వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని చీవాట్లు పెట్టింది. చట్టాలకు అతీతంగా వ్యవహరించి.. ఇప్పుడు చట్టా ల ద్వారా రక్షణ కోరడం ఇటీవల కాలంలో అలవాటుగా మారిందని దుయ్యబట్టింది. చట్టం పరిధిలో వ్యవ హరించాల్సిన బాధ్యత సమాజ స్థితిగతులు తెలిసిన దర్శకుడిగా మీకు తెలియదా? అని నిలదీసింది. ఓ కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న వర్మ పిటిషన్పై కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.
ఏంటా కేసు?
ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై గతంలో వర్మ అనుచిత పోస్టులు చేశా రంటూ.. కొందరు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా వ్యూహం సినిమా చిత్రీకరణ సమయంలో చంద్రబాబు, పవన్లను కించపరిచేలా ఆయన పోస్టర్లను ప్రిపేర్ చేశారన్నది ఈ కేసు సారాంశం. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం.. ఇటీవల ఆయన కోసం ముంబై వెళ్లి.. అక్కడే ఆయనకు 41ఏ కింద నోటీసులు కూడా ఇవ్వడం తెలిసిందే.
అయితే.. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ.. వర్మ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టంఅందరికీ సమానమేనని వ్యాఖ్యానించింది. దర్శకుడు అయినంత మాత్రాన చట్టాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపింది.
అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అయితే.. మంగళవారం జరిగే పోలీసు విచారణకు హాజరు కావాలని వర్మను ఆదేశించింది.
This post was last modified on November 18, 2024 1:43 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…