ఇటీవల తమిళ నటులు నయనతార-ధనుష్ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదంలో కొందరు ధనుష్ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్న ధనుష్.. ఇటీవలే కోర్టు మెట్లు ఎక్కాడు. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’ ఫుటేజ్ వాడడంతో అతను నయన్, విఘ్నేష్ల మీద దావా వేశాడు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.దీని గురించి వార్త బయటికి రాగానే.. నయన్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అని అంతా ఎదురు చూశారు. ఆమె ఈసారి ధనుష్ పేరెత్తకుండా అతడికి కౌంటర్ వేసింది.
మీరు అబద్ధాలతో మరొకరి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటే దాన్ని అప్పుగా భావించండి. అది రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తుంది’’ అంటూ వేదాంత ధోరణిలో పోస్టు పెట్టింది నయన్. తనకు వ్యతిరేకంగా ధనుష్ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో అతణ్ని ఉద్దేశించే నయన్ ఈ పోస్టు పెట్టిందని భావిస్తున్నారు. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి నయన్.. ధనుష్ మీద నేరుగా విమర్శలు చేయట్లేదని అనుకుంటున్నారు. తన డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజయ్యాక.. దాని కోసం ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చిన నిర్మాతలందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది నయన్. అప్పుడు కూడా పరోక్షంగా ధనుష్ను కౌంటర్ చేసినట్లే భావించారు. ఇప్పుడు ఈ కోట్ ద్వారా మరోసారి అతణ్ని ఎటాక్ చేసినట్లు కనిపిస్తోంది.
This post was last modified on November 30, 2024 9:42 am
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…