Movie News

టాలీవుడ్ లో చాహల్ సతీమణి?

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రంలో ధనశ్రీ కథానాయికగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో డ్యాన్స్‌ నేపథ్యంలో ఆసక్తికర కథ నడవనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్నారు. ధనశ్రీ డ్యాన్స్‌ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆమె భాగం కొంత షూటింగ్ పూర్తయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ‘ఆకాశం దాటి వస్తావా’ షూటింగ్ గత కొంతకాలంగా కొనసాగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుందని భావిస్తున్నారు.

ధనశ్రీ వర్మ తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌ వేదికగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఆల్బమ్ సాంగ్స్‌తోనూ పాపులర్ అయ్యారు. డ్యాన్స్‌ ప్రధానంగా ఉండే కథకు సరిపోయే హీరోయిన్ కావాలని భావించిన దర్శకుడు ధనశ్రీని సంప్రదించగా, ఆమె వెంటనే ఆమోదం తెలిపిందట.

ఇప్పటికే షూటింగ్ సెట్స్‌ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సినిమాతో ధనశ్రీ కెరీర్‌ మరో కొత్త మలుపు తిరగనుందని అంచనా. టాలీవుడ్‌కి ధనశ్రీ రావడంతో, ఇది ప్రేక్షకుల్లోనే కాక, యుట్యూబ్‌ ఫ్యాన్స్‌లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా విడుదల తర్వాత ధనశ్రీ పెర్ఫార్మెన్స్‌ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

6 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

7 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

7 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

8 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

8 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

9 hours ago