అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్ మీడియాను ముంచెత్తేసింది. దేశవ్యాప్తంగా ఈ ట్రైలర్ చర్చనీయాంశంగా మారింది. నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది ‘పుష్ప-2’ ట్రైలర్. ఇందులో చాలా హైలైట్లు ఉన్నా.. చివర్లో వచ్చిన ‘వైల్డ్ ఫైర్’ డైలాగ్ బాగా పేలింది.
‘పుష్ప’ పార్ట్-1 రిలీజైనపుడు ‘పుష్ప అంటే ఫ్లవరనుకున్నావా.. ఫైర్’ అనే డైలాగ్తో ఊపేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు తాను జస్ట్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ తన చుట్టూ ఉన్న వాళ్లతో చెప్పించిన పంచ్ డైలాగ్ బాగా హైలైట్ అయింది. ఈ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరూ ‘వైల్డ్ ఫైర్’ అనే మాటతోనే ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం అదే బాటలో పయనించాడు. ‘పుష్ప-2’ ట్రైలర్ మీద ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
“పట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతా విస్తరిస్తోంది. డిసెంబరు 5న పేలబోతోంది. పుష్ప పార్టీ కోసం ఆగలేకపోతున్నా” అంటూ జక్కన్న ఈ ఉదయం ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. రాజమౌళి అన్ని సినిమాలకూ ఏమీ స్పందించడు. తనకు కావాల్సిన వాళ్ల సినిమాల గురించి, లేదా తనకు బాగా నచ్చిన సినిమాల గురించే ఇలా పోస్టులు పెడతాడు. ‘పుష్ప-2’ ట్రైలర్ మీద ఒక సగటు అభిమానిలా పోస్టు పెట్టడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
సుకుమార్ మీద రాజమౌళికి ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. గతంలో సుకుమార్తో కలిసి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు. అంతే కాక ఓ సందర్భంగా సుకుమార్, త్రివిక్రమ్ మాస్ లీగ్లోకి రాలేదు కానీ.. వస్తే తనకు మించి మాస్ డైరెక్టర్లు అవుతారని పేర్కొన్నాడు. అలాగే ‘జగడం’ సినిమాలో ఓ సన్నివేశంలో మాస్ గురించి మరో ఇంటర్వ్యూలో ఒక రేంజిోల ఎలివేషన్ ఇచ్చాడు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…