మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన వచ్చింది. కొంతమంది నెగెటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు కానీ.. ఎక్కువమంది ట్రైలర్ అదుర్స్ అనే అంటున్నారు. సినిమా మీద ఇప్పటికే ఉన్న హైప్ను ట్రైలర్ ఇంకా పెంచిందన్నది వాస్తవం.
ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ‘పుష్ప-2’ ట్రైలర్ చూసి ఊగిపోతున్నారు. అక్కడి క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు కూడా ‘పుష్ప-2’ గురించి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ‘పుష్ప-2’ వసూళ్ల మీద కూడా అంచనాలు మొదలయ్యాయి. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు ‘పుష్ప-2’ తొలి రోజు వసూళ్ల గురించి ప్రెడిక్షన్స్ చెబుతూ.. పోల్స్ పెడుతున్నారు. అంతే కాక దీనిపై బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
‘పుష్ప-2’ హిందీ వెర్షన్ మాత్రమే మినిమం 60 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అంటున్నారు. కానీ ఇది కనీస వసూళ్లు మాత్రమే అని.. అన్నీ కలిసి వస్తే రూ.75-80 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం ‘జవాన్’ సినిమా రూ.65 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ‘పుష్ప-2’ ఆ రికార్డును బద్దలు కొట్టడానికి మెరుగైన అవకాశాలున్నాయి.
అసలు డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘పుష్ప: ది రైజ్’ అంతిమంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకోవడానికి నార్త్ ఇండియాలో పెద్ద హిట్టవడమే ప్రధాన కారణం. ఇప్పుడు అక్కడ ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. ‘బాహుబలి-2’ తర్వాత ఆ స్థాయిలో హైప్ ఈ చిత్రానికే ఉంది. అప్పటితో పోలిస్తే థియేటర్ల సంఖ్య, టికెట్ల ధరలు పెరిగిన నేపథ్యంలో వసూళ్లు కూడా బాగా పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వసూళ్ల మీద ట్రేడ్ పండిట్స్ అంచనాలు చెబుతూ. పోల్స్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా పుష్ప-2 కలెక్షన్లు ఏ రేంజిలో ఉంటాయనే దాని మీద బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
This post was last modified on November 18, 2024 9:04 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…