ఇటీవల తమిళ నటులు నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్న ధనుష్.. ఇటీవలే కోర్టు మెట్లు ఎక్కాడు. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’ ఫుటేజ్ వాడడంతో అతను నయన్, విఘ్నేష్ల మీద దావా వేశాడు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.దీని గురించి వార్త బయటికి రాగానే.. నయన్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అని అంతా ఎదురు చూశారు. ఆమె ఈసారి ధనుష్ పేరెత్తకుండా అతడికి కౌంటర్ వేసింది.
మీరు అబద్ధాలతో మరొకరి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటే దాన్ని అప్పుగా భావించండి. అది రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తుంది’’ అంటూ వేదాంత ధోరణిలో పోస్టు పెట్టింది నయన్. తనకు వ్యతిరేకంగా ధనుష్ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో అతణ్ని ఉద్దేశించే నయన్ ఈ పోస్టు పెట్టిందని భావిస్తున్నారు. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి నయన్.. ధనుష్ మీద నేరుగా విమర్శలు చేయట్లేదని అనుకుంటున్నారు. తన డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజయ్యాక.. దాని కోసం ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చిన నిర్మాతలందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది నయన్. అప్పుడు కూడా పరోక్షంగా ధనుష్ను కౌంటర్ చేసినట్లే భావించారు. ఇప్పుడు ఈ కోట్ ద్వారా మరోసారి అతణ్ని ఎటాక్ చేసినట్లు కనిపిస్తోంది.
This post was last modified on November 30, 2024 9:42 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…