టాలీవుడ్ సత్తా ఢిల్లీ దాకా వినిపించే స్థాయిలో అంచనాలు పెంచుకున్న పుష్ప 2 ది రూల్ ట్రైలర్ చేస్తున్న అరాచకం అందరూ చూస్తున్నదే. ఇండస్ట్రీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు ట్విట్టర్ వేదికగా దీని మీద ప్రశంసల జల్లులు కురిపిస్తూ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నామని అభిమానులకు జోష్ పెంచుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదని, కనీసం ఎవరూ షేర్ చేసుకోలేదని కొందరు నెటిజెన్లు చేస్తున్న కామెంట్లు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. ఆల్రెడీ ఆన్ లైన్ లో మెగా వర్సెస్ అల్లు పేరుతో ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిన విషయమే. దానికే మరింత ఆజ్యం పోస్తున్నారు.
నిజానికి ఎవరైనా ఎందుకు స్పందించాలి అనేది ఇక్కడ ప్రస్తావించాల్సిన బేసిక్ లాజిక్. పుష్ప 2 గురించి చిరంజీవితో మొదలుపెట్టి వైష్ణవ్ తేజ్ వరకు ఎవరూ మెచ్చుకోలేదని అంటున్న వాళ్లే మరి బన్నీ ఈ ఏడాదిలో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మట్కా, కమిటీ కుర్రోళ్ళు, విశ్వంభర, గేమ్ ఛేంజర్ తదితర సినిమాల కంటెంట్ ని ఎక్కడా కోట్ చేయలేదు. సరే షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఒక అయిదు నిముషాలు కేటాయిస్తే అయిపోతుందిగా అనేది మెగాభిమానుల వెర్షన్. అయినా ప్రతిదానికి వివరణ ఎందుకివ్వాలనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న కౌంటర్.
ఎంత ఒకే ఫ్యామిలీ అయినా, కాకపోయినా పరస్పరం ఒకరికొకరు అవతలి వాళ్ళ సినిమాల గురించి గొప్పగా చెప్పుకోవాలన్న రూల్ ఏం లేదు. పుష్ప 2 పట్ల మెగాస్టార్ ఏం చెప్పకపోయినా, విశ్వంభర గురించి బన్నీ పట్టించుకోకపోయినా అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ఈ మధ్యే బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ అందరు హీరోల గురించి తన మనసులో మాటలు బయట పెట్టాడు. మేమంతా ఒకటేనని అల్లు అరవింద్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఇంటర్వ్యూలు గట్రా ఇవ్వలేదు కాబట్టి తర్వాతైనా ఆయన వైపు నుంచి ఏదో రోజు క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా ఈ ఫ్యాన్ వార్ గోల ఎక్స్ లో కనిపిస్తూనే ఉంటుంది.
This post was last modified on November 19, 2024 1:43 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…