మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ ఏస్ డైరెక్టర్ శంకర్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం.. గేమ్ చేంజర్. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యం అయింది కానీ.. ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఇండియాలోనే బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లతో పని చేసిన తమన్.. తనను ‘బాయ్స్’ సినిమాతో నటుడిగా పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ శంకర్తో పని చేయాలని ఎప్పట్నుంచో ఆశపడుతున్నాడు.
తన కెరీర్లో ఎప్పుడూ ఏఆర్ రెహమాన్, లేదంటే హారిస్ జైరాజ్తో మాత్రమే పని చేసిన శంకర్.. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్లను మారుస్తున్నాడు. ‘ఇండియన్-2’కు అనిరుధ్తో పని చేయించుకున్న ఆయన.. ‘గేమ్ చేంజర్’కు తమన్ను ఎంచుకున్నాడు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి రెండు పాటలు రాగా.. వాటికి ఓ మోస్తరు స్పందనే వచ్చింది.
జరగండి, రా మచ్చా రా పాటలు సూపర్ అని చెప్పలేం. అలా అని తీసిపడేయలేం. ఐతే తమన్ నుంచి ఇంకా బెస్ట్ అనిపించే పాటను చరణ్ అభిమానులు ఆశిస్తున్నారు. తర్వాతి పాట అలాంటిదే అవుతుందని తమన్ టీం ధీమాగా ఉంది. ఈ సినిమా నుంచి మూడో పాట మెలోడీ అట. అది చాలా జ్ఞాపకాలను మిగులుస్తుందని.. ఈ పాట కోసం సిద్ధంగా ఉండాలని తమన్ పోస్ట్ పెట్టాడు. కొన్ని రోజుల్లోనే ఈ పాటను లాంచ్ చేయబోతున్నారు. మరి అభిమానులు ఆశించే బ్లాస్ట్ సాంగ్ ఇది అవుతుందా అన్నది చూడాలి.
‘గేమ్ చేంజర్’ ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. కొన్ని రోజుల్లోనే గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. డిసెంబరులో చాలా వరకు ప్రమోషన్లను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈవెంట్లు చేయబోతున్నారు. జనవరి 10న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.
This post was last modified on November 20, 2024 5:16 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…