మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ ఏస్ డైరెక్టర్ శంకర్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం.. గేమ్ చేంజర్. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యం అయింది కానీ.. ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఇండియాలోనే బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లతో పని చేసిన తమన్.. తనను ‘బాయ్స్’ సినిమాతో నటుడిగా పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ శంకర్తో పని చేయాలని ఎప్పట్నుంచో ఆశపడుతున్నాడు.
తన కెరీర్లో ఎప్పుడూ ఏఆర్ రెహమాన్, లేదంటే హారిస్ జైరాజ్తో మాత్రమే పని చేసిన శంకర్.. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్లను మారుస్తున్నాడు. ‘ఇండియన్-2’కు అనిరుధ్తో పని చేయించుకున్న ఆయన.. ‘గేమ్ చేంజర్’కు తమన్ను ఎంచుకున్నాడు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి రెండు పాటలు రాగా.. వాటికి ఓ మోస్తరు స్పందనే వచ్చింది.
జరగండి, రా మచ్చా రా పాటలు సూపర్ అని చెప్పలేం. అలా అని తీసిపడేయలేం. ఐతే తమన్ నుంచి ఇంకా బెస్ట్ అనిపించే పాటను చరణ్ అభిమానులు ఆశిస్తున్నారు. తర్వాతి పాట అలాంటిదే అవుతుందని తమన్ టీం ధీమాగా ఉంది. ఈ సినిమా నుంచి మూడో పాట మెలోడీ అట. అది చాలా జ్ఞాపకాలను మిగులుస్తుందని.. ఈ పాట కోసం సిద్ధంగా ఉండాలని తమన్ పోస్ట్ పెట్టాడు. కొన్ని రోజుల్లోనే ఈ పాటను లాంచ్ చేయబోతున్నారు. మరి అభిమానులు ఆశించే బ్లాస్ట్ సాంగ్ ఇది అవుతుందా అన్నది చూడాలి.
‘గేమ్ చేంజర్’ ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. కొన్ని రోజుల్లోనే గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబరులో చాలా వరకు ప్రమోషన్లను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈవెంట్లు చేయబోతున్నారు. జనవరి 10న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…