సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రం మీద. నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్లంటూ హైప్ ఇచ్చాడు. కానీ తీరా చూస్తే అతను చెప్పినదాంట్లో నాలుగోవంతు కూడా వసూళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
వెయ్యేళ్ల కిందటి నేపథ్యం తీసుకుని కొన్ని తెగల మధ్య పోరాటం అంటూ దర్శకుడు శివ భిన్నమైన కథనే ఎంచుకున్నాడు కానీ.. దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. సినిమా అంతా గజిబిజి గందరగోళం తప్ప ఎమోషన్ పండలేదు. అసలు ఈ కథతో ఏం చెప్పదలుచుకున్నారన్నదే ప్రేక్షకులకు అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
‘కంగువ’ విషయంలో ఎక్కువమంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే.. ఇదో పెద్ద శబ్ద కాలుష్యం సినిమా అని. సినిమా అంతా ప్రతి పాత్రా విపరీతంగా అరుస్తూ ఉంటుంది. మామూలుగా సటిల్గా యాక్ట్ చేసే సూర్య సైతం సినిమాలో విపరీతంగా అరుస్తూ కనిపించాడు. పాత్రల అరుపులు చాలవన్నట్లు బ్యాగ్రౌండ్ స్కోర్ సహా అన్ని సౌండ్లూ అతిగా అనిపించాయి.
దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి కూడా జనాలు విమర్శిస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఒక పోస్ట్ మీద ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పొకుట్టి స్పందించాడు.
సినిమాల్లో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అయితే అందరూ సౌండ్ ఇంజినీర్ను నిందిస్తున్నారని.. కానీ చివరి నిమిషంలో ఫిలిం మేకర్స్ అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న కవరప్ వల్ల ఇది జరుగుతోందని.. ఈ శబ్ద కాలుష్యం వల్ల ఒకసారి చూడ్డానికే తలపోటు వస్తుండడంతో రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. మొత్తంగా సినిమాలో తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి లౌడ్ మ్యూజిక్తో కవరప్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా రసూల్ మాట్లాడారు. దీనిపై ‘కంగువ’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on November 15, 2024 3:57 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…