ఇటీవల తమిళ నటులు నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్న ధనుష్.. ఇటీవలే కోర్టు మెట్లు ఎక్కాడు. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’ ఫుటేజ్ వాడడంతో అతను నయన్, విఘ్నేష్ల మీద దావా వేశాడు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.దీని గురించి వార్త బయటికి రాగానే.. నయన్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అని అంతా ఎదురు చూశారు. ఆమె ఈసారి ధనుష్ పేరెత్తకుండా అతడికి కౌంటర్ వేసింది.
మీరు అబద్ధాలతో మరొకరి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటే దాన్ని అప్పుగా భావించండి. అది రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తుంది’’ అంటూ వేదాంత ధోరణిలో పోస్టు పెట్టింది నయన్. తనకు వ్యతిరేకంగా ధనుష్ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో అతణ్ని ఉద్దేశించే నయన్ ఈ పోస్టు పెట్టిందని భావిస్తున్నారు. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి నయన్.. ధనుష్ మీద నేరుగా విమర్శలు చేయట్లేదని అనుకుంటున్నారు. తన డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజయ్యాక.. దాని కోసం ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చిన నిర్మాతలందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది నయన్. అప్పుడు కూడా పరోక్షంగా ధనుష్ను కౌంటర్ చేసినట్లే భావించారు. ఇప్పుడు ఈ కోట్ ద్వారా మరోసారి అతణ్ని ఎటాక్ చేసినట్లు కనిపిస్తోంది.
This post was last modified on November 30, 2024 9:42 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…