దేశవ్యాప్త సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు మణిరత్నం. మౌనరాగం, నాయకుడు, గీతాంజలి, ఘర్షణ, రోజా, బొంబాయి లాంటి ఎన్నో మర్చిపోలేని క్లాసిక్స్ ఇచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే టెక్నాలజీ అంతగా లేని రోజుల నుంచి విఎఫెక్స్ ఆధిపత్యం చెలాయించే ట్రెండ్ దాకా నాలుగు దశాబ్దాల దర్శకుడిగా ఆయన చేసిన ప్రయాణంలో చూడని మజిలీలు ఉండవు. వెనుకబడి పోతున్నారనుకుంటున్న టైంలో ఓకే బంగారం లాంటి హిట్టుతో కంబ్యాక్ ఇచ్చి బాహుబలి స్ఫూర్తితో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలతో తమిళంలో రికార్డు బ్లాక్ బస్టర్ సాధించడం ఆయనకే చెల్లింది.
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మా సైట్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా థియేటర్ కు ఓటిటికి మధ్య వ్యత్యాసాన్ని మణిరత్నం వివరించిన తీరు ఆలోచింపజేసేలా ఉంది. పొన్నియిన్ సెల్వన్ ఒకవేళ ఎక్కువ నిడివి ఉండే వెబ్ సిరీస్ గా తీసి ఇంకా డెప్త్, ఎమోషనల్ గా చెప్పే అవకాశం దక్కేది కదా అనేది ప్రశ్న. దానికి మణిరత్నం బదులిస్తూ పీఎస్ తాను కేవలం బిగ్ స్క్రీన్ మీద మాత్రం ఆవిష్కరించాలనుకున్న కలని, రివైండ్ ఫార్వార్డ్ చేస్తూ మధ్యలో కాల్స్ మెసేజెస్ చూసుకునే స్మార్ట్ ఫోన్లు, టీవీల కోసం రాసుకోలేదని అన్నారు. వెండితెరపై అనుభూతిని ఇంకే ప్రత్యాన్మయం ఇవ్వలేదని చెప్పారు.
ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఓటిటిలు వచ్చాక ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే దాన్ని డిమాండ్ చేసే కంటెంట్ ఉంటేనే టికెట్లు కొంటున్నారు. పొన్నియిన్ సెల్వన్ ఒకవేళ నిజంగా సిరీస్ గా వచ్చి ఉంటే ఇంత స్పందన వచ్చేది కాదేమో. తెరనిండా తారలను చూసుకుంటే కలిగే ఆనందం స్మార్ట్ ఫోన్ ఎలా ఇవ్వగలదు. అయితే భవిష్యత్తులో అవసరమైతే సుదీర్ఘంగా చెప్పాలనుకునే కథ రాసుకుంటే సిరీస్ తీస్తానని మణిరత్నం నర్మగర్భంగా చెప్పడం కొసమెరుపు. కమల్ హాసన్, శింబుతో ఆయన రూపొందించిన ధగ్ లైఫ్ ప్రధాన ప్యాన్ ఇండియా భాషల్లో 2025 వేసవి విడుదలకు రెడీ అవుతోంది.
This post was last modified on November 23, 2024 2:39 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…