మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన వచ్చింది. కొంతమంది నెగెటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు కానీ.. ఎక్కువమంది ట్రైలర్ అదుర్స్ అనే అంటున్నారు. సినిమా మీద ఇప్పటికే ఉన్న హైప్ను ట్రైలర్ ఇంకా పెంచిందన్నది వాస్తవం.
ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ‘పుష్ప-2’ ట్రైలర్ చూసి ఊగిపోతున్నారు. అక్కడి క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు కూడా ‘పుష్ప-2’ గురించి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ‘పుష్ప-2’ వసూళ్ల మీద కూడా అంచనాలు మొదలయ్యాయి. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు ‘పుష్ప-2’ తొలి రోజు వసూళ్ల గురించి ప్రెడిక్షన్స్ చెబుతూ.. పోల్స్ పెడుతున్నారు. అంతే కాక దీనిపై బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
‘పుష్ప-2’ హిందీ వెర్షన్ మాత్రమే మినిమం 60 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అంటున్నారు. కానీ ఇది కనీస వసూళ్లు మాత్రమే అని.. అన్నీ కలిసి వస్తే రూ.75-80 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం ‘జవాన్’ సినిమా రూ.65 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ‘పుష్ప-2’ ఆ రికార్డును బద్దలు కొట్టడానికి మెరుగైన అవకాశాలున్నాయి.
అసలు డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘పుష్ప: ది రైజ్’ అంతిమంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకోవడానికి నార్త్ ఇండియాలో పెద్ద హిట్టవడమే ప్రధాన కారణం. ఇప్పుడు అక్కడ ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. ‘బాహుబలి-2’ తర్వాత ఆ స్థాయిలో హైప్ ఈ చిత్రానికే ఉంది. అప్పటితో పోలిస్తే థియేటర్ల సంఖ్య, టికెట్ల ధరలు పెరిగిన నేపథ్యంలో వసూళ్లు కూడా బాగా పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వసూళ్ల మీద ట్రేడ్ పండిట్స్ అంచనాలు చెబుతూ. పోల్స్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా పుష్ప-2 కలెక్షన్లు ఏ రేంజిలో ఉంటాయనే దాని మీద బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
This post was last modified on November 18, 2024 9:04 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…