Movie News

దేవరకు ఇవ్వలేదు.. పుష్ప 2కి ఇస్తారా?

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ పై ఉన్న బజ్ ట్రైలర్ ద్వారా మరింత పెరిగింది. ఇక పుష్ప మొదటి భాగం క్రియేట్ చేసిన సెన్సేషన్ దృష్ట్యా, రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంత క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఎలాగూ రేట్లు గట్టిగానే ఉంటాయి. ఇక బెన్ ఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు, ఎక్స్ ట్రా షోలు అనేవి బోనస్. ఇక ఆంధ్రప్రదేశ్ లో పుష్ప 2కి ఎలాంటి వెసులుబాటు ఉంటుందనేది అసలు ప్రశ్న. కూటమి ప్రభుత్వం పెద్ద సినిమాలకు ఇదివరకే మంచి రేట్లను, ఆడిగినన్ని షోలు ఇస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ కూడా లభించింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలను 300 రూపాయల వరకూ పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

గతంలో వైసీపీ పాలనలో పుష్ప 1 టికెట్ ధరల విషయంలో సరైన మద్దతు లభించకపోవడంతో నష్టాలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా సర్కార్ అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కల్కి – దేవర సినిమాలకు మంచి రేట్లే ఇచ్చారు. అయితే, ఆ చిత్రాలకు మరీ 300 రూపాయలు కాకుండా గరిష్ఠంగా 250 రూపాయల వరకు మాత్రమే టికెట్ ధరలను అనుమతించారు. ఇక దేవరకు ఇవ్వలేని ఆ ఆఫర్ ను ఇప్పుడు పుష్ప 2కి ఇస్తారా అనే ప్రశ్న సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఇది సాధ్యమైతే, వారాంతపు కలెక్షన్లలో సూపర్ హిట్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెరగడం కొత్త విషయం కాదు. కానీ 300 రూపాయల రేటు వంటి ప్రతిపాదనలు అరుదుగా వస్తాయి. పుష్ప 2ని ప్రేక్షకులు థియేటర్లలో మాత్రమే చూడాలనే ఉత్సాహంతో ఉన్నందున, ఈ పెంపు నిర్ణయానికి భారీ స్పందన వచ్చే అవకాశముంది. అయితే, ఈ ధరల వల్ల వీకెండ్ తర్వాత కలెక్షన్లపై ప్రభావం పడుతుందా లేదా అనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి, పుష్ప 2పై ఉన్న క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ చేసిన ఈ వ్యూహం ఎలా పని చేస్తుందో చూడాలి.

This post was last modified on November 19, 2024 2:45 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

37 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago