బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12 రిలీజ్ డేట్ ప్రకటించేశారు కాబట్టి దానికి అనుగుణంగా పనులు వేగవంతం చేశారు. ఇటీవలే వచ్చిన టీజర్ అంచనాలు అమాంతం పెంచేయగా సితార సంస్థ బిజినెస్ డీల్స్ మొదలుపెట్టిందని సమాచారం. ఏరియాల వారిగా థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక మొత్తానికి ఒప్పందాలు జరుగుతున్నాయి. ఎంత మొత్తమనేది ఇంకొద్దిరోజుల్లో బయటికి వస్తుంది కానీ డాకు మహారాజ్ అసలు ఎలాంటి కథతో వస్తుందనేది ఫ్యాన్స్ లో రేగిన ప్రశ్న.
కీలకమైన లీక్స్ ని బట్టి చూస్తే ఇందులో దర్శకుడు బాబీ బలమైన రివెంజ్ డ్రామా రాసుకున్నట్టు సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో చాందిని చౌదరికి సంబంధించిన ఎపిసోడ్ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు బాలయ్య గెటప్, మ్యానరిజం తదితరాలు కొత్తగా ఉంటాయని అంటున్నారు. పోలీస్ ఆఫీసరనే ప్రచారం కూడా ఉంది. అయితే ఒక ప్రభుత్వాధికారి విచక్షణ లేకుండా విలన్ల దండు మీద పడిపోయే డాకూ మహారాజ్ గా ఎందుకు మారాడనేది మెయిన్ పాయింటట. వాల్తేరు వీరయ్యలో రవితేజ ట్రాక్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన బాబీ ఇందులో అంతకు మించి పవర్ ఫుల్ బ్లాక్స్ పెట్టారట.
నిర్మాత నాగవంశీ చెబుతున్న అయిదు హై యాక్షన్ బ్లాక్స్ లో రెండు పైన చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లో వస్తాయని వినికిడి. హారర్ తరహా సౌండింగ్ వచ్చేలా డాకు పేరు ఎందుకు పెట్టారనే జస్టిఫికేషన్ అభిమానులకే కాదు మాస్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా సాగుతుందట. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతేలాలు హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ మెయిన్ విలన్. ఊహించని కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయట. సంక్రాంతి బరిలో రామ్ చరణ్, వెంకటేష్ తో పోటీ పడబోతున్న బాలయ్య మరోసారి పండగ సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on November 22, 2024 8:22 am
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…