కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన నయనతార, ధనుశ్ వివాదం గురువారం జరిగిన వివాహ వేడుకలో మరోసారి వెలుగులోకి వచ్చింది. చెన్నైలో జరిగిన టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహానికి ఇద్దరూ హాజరయ్యారు. మొదట ధనుశ్ వేడుకలోకి రాగా, అనంతరం నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్తో కలసి వచ్చారు. ఇద్దరూ ఒకే వరుసలో కూర్చోడం విశేషం.
వివాహ వేదికలో ముందుకు కేటాయించిన కుర్చీల్లో ధనుశ్, నయనతార ఒకే వరుసలో ఉన్నప్పటికీ, ఒకరి వైపు మరొకరు చూడకుండా, పూర్తిగా ఉత్సవానికి తగినట్టుగా ఉండటమే గమనార్హం. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వెళ్ళినప్పుడు కూడా, ఇద్దరూ తగిన దూరాన్ని పాటిస్తూ ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారు.
ఈ సందర్భానికి సంబంధించిన వీడియోలను నయనతార భద్రతా బృందం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో, ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇద్దరికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వేడుకకు సంబంధించి లీకైన ఫోటోలో నయనతార పింక్ కలర్ చీరలో, ధనుశ్ సంప్రదాయ పంచె కట్టులో మెరిసిపోయారు. ఇద్దరూ కుర్చీలపై తమదైన శైలిలో కూర్చొని వేడుకను ఆస్వాదించారు.
ఇద్దరి మధ్య వివాదానికి కారణం నయనతార తీసిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ నుంచి వచ్చిందే. నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతున్న ఈ డాక్యుమెంటరీలో ‘నేనూ రౌడీనే’ సినిమాలోని 3 సెకన్ల క్లిప్పింగ్ను వాడటంపై ధనుశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమా నిర్మాతగా ఉన్న ధనుశ్, తన అనుమతి లేకుండా క్లిప్పింగ్ను వాడారని మండిపడుతూ రూ.10 కోట్లు పరిహారం డిమాండ్ చేశారు. ఇక తాము రెండేళ్లపాటు ధనుశ్ నుండి అనుమతి కోసం ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదని నయనతార ఆరోపించారు.
This post was last modified on November 22, 2024 11:45 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…