అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్ మీడియాను ముంచెత్తేసింది. దేశవ్యాప్తంగా ఈ ట్రైలర్ చర్చనీయాంశంగా మారింది. నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది ‘పుష్ప-2’ ట్రైలర్. ఇందులో చాలా హైలైట్లు ఉన్నా.. చివర్లో వచ్చిన ‘వైల్డ్ ఫైర్’ డైలాగ్ బాగా పేలింది.
‘పుష్ప’ పార్ట్-1 రిలీజైనపుడు ‘పుష్ప అంటే ఫ్లవరనుకున్నావా.. ఫైర్’ అనే డైలాగ్తో ఊపేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు తాను జస్ట్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ తన చుట్టూ ఉన్న వాళ్లతో చెప్పించిన పంచ్ డైలాగ్ బాగా హైలైట్ అయింది. ఈ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరూ ‘వైల్డ్ ఫైర్’ అనే మాటతోనే ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం అదే బాటలో పయనించాడు. ‘పుష్ప-2’ ట్రైలర్ మీద ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
“పట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతా విస్తరిస్తోంది. డిసెంబరు 5న పేలబోతోంది. పుష్ప పార్టీ కోసం ఆగలేకపోతున్నా” అంటూ జక్కన్న ఈ ఉదయం ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. రాజమౌళి అన్ని సినిమాలకూ ఏమీ స్పందించడు. తనకు కావాల్సిన వాళ్ల సినిమాల గురించి, లేదా తనకు బాగా నచ్చిన సినిమాల గురించే ఇలా పోస్టులు పెడతాడు. ‘పుష్ప-2’ ట్రైలర్ మీద ఒక సగటు అభిమానిలా పోస్టు పెట్టడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
సుకుమార్ మీద రాజమౌళికి ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. గతంలో సుకుమార్తో కలిసి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు. అంతే కాక ఓ సందర్భంగా సుకుమార్, త్రివిక్రమ్ మాస్ లీగ్లోకి రాలేదు కానీ.. వస్తే తనకు మించి మాస్ డైరెక్టర్లు అవుతారని పేర్కొన్నాడు. అలాగే ‘జగడం’ సినిమాలో ఓ సన్నివేశంలో మాస్ గురించి మరో ఇంటర్వ్యూలో ఒక రేంజిోల ఎలివేషన్ ఇచ్చాడు.
This post was last modified on November 18, 2024 12:43 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…