టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రంలో ధనశ్రీ కథానాయికగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో డ్యాన్స్ నేపథ్యంలో ఆసక్తికర కథ నడవనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్నారు. ధనశ్రీ డ్యాన్స్ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆమె భాగం కొంత షూటింగ్ పూర్తయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ‘ఆకాశం దాటి వస్తావా’ షూటింగ్ గత కొంతకాలంగా కొనసాగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుందని భావిస్తున్నారు.
ధనశ్రీ వర్మ తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ వేదికగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఆల్బమ్ సాంగ్స్తోనూ పాపులర్ అయ్యారు. డ్యాన్స్ ప్రధానంగా ఉండే కథకు సరిపోయే హీరోయిన్ కావాలని భావించిన దర్శకుడు ధనశ్రీని సంప్రదించగా, ఆమె వెంటనే ఆమోదం తెలిపిందట.
ఇప్పటికే షూటింగ్ సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఆమె టాలీవుడ్లో ఎంట్రీ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సినిమాతో ధనశ్రీ కెరీర్ మరో కొత్త మలుపు తిరగనుందని అంచనా. టాలీవుడ్కి ధనశ్రీ రావడంతో, ఇది ప్రేక్షకుల్లోనే కాక, యుట్యూబ్ ఫ్యాన్స్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా విడుదల తర్వాత ధనశ్రీ పెర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on November 23, 2024 6:35 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…