అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ సరసన నటించిన షాజన్ పదంసికి ఇప్పుడు పెళ్లి కుదిరింది. ఎప్పుడో 2010లో నటించిన అమ్మాయికి ఇప్పటిదాకా మ్యారేజ్ కాలేదా అంటే తారల జీవితాల్లో కొన్ని ఆలస్యంగా జరుగుతాయి అంతే. తెలుగులో ఈ అమ్మడు నటించినవి రెండు సినిమాలే. వెంకటేష్ రామ్ కలిసి నటించిన మసాలాలో చేసింది కానీ డెబ్యూతో పాటు ఇదీ డిజాస్టర్ కావడంతో తర్వాత అవకాశాలు రాలేదు.
షాజన్ తెరంగేట్రం రన్బీర్ కపూర్ సరసన రాకెట్ సింగ్ లాంటి సూపర్ హిట్ మూవీతో జరిగింది. ఇంతకీ షాజన్ పదంసిని కట్టుకున్నది ఎవరయ్యా అంటే అతని పేరు ఆశిష్ కనాకియా. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ మూవీ మ్యాక్స్ సిఈఓ ఇతను. బిజినెస్ సర్కిల్స్ లో పెద్ద పేరుంది. గత కొంత కాలంగా ఈ జంట ప్రేమలో ఉంది. తానుగా ఈ అమ్మాయి ప్రకటించడంతోనే ఈ విషయం అధికారికంగా బయటికి వచ్చింది. ఆరంజ్ లో చేసింది చిన్న పాత్రే అయినా మంచి పాటలు, గుర్తుండిపోయే సీన్ల వల్ల అప్పట్లో షాజన్ కు పేరు వచ్చింది.
కానీ దాని ఫలితం కెరీర్ మీద ప్రభావం చూపించింది. హిందీలో హౌస్ ఫుల్ 2, దిల్ తో బచ్చా హై జీ లాంటి సినిమాలు చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆశిష్, షాజన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నా అఫీషియల్ గా పెళ్ళితోనే శుభవార్తను పంచుకోవాలని ఇంతకాలం ఆగారు. తెరంగేట్రం జరిగిన పదిహేను సంవత్సరాల తర్వాత పెళ్లి జరగడంలో మరీ ఆశ్చర్యం లేదు కానీ అసలు కనిపించకుండా పోయిన హీరోయిన్ ఇలా హఠాత్తుగా ఇదిగో నా భర్త అంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం మూవీ లవర్స్ కి స్వీట్ షాకే.
This post was last modified on November 16, 2024 4:32 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…