ప్రపంచస్థాయి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు సాధించిన ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల వివాహ బంధానికి సైరా బాను ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఆమె లాయర్లు మీడియాకు వెల్లడించారు. చాలాకాలంగా వారి వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగుతోందని, అందుకే ఈ బంధం నుంచి తప్పుకోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు.
వారిద్దరి మధ్య ఏర్పడిన అగాథం తొలగిపోదని వారిద్దరూ భావిస్తున్నారని, ఆ కారణంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, తమ గోప్యతకు విలువనివ్వాలని వారు కోరుతున్నారని లాయర్లు చెప్పారు.
1995లో మార్చి 12న చెన్నైలో సైరా బానును ఏఆర్ రహమాన్ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కూతురు ఖతీజాకు రహమాన్ 2022లో వివాహం జరిపించారు. చిన్న కూతురు రహీమా, కొడుకు అమీన్ సంగీత రంగంలో ఉన్నారు.
This post was last modified on November 19, 2024 10:50 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…