కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన నయనతార, ధనుశ్ వివాదం గురువారం జరిగిన వివాహ వేడుకలో మరోసారి వెలుగులోకి వచ్చింది. చెన్నైలో జరిగిన టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహానికి ఇద్దరూ హాజరయ్యారు. మొదట ధనుశ్ వేడుకలోకి రాగా, అనంతరం నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్తో కలసి వచ్చారు. ఇద్దరూ ఒకే వరుసలో కూర్చోడం విశేషం.
వివాహ వేదికలో ముందుకు కేటాయించిన కుర్చీల్లో ధనుశ్, నయనతార ఒకే వరుసలో ఉన్నప్పటికీ, ఒకరి వైపు మరొకరు చూడకుండా, పూర్తిగా ఉత్సవానికి తగినట్టుగా ఉండటమే గమనార్హం. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వెళ్ళినప్పుడు కూడా, ఇద్దరూ తగిన దూరాన్ని పాటిస్తూ ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారు.
ఈ సందర్భానికి సంబంధించిన వీడియోలను నయనతార భద్రతా బృందం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో, ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇద్దరికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వేడుకకు సంబంధించి లీకైన ఫోటోలో నయనతార పింక్ కలర్ చీరలో, ధనుశ్ సంప్రదాయ పంచె కట్టులో మెరిసిపోయారు. ఇద్దరూ కుర్చీలపై తమదైన శైలిలో కూర్చొని వేడుకను ఆస్వాదించారు.
ఇద్దరి మధ్య వివాదానికి కారణం నయనతార తీసిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ నుంచి వచ్చిందే. నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతున్న ఈ డాక్యుమెంటరీలో ‘నేనూ రౌడీనే’ సినిమాలోని 3 సెకన్ల క్లిప్పింగ్ను వాడటంపై ధనుశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమా నిర్మాతగా ఉన్న ధనుశ్, తన అనుమతి లేకుండా క్లిప్పింగ్ను వాడారని మండిపడుతూ రూ.10 కోట్లు పరిహారం డిమాండ్ చేశారు. ఇక తాము రెండేళ్లపాటు ధనుశ్ నుండి అనుమతి కోసం ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదని నయనతార ఆరోపించారు.
This post was last modified on November 22, 2024 11:45 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…