సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్. భారీ కాన్వాస్ పెట్టుకున్నా దానికి మద్దతుగా ఉండాల్సిన కథా కథనాలు బలంగా లేకపోవడం వల్ల బ్లాక్ బస్టర్ సూచనలు తగ్గిపోతున్నాయి. నిన్నటికి ఇవాళ్టికి ఓపెనింగ్స్ లో వచ్చిన తేడానే దానికి సాక్ష్యం.
అయితే నిర్మాత జ్ఞానవేల్ రాజా మాత్రం ఇదంతా ఒకటి రెండు రోజులకు పరిమితమని మెల్లగా తమ సినిమా అంచనాలకు మించి ఆడుతుందనే ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మొదటి రోజు స్పందనతో పాటు నెగటివ్ ఫీడ్ బ్యాక్ కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు.
వాటిలో ప్రధానంగా రెండు విషయాలున్నాయి. మొదటిది కంగువా 2. రెండో భాగం చాలా ఘనంగా, క్రూరంగా, మరింత పెద్ద స్కేల్ తో తీయడం ఖాయమని నొక్కి చెప్పారు. కాకపోతే దీనికన్నా ముందు దర్శకుడు శివ అజిత్ తో ఒక సినిమా చేసి వచ్చి తర్వాత సీక్వెల్ పనులు మొదలుపెడతారట.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ గురించి స్పందిస్తూ ఇందులో దేవిశ్రీ ప్రసాద్ తప్పేమి లేదని, సౌండ్ మిక్సింగ్ లో జరిగిన పొరపాట్ల వల్ల లౌడ్ నెస్ ఎక్కువయ్యింది తప్ప, సెకండ్ షో నుంచి రెండు పాయింట్ల వాల్యూమ్ తగ్గించేలా డిస్ట్రిబ్యూటర్లకు సూచనలు చేశామని అన్నారు.
మొదటి ఇరవై నిమిషాల ఫ్రాన్సిస్ ఎపిసోడ్ కు మాత్రమే నెగటివ్ గా టాక్ వచ్చిందని, మిగిలిన సినిమాకు టికెట్లు కొన్న ప్రేక్షకుల నుంచి మద్దతు దక్కిందని చెప్పారు. సూర్య అన్ని సినిమాల లైఫ్ రన్ కలెక్షన్లను కంగువా కేవలం రెండు మూడు రోజుల్లో దాటేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పెద్ద చిత్రాలకు మిక్స్ టాక్ రావడం సహజమేనని తర్వాత అవి నిలదొక్కుకుంటాయని చెప్పడం కొసమెరుపు. వినడానికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ సౌండ్ తగ్గిస్తేనో లేదా ఇంకోటి చేస్తేనో కంగువ అమాంతం పికప్ కావడం అనుమానమే కానీ మరింత వైల్డ్ గా కంగువా 2 ఉంటుందని చెప్పడమే అసలు హైలైట్. కాకపోతే దగ్గరలో మాత్రం కాదు.
This post was last modified on November 15, 2024 3:53 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…