ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల మీద వేసిన సెటైర్ల మీద చిన్నపాటి దుమారమే రేగింది. మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయిన వైనం సోషల్ మీడియాలో కనిపించింది. దీనికి రానా స్పందిస్తూ ఇకపై జోకులు వేసేటప్పుడు ఇది హాస్యం కోసమని సబ్ టైటిల్స్ వేసే పరిస్థితి వస్తోందని చెప్పగా తేజ సజ్జ చిన్నప్పటి నుంచి కలిసి నటించి చూసిన హీరోల మీద పంచులు ఎందుకు వేస్తానని, అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోయింది తప్ప కావాలని చేసింది కాదని వివరణ ఇచ్చాడు. తాజాగా మరోసారి ఈ టాపిక్ వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన దగ్గుబాటి రానా షోలో న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంకా మోహన్, తేజ సజ్జలు మొదటి ఎపిసోడ్ గెస్టులుగా వచ్చారు. ఇందులో సోషల్ మీడియా ట్రోల్స్, ప్రత్యేకంగా ఐఫా ఘటన గురించి ప్రస్తావన వచ్చింది. దానికి నాని స్పందిస్తూ హ్యూమర్, సీరియస్ నెస్ కి తేడా తెలియకుండా పోతోందని, ఇకపై ఇలాంటివి మరిన్ని చేస్తే జనాలు అలవాటు పడి ఎంజాయ్ చేయడం మొదలుపెడతారని అన్నాడు. ఇందులో లాజిక్ ఉంది. సెటైరిక్ కామెడీని ఆస్వాదించాలంటే దానికి ముందు సంసిద్ధంగా ఉండాలి. కానీ టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఈ ట్రెండ్ అలవాటు లేదు.
ఇక్కడే కాదు తమిళంలోనూ రానాకి ఇదే అనుభవమయ్యింది . గతంలో కోలీవుడ్ హీరో ఆర్యతో కలిసి యాంకరింగ్ చేసినప్పుడు అక్కడి స్టార్ల మీద ఇద్దరు కొన్ని జోకులు వేశారు. దాని దెబ్బకు వాళ్లంతా మూడు నాలుగు సంవత్సరాలు రానాతో మాట్లాడ్డం మానేశారు. అప్పుడు కానీ రానాకు అర్థం కాలేదు తన కామెంట్స్ ని ఎంతగా అపార్థం చేసుకున్నారో. హిందీలో ఒకరి మీద మరొకరు పంచులు వేసుకోవడం సహజం. ఇక్కడ అలవాటు లేకపోవడం వల్లే రానా, తేజల మీద ఆన్ లైన్ విసుర్లు వచ్చాయి కానీ నాని అన్నట్టు ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసుకుని ఆడియన్స్ కి అలవాటు చేయడం ఇప్పటి ట్రెండ్ లో చాలా అవసరం.
This post was last modified on November 23, 2024 4:26 pm
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…