పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ పై ఉన్న బజ్ ట్రైలర్ ద్వారా మరింత పెరిగింది. ఇక పుష్ప మొదటి భాగం క్రియేట్ చేసిన సెన్సేషన్ దృష్ట్యా, రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇంత క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎలాగూ రేట్లు గట్టిగానే ఉంటాయి. ఇక బెన్ ఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు, ఎక్స్ ట్రా షోలు అనేవి బోనస్. ఇక ఆంధ్రప్రదేశ్ లో పుష్ప 2కి ఎలాంటి వెసులుబాటు ఉంటుందనేది అసలు ప్రశ్న. కూటమి ప్రభుత్వం పెద్ద సినిమాలకు ఇదివరకే మంచి రేట్లను, ఆడిగినన్ని షోలు ఇస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ కూడా లభించింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలను 300 రూపాయల వరకూ పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
గతంలో వైసీపీ పాలనలో పుష్ప 1 టికెట్ ధరల విషయంలో సరైన మద్దతు లభించకపోవడంతో నష్టాలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా సర్కార్ అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కల్కి – దేవర సినిమాలకు మంచి రేట్లే ఇచ్చారు. అయితే, ఆ చిత్రాలకు మరీ 300 రూపాయలు కాకుండా గరిష్ఠంగా 250 రూపాయల వరకు మాత్రమే టికెట్ ధరలను అనుమతించారు. ఇక దేవరకు ఇవ్వలేని ఆ ఆఫర్ ను ఇప్పుడు పుష్ప 2కి ఇస్తారా అనే ప్రశ్న సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇది సాధ్యమైతే, వారాంతపు కలెక్షన్లలో సూపర్ హిట్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు పెరగడం కొత్త విషయం కాదు. కానీ 300 రూపాయల రేటు వంటి ప్రతిపాదనలు అరుదుగా వస్తాయి. పుష్ప 2ని ప్రేక్షకులు థియేటర్లలో మాత్రమే చూడాలనే ఉత్సాహంతో ఉన్నందున, ఈ పెంపు నిర్ణయానికి భారీ స్పందన వచ్చే అవకాశముంది. అయితే, ఈ ధరల వల్ల వీకెండ్ తర్వాత కలెక్షన్లపై ప్రభావం పడుతుందా లేదా అనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి, పుష్ప 2పై ఉన్న క్రేజ్ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ చేసిన ఈ వ్యూహం ఎలా పని చేస్తుందో చూడాలి.
This post was last modified on November 19, 2024 2:45 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…