ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ దర్శకుల్లో.. హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లలో సందీప్ రెడ్డి వంగ ఒకడు. తన సినిమాలో ఎవరు హీరో అయినా.. కేవలం సందీప్ మీదే వందల కోట్ల బిజినెస్ జరిగే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా తీసింది రెండు కథలు, మూడు సినిమాలే అయినా.. సందీప్కు ఉన్న క్రేజే వేరు. అతడితో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
సందీప్ సినిమాలే కాదు.. తన ఇంటర్వ్యూలు, ఏదైనా వేదికల్లో అతను మాట్లాడే మాటలు కూడా అమితాసక్తి రేకెత్తిస్తుంటాయి. స్టార్ హీరోల గురించి అతను మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు. తాజాగా అతను మహేష్ బాబు గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇండియాలోని స్టార్ హీరోలలో మహేష్ బాబు చాలా స్పెషల్ అని సందీప్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
తాను మహేష్తో ఒక యాడ్ ఫిలిం చేశానని.. దాంతో పాటుగా నాలుగైదుసార్లు అతణ్ని బయట కలిశానని సందీప్ వెల్లడించాడు. మనం సినిమాల్లో చూసేదాంతో పోలిస్తే మహేష్ చాలా భిన్నమని.. సినిమాల్లో మనం చూసేది మహేష్లో 25 శాతం మాత్రమే అని.. మిగతా 75 శాతాన్ని ఎవ్వరికీ కనిపించదని.. అది ఒక స్టార్లో ఉన్న స్సెషల్ క్వాలిటీ అని సందీప్ అన్నాడు. ప్రేక్షకులుగా మనం మహేష్ను ఎప్పట్నంచో చూస్తున్నామని.. దర్శకుడయ్యాక తాను మహేష్ను దగ్గరగా చూశానని.. అతను షూ లేస్ కట్టుకునే తీరు… షర్ట్ సరి చేసుకునే తీరు.. జుట్టు లాక్కోవడం.. ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుందని.. బయట మహేష్లో ఉండే ఎనర్జీని మనం స్క్రీన్ మీద చూడలేదని సందీప్ అన్నాడు.
ఇలా మహేష్ ఎంత స్పెషల్ అనే విషయాన్ని తనదైన శైలిలో కొత్తగా చెప్పాడు సందీప్. వీరి కలయికలో సినిమా వస్తుందని గతంలో ప్రచారం జరిగింది కానీ.. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమాతో బిజీ అయిపోతుండగా, సందీప్ ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ సినిమాలు తీయాల్సి ఉంది.
This post was last modified on November 19, 2024 10:22 am
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…