ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల మీద వేసిన సెటైర్ల మీద చిన్నపాటి దుమారమే రేగింది. మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయిన వైనం సోషల్ మీడియాలో కనిపించింది. దీనికి రానా స్పందిస్తూ ఇకపై జోకులు వేసేటప్పుడు ఇది హాస్యం కోసమని సబ్ టైటిల్స్ వేసే పరిస్థితి వస్తోందని చెప్పగా తేజ సజ్జ చిన్నప్పటి నుంచి కలిసి నటించి చూసిన హీరోల మీద పంచులు ఎందుకు వేస్తానని, అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోయింది తప్ప కావాలని చేసింది కాదని వివరణ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఈ టాపిక్ వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన దగ్గుబాటి రానా షోలో న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంకా మోహన్, తేజ సజ్జలు మొదటి ఎపిసోడ్ గెస్టులుగా వచ్చారు. ఇందులో సోషల్ మీడియా ట్రోల్స్, ప్రత్యేకంగా ఐఫా ఘటన గురించి ప్రస్తావన వచ్చింది. దానికి నాని స్పందిస్తూ హ్యూమర్, సీరియస్ నెస్ కి తేడా తెలియకుండా పోతోందని, ఇకపై ఇలాంటివి మరిన్ని చేస్తే జనాలు అలవాటు పడి ఎంజాయ్ చేయడం మొదలుపెడతారని అన్నాడు. ఇందులో లాజిక్ ఉంది. సెటైరిక్ కామెడీని ఆస్వాదించాలంటే దానికి ముందు సంసిద్ధంగా ఉండాలి. కానీ టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఈ ట్రెండ్ అలవాటు లేదు.
ఇక్కడే కాదు తమిళంలోనూ రానాకి ఇదే అనుభవమయ్యింది . గతంలో కోలీవుడ్ హీరో ఆర్యతో కలిసి యాంకరింగ్ చేసినప్పుడు అక్కడి స్టార్ల మీద ఇద్దరు కొన్ని జోకులు వేశారు. దాని దెబ్బకు వాళ్లంతా మూడు నాలుగు సంవత్సరాలు రానాతో మాట్లాడ్డం మానేశారు. అప్పుడు కానీ రానాకు అర్థం కాలేదు తన కామెంట్స్ ని ఎంతగా అపార్థం చేసుకున్నారో. హిందీలో ఒకరి మీద మరొకరు పంచులు వేసుకోవడం సహజం. ఇక్కడ అలవాటు లేకపోవడం వల్లే రానా, తేజల మీద ఆన్ లైన్ విసుర్లు వచ్చాయి కానీ నాని అన్నట్టు ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసుకుని ఆడియన్స్ కి అలవాటు చేయడం ఇప్పటి ట్రెండ్ లో చాలా అవసరం.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…