ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్ లో చూశాక సెకండాఫ్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవమే. ఆ మాటకొస్తే థియేటర్ రిలీజ్ సమయంలోనూ ఈ కామెంట్స్ వినిపించాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, ఇంటెన్స్ గా నడిచే తొలి సగం జనాలతో పైసా వసూల్ అనిపించాయి. దాంతో వర ఎపిసోడ్ నుంచి గ్రాఫ్ డౌన్ అయిపోయినా చివరికి క్లైమాక్స్ ఘట్టంతో సంతృప్తి పడేలా చేశారు. అయినా సరే దర్శకుడు కొరటాల శివ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని అధిక శాతం పబ్లిక్ నుంచి వినిపించిన టాక్.
దీంతో దేవర 2 ఉండబోవడం లేదని కొరటాల శివ వేరే ప్రాజెక్టు చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అయితే తారక్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి దేవర 2కి పక్కన పెట్టేయాలన్న ఆలోచన ఏదీ లేదట. కాకపోతే కెజిఎఫ్, బాహుబలి లాగా వెంటనే తీయాలనే ప్రణాళిక పెట్టుకోలేదు కాబట్టే తారక్ వార్ 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఒప్పుకున్నది ఇప్పుడు కాదు. దేవర షూటింగ్ లో ఉండగానే లాకయ్యింది. కాకపోతే అనౌన్స్ మెంట్ లేటయ్యింది. ఇవి కాకుండా మరో బాలీవుడ్ మూవీ సంతకం చేశాడనే ప్రచారం గురించి కూడా ఇంకా ఎలాంటి నిర్ధారణ లేదు.
సో ఫ్యాన్స్ టెన్షన్ పడేందుకు ఏమి లేదు. కొరటాల శివ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. దేవర 2కి కావాల్సిన మార్పులు చేర్పుల మీద త్వరలోనే పని ప్రారంభిస్తారట. కాకపోతే ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. పుష్ప 2 రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఎంత గ్యాప్ ఉందనేది పట్టించుకోకుండా కంటెంట్ బాగా రావాలనే ఉద్దేశంతో ఆలస్యమైనా పర్వాలేదని స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారని తెలిసింది. జాన్వీ కపూర్, శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్, మురళీశర్మ తదితరులందరూ సీక్వెల్ లోనూ కొనసాగబోతున్నారు. సెకండ్ పార్ట్ విలన్ గా బాబీ డియోల్ అదనంగా తోడయ్యే టాక్ కూడా దాదాపు నిజమే.
This post was last modified on November 22, 2024 4:05 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…