ప్రభాస్-అనుష్కల బంధం గురించి ఎప్పుడూ ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తెరపై వీళ్లిద్దరూ కలిసి నటించిన బాహుబలి, మిర్చి సినిమాల ఫలితాల గురించి.. అందులో వాళ్ల కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బయట కూడా చాలా క్లోజ్గా ఉండే ఈ ఇద్దరూ ప్రేమికులని, పెళ్లి చేసుకుంటారని ఎప్పట్నుంచో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇద్దరిలో ఎవరో ఒకరి పెళ్లి అయిపోయి ఉంటే ఈ ఊహాగానాలు ఆగిపోయేవేమో గానీ.. ప్రభాస్కు 40 ఏళ్లొచ్చినా, అనుష్కకు 38 ఏళ్లు పూర్తయినా ఇప్పటిదాకా పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐతే ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించినపుడు మాత్రం ఏమీ లేదని కొట్టిపారేస్తారు. సమాధానం దాటవేస్తారు.
తాజాగా అనుష్క.. ప్రభాస్తో పెళ్లి గురించి పరోక్షంగా స్పందించాల్సిన అవసరం పడింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఆమె.. తన కొత్త చిత్రం నిశ్శబ్దం విడుదల నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్ను మళ్లీ యాక్టివేట్ చేసి అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఈ సందర్భంగా మిర్చి సినిమా చిత్రీకరణ సందర్భంగా ప్రభాస్, అనుష్క పెళ్లి బట్టల్లో తయారై పీటలపై కూర్చున్న ఫొటో ఒకటి షేర్ చేస్తూ ఓ అభిమాని దీని గురించి ఏమంటారు అని అనుష్కను ప్రశ్నించాడు. ఐతే ఆ అభిమాని అడిగిన కోణంలో జవాబు ఇవ్వకుండా.. ఒక సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఇద్దరం మాట్లాడుకుంటుంటే తీసిన క్యాండిడ్ పిక్ అని.. ఇది తన మనసుకు దగ్గరైన చిత్రమని.. యువి క్రియేషన్స్ వాళ్ల తొలి చిత్రం అని పేర్కొని.. యువి అధినేతలైన వంశీ, ప్రమోద్, విక్కీల పేర్లు ప్రస్తావించి దండం పెట్టే ఎమోజీలు పెట్టింది ఈ జవాబు చూశాక అనుష్క మరోసారి ప్రభాస్తో బంధం గురించి ఏమీ మాట్లాడకుండా అనుష్క తెలివిగా తప్పించుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
This post was last modified on October 4, 2020 11:12 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…