‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యకరంగా బీహార్లోని పాట్నాను వేదికగా ఎంచుకుని షాకిచ్చింది టీం. అక్కడ కూడా చిన్న స్థాయి ఈవెంటే ఉంటుందనుకున్నారు. కానీ మన దగ్గర బహిరంగ మైదానాల్లో జరిగే ప్రి రిలీజ్ ఈవెంట్, ఆడియో వేడుకల్ని తలదన్నేలా భారీ స్థాయిలో జరిగిన ఈవెంట్ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది.
సౌత్ స్టార్ హీరోల సినమాలకు వారి రాష్ట్రాల్లో పెద్ద ఈవెంట్లు చేయడం, అభిమానులు భారీ ఎత్తున తరలి రావడం విశేషమేమీ కాదు. కానీ పాట్నా లాంటి చోట ఓ తెలుగు హీరో సినిమా ఈవెంట్కు ఇలా జనం తండోపతండాలుగా రావడం, భారీ మైదానం జనంతో కిక్కిరిసిపోవడం అనూహ్యం. మధ్యాహ్నం తర్వాత మొదలైన జనసందోహం సాయంత్రానికి అదుపు చేయలేని స్థాయికి చేరుకుంది.
900 మంది పోలీసులు, 300 మందికి పైగా ప్రైవేటు సెక్యూరిటీని పెట్టి మరీ ఈ ఈవెంట్ను నిర్వహించడం గమనార్హం. ఈ స్థాయితో భద్రత కల్పించినా ‘పుష్ప-2’ ఈవెంట్కు పరిమితికి మించి జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనాన్ని అదుపు చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఒక దశలో జనం పోలీసుల మీదికి చెప్పులు, రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు మరింతగా లాఠీలను ఝుళిపించారు. స్వల్పంగా తొక్కిసలాట కూడా జరిగింది. ఐతే అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం తలెత్తలేదు.
అల్లు అర్జున్ వేదిక మీదికి వచ్చే సమయానికి అతణ్ని చూసేందుకు వేదిక మధ్యలో ఉన్న టవర్ మీదికి వందల మంది ఎక్కేసి నిలడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి ‘పుష్ప-2’ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందనడంలో సందేహం లేదు. ఇదేదో పొలిటికల్ ఈవెంట్ అనుకునే స్థాయిలో దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
This post was last modified on November 18, 2024 2:20 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…