వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని చీవాట్లు పెట్టింది. చట్టాలకు అతీతంగా వ్యవహరించి.. ఇప్పుడు చట్టా ల ద్వారా రక్షణ కోరడం ఇటీవల కాలంలో అలవాటుగా మారిందని దుయ్యబట్టింది. చట్టం పరిధిలో వ్యవ హరించాల్సిన బాధ్యత సమాజ స్థితిగతులు తెలిసిన దర్శకుడిగా మీకు తెలియదా? అని నిలదీసింది. ఓ కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న వర్మ పిటిషన్పై కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.
ఏంటా కేసు?
ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై గతంలో వర్మ అనుచిత పోస్టులు చేశా రంటూ.. కొందరు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా వ్యూహం సినిమా చిత్రీకరణ సమయంలో చంద్రబాబు, పవన్లను కించపరిచేలా ఆయన పోస్టర్లను ప్రిపేర్ చేశారన్నది ఈ కేసు సారాంశం. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం.. ఇటీవల ఆయన కోసం ముంబై వెళ్లి.. అక్కడే ఆయనకు 41ఏ కింద నోటీసులు కూడా ఇవ్వడం తెలిసిందే.
అయితే.. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ.. వర్మ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టంఅందరికీ సమానమేనని వ్యాఖ్యానించింది. దర్శకుడు అయినంత మాత్రాన చట్టాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపింది.
అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అయితే.. మంగళవారం జరిగే పోలీసు విచారణకు హాజరు కావాలని వర్మను ఆదేశించింది.
This post was last modified on November 18, 2024 1:43 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…