ప్రభాస్-అనుష్కల బంధం గురించి ఎప్పుడూ ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తెరపై వీళ్లిద్దరూ కలిసి నటించిన బాహుబలి, మిర్చి సినిమాల ఫలితాల గురించి.. అందులో వాళ్ల కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బయట కూడా చాలా క్లోజ్గా ఉండే ఈ ఇద్దరూ ప్రేమికులని, పెళ్లి చేసుకుంటారని ఎప్పట్నుంచో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇద్దరిలో ఎవరో ఒకరి పెళ్లి అయిపోయి ఉంటే ఈ ఊహాగానాలు ఆగిపోయేవేమో గానీ.. ప్రభాస్కు 40 ఏళ్లొచ్చినా, అనుష్కకు 38 ఏళ్లు పూర్తయినా ఇప్పటిదాకా పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐతే ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించినపుడు మాత్రం ఏమీ లేదని కొట్టిపారేస్తారు. సమాధానం దాటవేస్తారు.
తాజాగా అనుష్క.. ప్రభాస్తో పెళ్లి గురించి పరోక్షంగా స్పందించాల్సిన అవసరం పడింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఆమె.. తన కొత్త చిత్రం నిశ్శబ్దం విడుదల నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్ను మళ్లీ యాక్టివేట్ చేసి అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఈ సందర్భంగా మిర్చి సినిమా చిత్రీకరణ సందర్భంగా ప్రభాస్, అనుష్క పెళ్లి బట్టల్లో తయారై పీటలపై కూర్చున్న ఫొటో ఒకటి షేర్ చేస్తూ ఓ అభిమాని దీని గురించి ఏమంటారు అని అనుష్కను ప్రశ్నించాడు. ఐతే ఆ అభిమాని అడిగిన కోణంలో జవాబు ఇవ్వకుండా.. ఒక సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఇద్దరం మాట్లాడుకుంటుంటే తీసిన క్యాండిడ్ పిక్ అని.. ఇది తన మనసుకు దగ్గరైన చిత్రమని.. యువి క్రియేషన్స్ వాళ్ల తొలి చిత్రం అని పేర్కొని.. యువి అధినేతలైన వంశీ, ప్రమోద్, విక్కీల పేర్లు ప్రస్తావించి దండం పెట్టే ఎమోజీలు పెట్టింది ఈ జవాబు చూశాక అనుష్క మరోసారి ప్రభాస్తో బంధం గురించి ఏమీ మాట్లాడకుండా అనుష్క తెలివిగా తప్పించుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…