టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రంలో ధనశ్రీ కథానాయికగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో డ్యాన్స్ నేపథ్యంలో ఆసక్తికర కథ నడవనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్నారు. ధనశ్రీ డ్యాన్స్ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆమె భాగం కొంత షూటింగ్ పూర్తయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ‘ఆకాశం దాటి వస్తావా’ షూటింగ్ గత కొంతకాలంగా కొనసాగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుందని భావిస్తున్నారు.
ధనశ్రీ వర్మ తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ వేదికగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఆల్బమ్ సాంగ్స్తోనూ పాపులర్ అయ్యారు. డ్యాన్స్ ప్రధానంగా ఉండే కథకు సరిపోయే హీరోయిన్ కావాలని భావించిన దర్శకుడు ధనశ్రీని సంప్రదించగా, ఆమె వెంటనే ఆమోదం తెలిపిందట.
ఇప్పటికే షూటింగ్ సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఆమె టాలీవుడ్లో ఎంట్రీ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సినిమాతో ధనశ్రీ కెరీర్ మరో కొత్త మలుపు తిరగనుందని అంచనా. టాలీవుడ్కి ధనశ్రీ రావడంతో, ఇది ప్రేక్షకుల్లోనే కాక, యుట్యూబ్ ఫ్యాన్స్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా విడుదల తర్వాత ధనశ్రీ పెర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on November 23, 2024 6:35 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…