ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన ఏ వార్తయినా విపరీతమైన హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో రన్ టైంకి సంబంధించిన ఒక అప్డేట్ సంచలనమనేలా ఉంది. సెన్సార్ కు వెళ్ళబోతున్న ఫైనల్ కట్ 3 గంటల 21 నిముషాలు వచ్చిందని సమాచారం. ఇంత నిడివితో ఒక స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ వచ్చి దశాబ్దాలు దాటిపోయింది. ఆ మధ్య ఇంతే నిడివితో సందీప్ రెడ్డి వంగా యానిమల్ రిలీజ్ చేస్తే ముందు అందరూ అనుమానపడ్డారు. కట్ చేస్తే ఏ మాత్రం విసుగు లేకుండా ఒకటే ఇంటర్వెల్ ఉన్నా కూడా ప్రేక్షకులు రన్బీర్ విశ్వరూపాన్ని ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు పుష్ప 2 కూడా అదే లెన్త్ ఖరారు చేసుకుంటే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండగే. అయితే షోలకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో మల్టీప్లెక్సులకు షెడ్యూలింగ్ చేసుకోవడం సవాల్ కానుంది. కాకపోతే యానిమల్ మోడల్ ని ఇక్కడా ఫాలో అవుతారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ డిమాండ్ ప్రకారం చూసుకుంటే పుష్ప 2 ఎన్నో రెట్లు పైనుంది. ఇంటర్వెల్ తో కలిపి ఆడియన్స్ మూడున్నర గంటల పాటు థియేటర్లోనే ఉండాల్సి వస్తుంది. కంటెంట్ అంత బలంగా ఉన్నప్పుడు ఇదేమి సమస్య కాదు కానీ షోల మధ్య గ్యాప్ మాత్రం కేవలం కొన్ని సెకండ్లు లేదా నిమిషాలే ఉంటుంది.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. పుష్ప 2 పనులు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి. ఒకపక్క ప్రమోషనల్ ఈవెంట్లు ప్లాన్ చేసుకుంటూనే ఇంకోవైపు ఫైనల్ కాపీ వర్క్స్ ని దర్శకుడు సుకుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏ మాత్రం ఆలస్యం లేకుండా అన్నీ అనుకున్న ప్రకారం జరిగిపోతున్నాయట. డిసెంబర్ 4 రాత్రే ప్రీమియర్లు వేసే ఆలోచన ఉంది కనక దానికి అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. పుష్ప 2 ఫీవర్ దెబ్బకు జనాలు కొత్త సినిమాలు చూసే మూడ్ లో లేరు. అందుకే కాస్తో కూస్తో జీబ్రా తప్ప ఇంకే కొత్త రిలీజులు బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయడం లేదు.
This post was last modified on November 26, 2024 4:23 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…