Movie News

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యకరంగా బీహార్‌లోని పాట్నాను వేదికగా ఎంచుకుని షాకిచ్చింది టీం. అక్కడ కూడా చిన్న స్థాయి ఈవెంటే ఉంటుందనుకున్నారు. కానీ మన దగ్గర బహిరంగ మైదానాల్లో జరిగే ప్రి రిలీజ్ ఈవెంట్, ఆడియో వేడుకల్ని తలదన్నేలా భారీ స్థాయిలో జరిగిన ఈవెంట్ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది.

సౌత్ స్టార్ హీరోల సినమాలకు వారి రాష్ట్రాల్లో పెద్ద ఈవెంట్లు చేయడం, అభిమానులు భారీ ఎత్తున తరలి రావడం విశేషమేమీ కాదు. కానీ పాట్నా లాంటి చోట ఓ తెలుగు హీరో సినిమా ఈవెంట్‌కు ఇలా జనం తండోపతండాలుగా రావడం, భారీ మైదానం జనంతో కిక్కిరిసిపోవడం అనూహ్యం. మధ్యాహ్నం తర్వాత మొదలైన జనసందోహం సాయంత్రానికి అదుపు చేయలేని స్థాయికి చేరుకుంది.

900 మంది పోలీసులు, 300 మందికి పైగా ప్రైవేటు సెక్యూరిటీని పెట్టి మరీ ఈ ఈవెంట్‌ను నిర్వహించడం గమనార్హం. ఈ స్థాయితో భద్రత కల్పించినా ‘పుష్ప-2’ ఈవెంట్‌కు పరిమితికి మించి జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనాన్ని అదుపు చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఒక దశలో జనం పోలీసుల మీదికి చెప్పులు, రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు మరింతగా లాఠీలను ఝుళిపించారు. స్వల్పంగా తొక్కిసలాట కూడా జరిగింది. ఐతే అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం తలెత్తలేదు.

అల్లు అర్జున్ వేదిక మీదికి వచ్చే సమయానికి అతణ్ని చూసేందుకు వేదిక మధ్యలో ఉన్న టవర్ మీదికి వందల మంది ఎక్కేసి నిలడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి ‘పుష్ప-2’ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందనడంలో సందేహం లేదు. ఇదేదో పొలిటికల్ ఈవెంట్ అనుకునే స్థాయిలో దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

This post was last modified on November 18, 2024 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

27 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago