పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా ఉంది. దానికి తమన్ స్వయంగా పూనుకుంటున్నాడు. ఇటీవలే మీడియాతో జరిపిన ముచ్చట్లలో ఈ సంగతి పంచుకున్నాడు. అకీరా చేతి వేళ్ళు చాలా పెద్దగా ఉంటాయని, పియానో అద్భుతంగా ప్లే చేస్తాడని, రెండు నెలలు తనతో కలిసి పని చేసిన అనుభవంతో ఓజి కోసం అకీరాను పిలిపించుకుంటానని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చాడు. యానిమల్ విడుదలైనప్పుడు అందులో పాపా మేరీ జాన్ ట్యూన్ కి అకీరా ప్లే చేస్తున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
అప్పుడే అకీరానందన్ మ్యూజిక్ టేస్ట్ ఫ్యాన్స్ కు అర్థమయ్యింది. అయితే తనేమి దీనికే పరిమితమవుతాడని టెన్షన్ పడనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ పవన్ కు నటనతో పాటు పలు విభాగాల్లో శిక్షణ మొదలైంది. ఎప్పుడు పరిచయం చేస్తారనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ ముందు కెమెరాకు తగ్గట్టు సిద్ధం చేస్తున్నారు. వైజాగ్ సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని టాక్. పవన్ టాలీవుడ్ కు రాకముందు నట ఓనమాలు నేర్పించింది ఆయనే. అందుకే అంత నమ్మకంతో కొడుకుని అక్కడికి పంపించారట. మార్షల్ ఆర్ట్స్, డాన్స్ తదితరాల శిక్షణ కోసం వేరే నిపుణులను చూస్తున్నారు.
ఈ లెక్కన అకీరా ఇంకో రెండు మూడేళ్ళలో డెబ్యూ చేయడం ఖాయమే. తండ్రిలాగే సాంకేతిక విభాగాల్లో ఆసక్తి ఉండటం హీరోగా తనకు మంచి చేసేదే. ఓజిలోనే అకీరా మీద ఒక ఎపిసోడ్ ఉంటుందని, చాలా షాకింగ్ గా దర్శకుడు సుజిత్ దాన్ని షూట్ చేశాడనే ప్రచారం నాలుగైదు రోజులుగా తిరుగుతోంది కానీ స్పందించడానికి టీమ్ వర్గాలు అందుబాటులో లేవు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే పెద్ద కిక్కు. ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నవి అయ్యాక యాక్టింగ్ మానేసినా ఆ లోగా అకీరానందన్ అందుబాటులోకి వచ్చేస్తాడు కాబట్టి ఫ్యాన్స్ కి లోటు ఉండదు.
This post was last modified on November 16, 2024 10:38 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…