మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన వచ్చింది. కొంతమంది నెగెటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు కానీ.. ఎక్కువమంది ట్రైలర్ అదుర్స్ అనే అంటున్నారు. సినిమా మీద ఇప్పటికే ఉన్న హైప్ను ట్రైలర్ ఇంకా పెంచిందన్నది వాస్తవం.
ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ‘పుష్ప-2’ ట్రైలర్ చూసి ఊగిపోతున్నారు. అక్కడి క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు కూడా ‘పుష్ప-2’ గురించి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ‘పుష్ప-2’ వసూళ్ల మీద కూడా అంచనాలు మొదలయ్యాయి. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు ‘పుష్ప-2’ తొలి రోజు వసూళ్ల గురించి ప్రెడిక్షన్స్ చెబుతూ.. పోల్స్ పెడుతున్నారు. అంతే కాక దీనిపై బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
‘పుష్ప-2’ హిందీ వెర్షన్ మాత్రమే మినిమం 60 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అంటున్నారు. కానీ ఇది కనీస వసూళ్లు మాత్రమే అని.. అన్నీ కలిసి వస్తే రూ.75-80 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం ‘జవాన్’ సినిమా రూ.65 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ‘పుష్ప-2’ ఆ రికార్డును బద్దలు కొట్టడానికి మెరుగైన అవకాశాలున్నాయి.
అసలు డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘పుష్ప: ది రైజ్’ అంతిమంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకోవడానికి నార్త్ ఇండియాలో పెద్ద హిట్టవడమే ప్రధాన కారణం. ఇప్పుడు అక్కడ ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. ‘బాహుబలి-2’ తర్వాత ఆ స్థాయిలో హైప్ ఈ చిత్రానికే ఉంది. అప్పటితో పోలిస్తే థియేటర్ల సంఖ్య, టికెట్ల ధరలు పెరిగిన నేపథ్యంలో వసూళ్లు కూడా బాగా పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వసూళ్ల మీద ట్రేడ్ పండిట్స్ అంచనాలు చెబుతూ. పోల్స్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా పుష్ప-2 కలెక్షన్లు ఏ రేంజిలో ఉంటాయనే దాని మీద బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి.
This post was last modified on November 18, 2024 9:04 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…