మిస్తి ముఖర్జీ అని పశ్చిమ బెంగాల్కు చెందిన బెంగాలీ నటి బెంగళూరులో హఠాత్తుగా కన్నుమూయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వయసు 27 ఏళ్లు మాత్రమే. అధిక బరువు ఉన్న ఈ అమ్మాయి.. బరువు తగ్గించుకునేందుకు కొంత కాలంగా కీటో డైట్ ఫాలో అవుతున్నట్లు సమాచారం.
ఐతే ఆ డైట్ తేడా కొట్టి ఆమె కిడ్నీలపై ప్రభావం పడిందట. ఒక కిడ్నీ పాడై.. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయిన మిస్తి ఆసుపత్రిలో చేరింది. అక్కడి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలినట్లు అక్కడి మీడియా చెబుతోంది.
మిస్తి బెంగాలీతో పాటు కొన్ని హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించింది 2012లో లైఫ్ కి తో లగ్ గయి సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. మిస్తి.మోడలింగ్ కూడా చేసింది. ఎన్నో సినిమాలు, మ్యూజిక్ వీడియోల ద్వారా తన ప్రతిభను చాటుకున్న మిస్తి ముఖర్జీ ఇక లేరు.
కీటో డైట్ వల్ల ఆమె కిడ్నీ పాడైంది. చికిత్స పొందుతూ బెంగళూరులో మిస్తి చనిపోయింది. చనిపోయేముందు ఆమె తీవ్రమైన నొప్పిని అనుభవించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. మిస్తికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు అని మిస్తి తరఫు వారు అధికారిక ప్రకటన వెలువరించారు.
కీటో డైట్ వల్లే మిస్తి ప్రాణం పోయిందని ఆమె తరఫువారు ప్రకటించారు అంటే.. ఈ డైట్ పట్ల జనాల్లో ఆందోళన, సందేహాలు కలగడం ఖాయం. ఈ డైట్ ప్రకారం తినే తిండిలో 75 శాతం కొవ్వు, 20 శాతం ప్రొటీన్, 5 శాతం కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి.
This post was last modified on October 4, 2020 11:13 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…