సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా.. డిస్ట్రిబ్యూషన్ ద్వారా అయినా ఆయన రేసులో ఉంటారు. ప్రొడక్షన్లో ఓ సినిమా, డిస్ట్రిబ్యూషన్లో ఓ సినిమాతో ఆయన బరిలో నిలిచిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈసారి సంక్రాంతికి రిలీజ్ కానున్న మూడు పెద్ద చిత్రాల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉండడం విశేషం.
రాజు నుంచి రాబోతున్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10నే విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చిన నాలుగు రోజులకు విడుదల కానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా రాజు సినిమానే అన్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఖరారైంది. 2022లో మైత్రీ వాళ్లు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను బరిలో నిలిపినట్లే.. ఈసారి రాజు తన ప్రొడక్షన్లో తెరకెక్కిన రెండు చిత్రాలను రేసులో నిలబెట్టారు. విశేషం ఏంటంటే.. పండక్కి రిలీజ్ కాబోతున్న మరో పెద్ద సినిమాలోనూ రాజు భాగస్వామ్యం ఉంది.
నందమూరి బాలకృష్ణ సినిమా ‘డాకు మహారాజ్’ను నైజాం, వైజాగ్ ఏరియాల్లో రాజు రిలీజ్ చేయబోతున్నాడు. హారిక హాసిని- సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లు నిర్మించే సినిమాలను చాలా వరకు రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. వీరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది.
‘డాకు మహారాజ్’ హక్కులను కూడా నైజాం, వైజాగ్ ఏరియాలకు ఆయనే సొంతం చేసుకున్నారు. దీంతో సంక్రాంతికి రానున్న మూడు పెద్ద సినిమాలతో రాజు పెద్ద బెట్టే వేయబోతున్నాడన్నమాట. సందీప్ కిషన్ సినిమా ‘మజాకా’ కూడా సంక్రాంతికి వస్తుందంటున్నారు. మరి ఆ సినిమా మీద కూడా రాజు హ్యాండ్ పడుతుందేమో చూడాలి.
This post was last modified on November 22, 2024 8:11 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…