అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ ప్రమోషన్లు సరైన రీతిలో మొదలుపెడితే రికార్డుల ఊచకోతలో ఇదేమీ తక్కువ కాబోదని యూనిట్ వర్గాల కథనం. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ హిస్టారికల్ డ్రామా అధిక భాగానికి క్రిష్ దర్శకత్వం వహించగా మిగిలింది జ్యోతి కృష్ణ చూసుకుంటున్నారు. మార్చి 28 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకూడదనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పక్కా ప్రణాళికతో పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిర్మాత ఏఎం రత్నం పబ్లిసిటీ పరంగా కొత్త స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారట.
ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు పార్ట్ 1లో ఏడు ఎపిసోడ్లు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. కోహినూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ దొంగతనం చేసే సన్నివేశం చాలా బాగా వచ్చిందట. కుస్తీ ఫైట్, అడవిలో తోడేలుని వేటాడే సీన్, సముద్రం నుంచి వచ్చి పోర్ట్ లో చేసే యుద్ధం, గుర్రాలతో ప్లాన్ చేసిన సీక్వెన్సులతో పాటు ఛార్మినార్ సెట్ ముందు చిత్రీకరించిన ఘట్టం అసలైన హైలైట్ గా చెబుతున్నారు. ఇవి కాకుండా ఐటెం సాంగ్ సైతం మళ్ళీ మళ్ళీ చెప్పుకునే స్థాయిలో ఉందట. వీటికి సరైన విఎఫెక్స్, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ కనక కుదిరితే థియేటర్ ఎక్స్ పీరియన్స్ వేరే స్థాయిలో ఉంటుందని సమాచారం.
సో ఈ లెక్కన హరిహర వీరమల్లుని తక్కువంచనా వేయడానికి లేదు. బడ్జెట్ పరంగా ఇప్పటికీ విపరీతంగా ఖర్చు పెట్టేసిన ఏఎం రత్నం ఫైనల్ అవుట్ ఫుట్ మీద చాలా ధీమాగా ఉన్నారు. కేవలం తెలుగు వెర్షనే కాకుండా ఇతర భాషల్లోనూ సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబుగా కనిపించనున్నాడు. ఆస్కార్ విజేత కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగిన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయ్యాక రిలీజవుతున్న మొదటి సినిమా.
This post was last modified on November 16, 2024 10:37 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…