కంగువ దెబ్బ సూర్య మార్కెట్ మీద ప్రభావం చూపించేలా ఉంది. వందా రెండు వందలు కాదు రెండు వేల కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్న మాటలు చివరికి ట్రోలింగ్ కంటెంట్ గా మారిపోయాయి.
ఆఖరికి జ్యోతిక తన భర్తకు మద్దతుగా సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెడితే ఆ సమర్ధింపుని కూడా నెటిజెన్లు తప్పు బట్టారు. అంతగా కంగువా జనంలో నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది. కనీసం యాభై శాతం బడ్జెట్ రికవరీ అయినా ఏదో అనుకోవచ్చు కానీ ఆ దిశగా సూచనలు లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇప్పుడీ పరిణామం నేరుగా కర్ణ మీద పడిందని బాలీవుడ్ రిపోర్ట్.
ప్రముఖ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా హీరో సూర్య టైటిల్ పాత్రలో సుమారు 600 కోట్లతో కర్ణ కథను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. స్క్రిప్ట్ ఒక కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టుని ముందు టేకప్ చేసిన ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ మారిపోయిన లెక్కల ప్రకారం వర్కౌట్ కాదని భావించి వీలైనంత బడ్జెట్ ని తగ్గించమని రాకేష్ ని కోరిందట.
అయితే అలా చేస్తే క్వాలిటీ తగ్గిపోతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన గురించి అలోచించే పనిలో పడ్డారని అంటున్నారు. కంగువా కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇప్పుడీ డిస్కషన్ ఉండేది కాదేమో. కానీ అదేమో ప్యాన్ ఇండియా రేంజ్ లో డిజాస్టరయ్యింది.
సో ఇప్పుడీ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదానేది కాలమే సమాధానం చెప్పాలి. కంగువా ఇచ్చిన స్ట్రోక్ కి సూర్య సైతం పునఃపరిశీలనలో పడ్డాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ జానర్ ని టచ్ చేసిన టాక్ ఉంది. కంగువా వల్ల ఇప్పుడు దీన్ని భారీ రేట్లతో మార్కెటింగ్ చేసుకోవడం కష్టం.
ఇక కర్ణ సంగతికొస్తే స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వేరెవరు ఆ పాత్రను అంతకన్నా గొప్పగా చూపించలేకపోయారు. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా మాత్రం ట్రెండ్ మారుస్తా అన్నారు. ఎప్పటికి మొదలవుతుందో చూడాలి.
This post was last modified on November 19, 2024 2:18 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…