ప్రపంచస్థాయి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు సాధించిన ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల వివాహ బంధానికి సైరా బాను ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఆమె లాయర్లు మీడియాకు వెల్లడించారు. చాలాకాలంగా వారి వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగుతోందని, అందుకే ఈ బంధం నుంచి తప్పుకోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు.
వారిద్దరి మధ్య ఏర్పడిన అగాథం తొలగిపోదని వారిద్దరూ భావిస్తున్నారని, ఆ కారణంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, తమ గోప్యతకు విలువనివ్వాలని వారు కోరుతున్నారని లాయర్లు చెప్పారు.
1995లో మార్చి 12న చెన్నైలో సైరా బానును ఏఆర్ రహమాన్ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కూతురు ఖతీజాకు రహమాన్ 2022లో వివాహం జరిపించారు. చిన్న కూతురు రహీమా, కొడుకు అమీన్ సంగీత రంగంలో ఉన్నారు.
This post was last modified on November 19, 2024 10:50 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…