టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో ఉన్నాయి. దేంట్లోనూ వందల కోట్ల బడ్జెట్ డిమాండ్ చేసే స్టార్ హీరోలు లేరు. దర్శకులకు హిట్ ట్రాక్ రికార్డు లేదు. పైగా అనుభవం తక్కువే. అయినా సరే కంటెంట్ నమ్ముకుని బరిలో దిగుతున్నాయి. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మీద మంచి బజ్ నెలకొంది. ప్రీమియర్ల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ గురించి పాజిటివ్ గా ఉన్నాయి. దర్శకుడు రవితేజ చూపించిన ట్విస్టులు కనక కనెక్ట్ అయితే ఫలితం దక్కేలా ఉంది. స్పష్టత రావాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే.
మీనాక్షి చౌదరి – శ్రద్ధ శ్రీనాథ్ గ్లామర్ లకు తోడు జేక్స్ బెజోయ్ సంగీతం దన్నుగా నిలిచింది. సత్యదేవ్, డాలీ ధనుంజయ్ నటించిన చోటా మల్టీ స్టారర్ జీబ్రా మీద భారీ హైప్ లేకపోయినా టీమ్ వినూత్నంగా చేసిన ప్రమోషన్లు మూవీ లవర్స్ దృష్టిలో పడ్డాయి. సో టాక్ కీలక పాత్ర పోషించాలి. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ పనితనం ట్రైలర్ లో కనిపించింది. ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తే సత్యదేవ్ కు హిట్ పడ్డట్టే. అశోక్ గల్లా రెండో చిత్రం దేవకీనందన వాసుదేవ కథను ప్రశాంత్ వర్మ ఇచ్చాడనే దాని మీద ఎక్కువ మార్కెటింగ్ చేశారు. మేనల్లుడి కోసం మహేష్ బాబు ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం లాంటివి బజ్ తీసుకొచ్చాయి.
విలేజ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ వాసుదేవలో ఫాంటసీ టచ్ ఉండటం వల్ల ఫ్యామిలీ జనాలను ఆకట్టుకోవడం ముఖ్యం. దర్శకుడు అర్జున్ జంధ్యాల గతంలో తీసింది ఒక్క సినిమానే అయినా తానేంటో దీంతో ఋజువు చేస్తానని అంటున్నాడు. రోటి కపడా రొమాన్స్ యూత్ ని టార్గెట్ చేస్తోంది. ప్రీమియర్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. మొత్తంగా బాక్సాఫీస్ నాలుగు ముక్కలాటలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇవి కాకుండా కేసీఆర్ కేశవ చంద్ర రమావత్, మందిర, కనకమహాలక్ష్మిలతో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు రేసులో ఉన్నాయి. చూడాలి మరి ఏవి నిలుస్తాయో ఏవి గెలుస్తాయో.
This post was last modified on November 22, 2024 10:33 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…