Movie News

పుష్ప 2 సంగీతం – నేనే కాదు చాలా మంది చేస్తున్నారు

టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ని మార్చారనే వార్త ఎంత సంచలనం రేపిందో చూశాం.

తమన్, మరో ఇద్దరు బీజీఎమ్ కోసం పని చేస్తున్నారనే టాక్ కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. దానికి ఇవాళ కొంత సమాధానం దొరికింది. బాలకృష్ణ డాకు మహారాజ్ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన తమన్ పుష్ప 2కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టులో తాను ఒక భాగమేనని, మిగిలిన సంగీత దర్శకులు కూడా పని చేస్తున్నారని కుండబద్దలు కొట్టేశాడు.

అంటే అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ ఉన్నట్టు క్లారిటీ వచ్చినట్టే. కాకపోతే అఫీషియల్ అయ్యేదాకా ఖరారుగా చెప్పలేం. తాను ఎడిటింగ్, రీ రికార్డింగ్ లో సినిమా చూశానని, చాలా అద్భుతంగా వచ్చిందని, అంచనాలకు మించి మెప్పించడం ఖాయమనే రీతిలో తమన్ అన్న మాటలు అల్లు అర్జున్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అయితే వేదిక, సందర్భం వేరు కాబట్టి పుష్ప 2 గురించి ఇంతకన్నా ఎక్కువ తమన్ చెప్పలేకపోయాడు. తన భాగం వరకు పని పూర్తయ్యిందనే సంకేతం ఇచ్చాడు. చివరి దశ ప్యాచ్ వర్క్ షూటింగ్ లో ఉన్న పుష్ప 2 మరో డ్యూయెట్ ని ఈ వారంలో పూర్తి చేసుకోబోతోంది.

ఇంకో ఇరవై రోజుల్లో పుష్ప 2 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న తరుణంలో టీమ్ మీద చాలా ఒత్తిడి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనుకాడకుండా పోస్ట్ ప్రొడక్షన్ చేయిస్తున్నారు. సెన్సార్, ఓవర్ సీస్ డ్రైవ్స్ లాంటి కీలకమైన పనులు పెండింగ్ ఉన్నాయి. ఎల్లుండి జరగపోయే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ మీద అందరి కళ్లున్నాయి. రెండున్నర నిమిషాల వీడియోలో పుష్పరాజ్ అరాచకం సాంపిల్ చూస్తారని, ఇది వచ్చాక హైప్ ఎక్కడికి వెళ్తుందో ఊహించడం కష్టమని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో శ్రీలీల, బన్నీల మీద షూట్ చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ విడుదల చేయబోతున్నారు.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

48 minutes ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

2 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

4 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

5 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

6 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

7 hours ago