస్తున్న పేటిఎం కొత్తగా జొమాటోతో జట్టు కట్టి డిస్ట్రిక్ట్ యాప్ ని సృష్టించింది. ఊరికే లాంచ్ చేస్తే జనాలకు చేరదు కాబట్టి పుష్ప 2తో కొలాబరేట్ కావడం వల్ల కోట్ల రూపాయల ప్రమోషన్ జరిగిపోతుంది. పేటిఎంలో వందలాది సర్వీసులు ఉంటే డిస్ట్రిక్ట్ లో మాత్రం కేవలం సినిమాలు, ఈవెంట్ల టికెట్ల అమ్మకాలు మాత్రమే ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే బుక్ మై షోకి సరైన ప్రత్యాన్మయంగా దీనికి శ్రీకారం చుట్టారన్న మాట.

ఇప్పుడీ డిస్ట్రిక్ట్ ప్రభావం బుక్ మై షో మీద ఖచ్చితంగా ఉంటుంది. అన్నింటి కన్నా ముందు పుష్ప 2 టికెట్లు దీంట్లోనే ఉంటాయనే ప్రచారం ఊపందుకోవడంతో సినీ ప్రియులు ఆలస్యం చేయకుండా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. కాకపోతే మొత్తం దేశమంతా టికెట్లు అందుబాటులోకి వచ్చాక అంత ట్రాఫిక్ ని ఈ కొత్తగా పుట్టుకొచ్చిన యాప్ తట్టుకుంటుందో లేదో చూడాలి. బలమైన సర్వర్లు ఉన్నప్పటికీ సలార్ టైంలో బుక్ మై షో గంటల తరబడి క్రాష్ అయ్యింది. మరి పుష్ప సునామిని ముందే ఊహించి డిస్ట్రిక్ట్ ని దానికి తగ్గట్టు సంసిద్ధం చేశారో లేదో షోలు, స్క్రీన్లు పెరిగే కొద్దీ ఇంకో రెండు రోజుల్లో తేలిపోతుంది.

This post was last modified on November 30, 2024 7:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గూఢచారి-2 ఎప్పుడు వస్తుంది?

తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…

8 hours ago

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న…

9 hours ago

విజ‌య‌న్ వ‌ర్సెస్ రేవంత్‌… ర‌చ్చ‌-ర‌చ్చ‌!

కేర‌ళం ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. సీనియ‌ర్…

10 hours ago

ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…

12 hours ago

ఏడాది తర్వాత… ఈ రోజు విధ్వంసమే

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…

14 hours ago

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

15 hours ago