మిస్తి ముఖర్జీ అని పశ్చిమ బెంగాల్కు చెందిన బెంగాలీ నటి బెంగళూరులో హఠాత్తుగా కన్నుమూయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వయసు 27 ఏళ్లు మాత్రమే. అధిక బరువు ఉన్న ఈ అమ్మాయి.. బరువు తగ్గించుకునేందుకు కొంత కాలంగా కీటో డైట్ ఫాలో అవుతున్నట్లు సమాచారం.
ఐతే ఆ డైట్ తేడా కొట్టి ఆమె కిడ్నీలపై ప్రభావం పడిందట. ఒక కిడ్నీ పాడై.. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయిన మిస్తి ఆసుపత్రిలో చేరింది. అక్కడి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలినట్లు అక్కడి మీడియా చెబుతోంది.
మిస్తి బెంగాలీతో పాటు కొన్ని హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించింది 2012లో లైఫ్ కి తో లగ్ గయి సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. మిస్తి.మోడలింగ్ కూడా చేసింది. ఎన్నో సినిమాలు, మ్యూజిక్ వీడియోల ద్వారా తన ప్రతిభను చాటుకున్న మిస్తి ముఖర్జీ ఇక లేరు.
కీటో డైట్ వల్ల ఆమె కిడ్నీ పాడైంది. చికిత్స పొందుతూ బెంగళూరులో మిస్తి చనిపోయింది. చనిపోయేముందు ఆమె తీవ్రమైన నొప్పిని అనుభవించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. మిస్తికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు అని మిస్తి తరఫు వారు అధికారిక ప్రకటన వెలువరించారు.
కీటో డైట్ వల్లే మిస్తి ప్రాణం పోయిందని ఆమె తరఫువారు ప్రకటించారు అంటే.. ఈ డైట్ పట్ల జనాల్లో ఆందోళన, సందేహాలు కలగడం ఖాయం. ఈ డైట్ ప్రకారం తినే తిండిలో 75 శాతం కొవ్వు, 20 శాతం ప్రొటీన్, 5 శాతం కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి.
This post was last modified on October 4, 2020 11:13 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…