కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదని, అంత కంటెంట్ ఉందని ధీమాగా చెప్పారు. అంతే కాదు కంగువ 1కు ఎవరైనా పోటీ వచ్చినా సినిమా చూశాక సీక్వెల్ తో కాంపిటీషన్ వచ్చేందుకు ఎవరూ సిద్ధపడ్డారని సవాల్ చేయడం చూసి సూర్య ఫ్యాన్స్ చాలా ఊహించుకున్నారు.
విపరీతంగా కస్టపడటం సూర్యకు కొత్త కాదు. గజినీ, సెవెంత్ సెన్స్ లాంటి ఎన్నో చిత్రాలకు ఒళ్ళు హూనం చేసుకున్నాడు. కానీ కంగువ అంతకన్నా స్పెషల్. ఎందుకంటే శ్రమతో పాటు ఈసారి బోలెడు సమయాన్ని పెట్టుబడి పెట్టాడు.
కానీ కంగువ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ అద్భుతాలు చేసే విధంగా లేదనే రీతిలో టాక్స్ వినిపిస్తున్నాయి, రివ్యూస్ కనిపిస్తున్నాయి. బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటే దర్శకుడు శివ కనీసం పావువంతు అందుకోలేకపోయాడనే కామెంట్లు బలంగా ఉన్నాయి. అయిదు దీవులతో ఒక అటవీ ప్రపంచాన్ని సృష్టించడం గొప్ప ఆలోచన. దానికో చైల్డ్ సెంటిమెంట్ ముడిపెట్టి సూర్యని డ్యూయల్ రోల్ లో ఆవిష్కరించడం అంతకన్నా ఎగ్జైటింగ్ పాయింట్. కానీ పేపర్ మీద గొప్పగా అనిపించే ప్లాట్ తీరా తెరమీదకు వచ్చే సరికి తేడా కొట్టేసింది. గ్రాండియర్ కు లోటు లేకపోయినా కథనం కావాల్సినంత చేటు చేసింది.
తుది ఫలితం తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది కానీ తమిళంలో ఎలా ఆడినా తెలుగులో మాత్రం కంగువకు ఎదురీత తప్పేలా లేదు. పొన్నియిన్ సెల్వన్ ఒరిజినల్ వెర్షన్ అద్భుతాలు చేసినా తెలుగులో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. కానీ కంగువ ఆ మాత్రం అందుకున్నా గొప్పే అనుకోవాలి.
తమిళనాడులో అమరన్ థియేటర్ షేరింగ్ వల్ల కంగువ ఓపెనింగ్స్ ప్రభావితం చెందాయి. రికార్డులు బద్దలు కాలేదు కానీ మంచి నెంబర్లు వచ్చాయి. కానీ వీకెండ్ లో అన్ని భాషల్లో ఎంత బలంగా నిలబడుతుందనేది కీలకం కానుంది. దీనికి సంబంధించి నిర్మాత జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడతారని చెన్నై టాక్.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…