ప్రపంచస్థాయి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు సాధించిన ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల వివాహ బంధానికి సైరా బాను ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఆమె లాయర్లు మీడియాకు వెల్లడించారు. చాలాకాలంగా వారి వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగుతోందని, అందుకే ఈ బంధం నుంచి తప్పుకోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు.
వారిద్దరి మధ్య ఏర్పడిన అగాథం తొలగిపోదని వారిద్దరూ భావిస్తున్నారని, ఆ కారణంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, తమ గోప్యతకు విలువనివ్వాలని వారు కోరుతున్నారని లాయర్లు చెప్పారు.
1995లో మార్చి 12న చెన్నైలో సైరా బానును ఏఆర్ రహమాన్ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కూతురు ఖతీజాకు రహమాన్ 2022లో వివాహం జరిపించారు. చిన్న కూతురు రహీమా, కొడుకు అమీన్ సంగీత రంగంలో ఉన్నారు.
This post was last modified on November 19, 2024 10:50 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…