Movie News

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రం మీద. నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్లంటూ హైప్ ఇచ్చాడు. కానీ తీరా చూస్తే అతను చెప్పినదాంట్లో నాలుగోవంతు కూడా వసూళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

వెయ్యేళ్ల కిందటి నేపథ్యం తీసుకుని కొన్ని తెగల మధ్య పోరాటం అంటూ దర్శకుడు శివ భిన్నమైన కథనే ఎంచుకున్నాడు కానీ.. దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. సినిమా అంతా గజిబిజి గందరగోళం తప్ప ఎమోషన్ పండలేదు. అసలు ఈ కథతో ఏం చెప్పదలుచుకున్నారన్నదే ప్రేక్షకులకు అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

‘కంగువ’ విషయంలో ఎక్కువమంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే.. ఇదో పెద్ద శబ్ద కాలుష్యం సినిమా అని. సినిమా అంతా ప్రతి పాత్రా విపరీతంగా అరుస్తూ ఉంటుంది. మామూలుగా సటిల్‌గా యాక్ట్ చేసే సూర్య సైతం సినిమాలో విపరీతంగా అరుస్తూ కనిపించాడు. పాత్రల అరుపులు చాలవన్నట్లు బ్యాగ్రౌండ్ స్కోర్ సహా అన్ని సౌండ్లూ అతిగా అనిపించాయి.

దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి కూడా జనాలు విమర్శిస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఒక పోస్ట్ మీద ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పొకుట్టి స్పందించాడు.

సినిమాల్లో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అయితే అందరూ సౌండ్ ఇంజినీర్‌ను నిందిస్తున్నారని.. కానీ చివరి నిమిషంలో ఫిలిం మేకర్స్ అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న కవరప్ వల్ల ఇది జరుగుతోందని.. ఈ శబ్ద కాలుష్యం వల్ల ఒకసారి చూడ్డానికే తలపోటు వస్తుండడంతో రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. మొత్తంగా సినిమాలో తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి లౌడ్ మ్యూజిక్‌తో కవరప్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా రసూల్ మాట్లాడారు. దీనిపై ‘కంగువ’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on November 15, 2024 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

44 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago