వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని చీవాట్లు పెట్టింది. చట్టాలకు అతీతంగా వ్యవహరించి.. ఇప్పుడు చట్టా ల ద్వారా రక్షణ కోరడం ఇటీవల కాలంలో అలవాటుగా మారిందని దుయ్యబట్టింది. చట్టం పరిధిలో వ్యవ హరించాల్సిన బాధ్యత సమాజ స్థితిగతులు తెలిసిన దర్శకుడిగా మీకు తెలియదా? అని నిలదీసింది. ఓ కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న వర్మ పిటిషన్పై కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.
ఏంటా కేసు?
ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై గతంలో వర్మ అనుచిత పోస్టులు చేశా రంటూ.. కొందరు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా వ్యూహం సినిమా చిత్రీకరణ సమయంలో చంద్రబాబు, పవన్లను కించపరిచేలా ఆయన పోస్టర్లను ప్రిపేర్ చేశారన్నది ఈ కేసు సారాంశం. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం.. ఇటీవల ఆయన కోసం ముంబై వెళ్లి.. అక్కడే ఆయనకు 41ఏ కింద నోటీసులు కూడా ఇవ్వడం తెలిసిందే.
అయితే.. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ.. వర్మ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టంఅందరికీ సమానమేనని వ్యాఖ్యానించింది. దర్శకుడు అయినంత మాత్రాన చట్టాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపింది.
అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అయితే.. మంగళవారం జరిగే పోలీసు విచారణకు హాజరు కావాలని వర్మను ఆదేశించింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…