Movie News

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రం మీద. నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్లంటూ హైప్ ఇచ్చాడు. కానీ తీరా చూస్తే అతను చెప్పినదాంట్లో నాలుగోవంతు కూడా వసూళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

వెయ్యేళ్ల కిందటి నేపథ్యం తీసుకుని కొన్ని తెగల మధ్య పోరాటం అంటూ దర్శకుడు శివ భిన్నమైన కథనే ఎంచుకున్నాడు కానీ.. దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. సినిమా అంతా గజిబిజి గందరగోళం తప్ప ఎమోషన్ పండలేదు. అసలు ఈ కథతో ఏం చెప్పదలుచుకున్నారన్నదే ప్రేక్షకులకు అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

‘కంగువ’ విషయంలో ఎక్కువమంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే.. ఇదో పెద్ద శబ్ద కాలుష్యం సినిమా అని. సినిమా అంతా ప్రతి పాత్రా విపరీతంగా అరుస్తూ ఉంటుంది. మామూలుగా సటిల్‌గా యాక్ట్ చేసే సూర్య సైతం సినిమాలో విపరీతంగా అరుస్తూ కనిపించాడు. పాత్రల అరుపులు చాలవన్నట్లు బ్యాగ్రౌండ్ స్కోర్ సహా అన్ని సౌండ్లూ అతిగా అనిపించాయి.

దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి కూడా జనాలు విమర్శిస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఒక పోస్ట్ మీద ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పొకుట్టి స్పందించాడు.

సినిమాల్లో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అయితే అందరూ సౌండ్ ఇంజినీర్‌ను నిందిస్తున్నారని.. కానీ చివరి నిమిషంలో ఫిలిం మేకర్స్ అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న కవరప్ వల్ల ఇది జరుగుతోందని.. ఈ శబ్ద కాలుష్యం వల్ల ఒకసారి చూడ్డానికే తలపోటు వస్తుండడంతో రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. మొత్తంగా సినిమాలో తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి లౌడ్ మ్యూజిక్‌తో కవరప్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా రసూల్ మాట్లాడారు. దీనిపై ‘కంగువ’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Satya

Recent Posts

దూత మీద నమ్మకం నిర్మాతను చేసింది

హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…

7 minutes ago

1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…

1 hour ago

జ‌గ‌న్‌పై ఈడీ క‌న్ను… విచార‌ణేనా? అరెస్టా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న స‌మ‌యంలో…

2 hours ago

అన్నామలై బీజేపీని ఎందుకు వీడినట్టు?

అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…

3 hours ago

కొత్త నిప్పు రాజేసిన వీరభద్రుడు

ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…

3 hours ago

పార్ల‌మెంటు వారీగా జ‌న‌సేన వ్యూహం!

రాష్ట్రంలో ఎద‌గాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుస‌రిస్తోంది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా…

3 hours ago