మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక త్వరలోనే మరికొన్ని రోజుల్లో ఏదో ఒక అప్డేట్ రావచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి మరొక పనిలో బిజీ కావడంతో ఇప్పట్లో మహేష్ తో ప్రాజెక్టులో బిజి అయ్యే అవకాశం లేదని అనిపిస్తోంది.
ఇక మహేష్ బాబు మొన్నటి వరకు లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపించగా ఇప్పుడు మొత్తం లుక్ మార్చేసి కొత్తగా దర్శనమిచ్చాడు. కీరవాణి కొడుకు శ్రీ సింహ కోడూరి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. మురళి మోహన్ మనవరాలు రాగ మాగంటితో సింహా ఏడాడుగులు వేయనున్నారు. ఆదివారం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది.
ఇక వివాహం డిసెంబర్ 14 యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో గ్రాండ్గా జరగనుంది. అక్కడే వారం రోజుల పాటు సంగీత్ అని వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక ఆ తరువాత ఇండియాకు వచ్చి రాగానే రిసెప్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇటు మురళీమోహన్, అటు రాజమౌళి తరఫున సినీ ప్రముఖులు రాజకీయ నాయకులను పిలవాల్సి ఉంటుంది. కాబట్టి రాజమౌళి ఈ హడావుడి లో మహేష్ ప్రాజెక్టుపై ఆలోచించే అవకాశం తక్కువ. అన్ని కార్యక్రమాలు ఫినిష్ అయ్యాకే తీరిగ్గా వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం సినిమా పనులు మళ్ళీ షురూ చేసే అవకాశం ఉంది. ఇక రాజమౌళి తీసుకున్న బ్రేక్ కారణంగా మహేష్ మరికొంత కాలం మౌనంగా ఎదురుచూడక తప్పదు.
This post was last modified on November 18, 2024 4:35 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…