ప్రపంచస్థాయి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు సాధించిన ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల వివాహ బంధానికి సైరా బాను ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఆమె లాయర్లు మీడియాకు వెల్లడించారు. చాలాకాలంగా వారి వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగుతోందని, అందుకే ఈ బంధం నుంచి తప్పుకోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు.
వారిద్దరి మధ్య ఏర్పడిన అగాథం తొలగిపోదని వారిద్దరూ భావిస్తున్నారని, ఆ కారణంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, తమ గోప్యతకు విలువనివ్వాలని వారు కోరుతున్నారని లాయర్లు చెప్పారు.
1995లో మార్చి 12న చెన్నైలో సైరా బానును ఏఆర్ రహమాన్ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కూతురు ఖతీజాకు రహమాన్ 2022లో వివాహం జరిపించారు. చిన్న కూతురు రహీమా, కొడుకు అమీన్ సంగీత రంగంలో ఉన్నారు.
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…