టాలీవుడ్ సత్తా ఢిల్లీ దాకా వినిపించే స్థాయిలో అంచనాలు పెంచుకున్న పుష్ప 2 ది రూల్ ట్రైలర్ చేస్తున్న అరాచకం అందరూ చూస్తున్నదే. ఇండస్ట్రీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు ట్విట్టర్ వేదికగా దీని మీద ప్రశంసల జల్లులు కురిపిస్తూ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నామని అభిమానులకు జోష్ పెంచుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదని, కనీసం ఎవరూ షేర్ చేసుకోలేదని కొందరు నెటిజెన్లు చేస్తున్న కామెంట్లు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. ఆల్రెడీ ఆన్ లైన్ లో మెగా వర్సెస్ అల్లు పేరుతో ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిన విషయమే. దానికే మరింత ఆజ్యం పోస్తున్నారు.
నిజానికి ఎవరైనా ఎందుకు స్పందించాలి అనేది ఇక్కడ ప్రస్తావించాల్సిన బేసిక్ లాజిక్. పుష్ప 2 గురించి చిరంజీవితో మొదలుపెట్టి వైష్ణవ్ తేజ్ వరకు ఎవరూ మెచ్చుకోలేదని అంటున్న వాళ్లే మరి బన్నీ ఈ ఏడాదిలో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మట్కా, కమిటీ కుర్రోళ్ళు, విశ్వంభర, గేమ్ ఛేంజర్ తదితర సినిమాల కంటెంట్ ని ఎక్కడా కోట్ చేయలేదు. సరే షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఒక అయిదు నిముషాలు కేటాయిస్తే అయిపోతుందిగా అనేది మెగాభిమానుల వెర్షన్. అయినా ప్రతిదానికి వివరణ ఎందుకివ్వాలనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న కౌంటర్.
ఎంత ఒకే ఫ్యామిలీ అయినా, కాకపోయినా పరస్పరం ఒకరికొకరు అవతలి వాళ్ళ సినిమాల గురించి గొప్పగా చెప్పుకోవాలన్న రూల్ ఏం లేదు. పుష్ప 2 పట్ల మెగాస్టార్ ఏం చెప్పకపోయినా, విశ్వంభర గురించి బన్నీ పట్టించుకోకపోయినా అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ఈ మధ్యే బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ అందరు హీరోల గురించి తన మనసులో మాటలు బయట పెట్టాడు. మేమంతా ఒకటేనని అల్లు అరవింద్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఇంటర్వ్యూలు గట్రా ఇవ్వలేదు కాబట్టి తర్వాతైనా ఆయన వైపు నుంచి ఏదో రోజు క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా ఈ ఫ్యాన్ వార్ గోల ఎక్స్ లో కనిపిస్తూనే ఉంటుంది.
This post was last modified on November 19, 2024 1:43 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…