మిస్తి ముఖర్జీ అని పశ్చిమ బెంగాల్కు చెందిన బెంగాలీ నటి బెంగళూరులో హఠాత్తుగా కన్నుమూయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వయసు 27 ఏళ్లు మాత్రమే. అధిక బరువు ఉన్న ఈ అమ్మాయి.. బరువు తగ్గించుకునేందుకు కొంత కాలంగా కీటో డైట్ ఫాలో అవుతున్నట్లు సమాచారం.
ఐతే ఆ డైట్ తేడా కొట్టి ఆమె కిడ్నీలపై ప్రభావం పడిందట. ఒక కిడ్నీ పాడై.. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయిన మిస్తి ఆసుపత్రిలో చేరింది. అక్కడి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలినట్లు అక్కడి మీడియా చెబుతోంది.
మిస్తి బెంగాలీతో పాటు కొన్ని హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించింది 2012లో లైఫ్ కి తో లగ్ గయి సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. మిస్తి.మోడలింగ్ కూడా చేసింది. ఎన్నో సినిమాలు, మ్యూజిక్ వీడియోల ద్వారా తన ప్రతిభను చాటుకున్న మిస్తి ముఖర్జీ ఇక లేరు.
కీటో డైట్ వల్ల ఆమె కిడ్నీ పాడైంది. చికిత్స పొందుతూ బెంగళూరులో మిస్తి చనిపోయింది. చనిపోయేముందు ఆమె తీవ్రమైన నొప్పిని అనుభవించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. మిస్తికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు అని మిస్తి తరఫు వారు అధికారిక ప్రకటన వెలువరించారు.
కీటో డైట్ వల్లే మిస్తి ప్రాణం పోయిందని ఆమె తరఫువారు ప్రకటించారు అంటే.. ఈ డైట్ పట్ల జనాల్లో ఆందోళన, సందేహాలు కలగడం ఖాయం. ఈ డైట్ ప్రకారం తినే తిండిలో 75 శాతం కొవ్వు, 20 శాతం ప్రొటీన్, 5 శాతం కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి.
This post was last modified on October 4, 2020 11:13 pm
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…