Movie News

థియేటర్ VS ఓటిటి : మణిరత్నం నిర్వచనం

దేశవ్యాప్త సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు మణిరత్నం. మౌనరాగం, నాయకుడు, గీతాంజలి, ఘర్షణ, రోజా, బొంబాయి లాంటి ఎన్నో మర్చిపోలేని క్లాసిక్స్ ఇచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే టెక్నాలజీ అంతగా లేని రోజుల నుంచి విఎఫెక్స్ ఆధిపత్యం చెలాయించే ట్రెండ్ దాకా నాలుగు దశాబ్దాల దర్శకుడిగా ఆయన చేసిన ప్రయాణంలో చూడని మజిలీలు ఉండవు. వెనుకబడి పోతున్నారనుకుంటున్న టైంలో ఓకే బంగారం లాంటి హిట్టుతో కంబ్యాక్ ఇచ్చి బాహుబలి స్ఫూర్తితో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలతో తమిళంలో రికార్డు బ్లాక్ బస్టర్ సాధించడం ఆయనకే చెల్లింది.

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మా సైట్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా థియేటర్ కు ఓటిటికి మధ్య వ్యత్యాసాన్ని మణిరత్నం వివరించిన తీరు ఆలోచింపజేసేలా ఉంది. పొన్నియిన్ సెల్వన్ ఒకవేళ ఎక్కువ నిడివి ఉండే వెబ్ సిరీస్ గా తీసి ఇంకా డెప్త్, ఎమోషనల్ గా చెప్పే అవకాశం దక్కేది కదా అనేది ప్రశ్న. దానికి మణిరత్నం బదులిస్తూ పీఎస్ తాను కేవలం బిగ్ స్క్రీన్ మీద మాత్రం ఆవిష్కరించాలనుకున్న కలని, రివైండ్ ఫార్వార్డ్ చేస్తూ మధ్యలో కాల్స్ మెసేజెస్ చూసుకునే స్మార్ట్ ఫోన్లు, టీవీల కోసం రాసుకోలేదని అన్నారు. వెండితెరపై అనుభూతిని ఇంకే ప్రత్యాన్మయం ఇవ్వలేదని చెప్పారు.

ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఓటిటిలు వచ్చాక ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే దాన్ని డిమాండ్ చేసే కంటెంట్ ఉంటేనే టికెట్లు కొంటున్నారు. పొన్నియిన్ సెల్వన్ ఒకవేళ నిజంగా సిరీస్ గా వచ్చి ఉంటే ఇంత స్పందన వచ్చేది కాదేమో. తెరనిండా తారలను చూసుకుంటే కలిగే ఆనందం స్మార్ట్ ఫోన్ ఎలా ఇవ్వగలదు. అయితే భవిష్యత్తులో అవసరమైతే సుదీర్ఘంగా చెప్పాలనుకునే కథ రాసుకుంటే సిరీస్ తీస్తానని మణిరత్నం నర్మగర్భంగా చెప్పడం కొసమెరుపు. కమల్ హాసన్, శింబుతో ఆయన రూపొందించిన ధగ్ లైఫ్ ప్రధాన ప్యాన్ ఇండియా భాషల్లో 2025 వేసవి విడుదలకు రెడీ అవుతోంది.

This post was last modified on November 23, 2024 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

13 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago