టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్ డౌన్ పంతొమ్మిది రోజులకు చేరుకుంది. రేపు పాట్నాలో జరగబోయే భారీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బాలీవుడ్ వర్గాలకు సైతం దిమ్మదిరిగి పోయేలా చేస్తుందని అక్కడి ఏర్పాట్లు ప్రత్యక్షంగా చూస్తున్న అభిమానుల కామెంట్స్ హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. పబ్లిసిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా కార్పొరేట్ సంస్థలతో ఏర్పర్చుకున్న టై అప్ ద్వారా మైత్రి అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ అద్భుత ఫలితాలు ఇచ్చేలా ఉంది. గతంలో ఏ సినిమాకు ఇలా జరగలేదనే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ఓవర్సీస్ థియేటర్లో కూల్ డ్రింక్, పాప్ కార్న్ టబ్బుతో మొదలుపెట్టి స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లో దొరికే బియ్యం సంచుల దాకా ప్రతిదాని మీద పుష్ప 2 బొమ్మ కనిపిస్తోంది. అవుట్ డోర్ హోర్డింగులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. లోకల్, మెట్రో ట్రైన్లను ఆకర్షణీయమైన స్టిక్కర్లతో అలంకరిస్తున్నారు. బీహార్ లో ఉన్న బన్నీ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి పుష్ప 2 ప్రీమియర్ షోలకు తుపాకులతో వెళ్తామని, బయట బుల్లెట్లు గాల్లో పేల్చాక లోపలకు అడుగు పెడతామని చెప్పడం చూస్తే మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేరళలో వారం కిందకే బెనిఫిట్ షో టికెట్లు అమ్మడం మొదలుపెట్టారు.
రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం విశేషాలు వినాల్సి వస్తుందో ఫ్యాన్స్ ముందే ప్రిపేర్ కావడం మంచిది. ఇప్పటికీ షూటింగ్ లోనే బిజీగా ఉన్న దర్శకుడు సుకుమార్ ఇవేవి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ తమన్ పూర్తి చేసేశాడు. సెకండ్ హాఫ్ మీద అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ పని చేస్తున్నారని సమాచారం. ఇంకో వారంలోపే విదేశాలకు డ్రైవ్స్ డిస్పాచ్ చేయాలి. ఏరియాల వారీగా మతిపోయే రేట్లకు ఎగ్జిబిటర్లు హక్కులు కొంటున్నారు. ప్రతి సెంటర్ అన్ని స్క్రీన్లలో అర్ధరాత్రి ఒంటి గంట షోలు పడటం దాదాపు ఖరారే. ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఎవరి ఊహకు అందడం లేదు.
This post was last modified on November 16, 2024 9:44 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…