పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నుంచి ముంబై దాకా పలుచోట్ల తిరిగి మరీ ప్రమోషన్ చేసుకున్న మట్కాకి బలహీనమైన ఓపెనింగ్ వచ్చింది. పట్టుమని కోటి షేర్ రాకపోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది.
మెగా ఫ్యామిలీ ఫాన్స్ సగం చూసినా మంచి నెంబర్లు కనిపించేవి. కానీ వాళ్ళలోనూ దీని పట్ల ఆసక్తి కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయమే. టాక్ సంగతి పక్కనపెడితే కనీసం ప్రధాన కేంద్రాల్లో మార్నింగ్ షోలైనా హౌస్ ఫుల్ బోర్డులు పడాలి. కానీ ఎక్కడా అవి నమోదైన దాఖలాలు లేవు.
ఇక పబ్లిక్ టాక్, రివ్యూలు మట్కాకు ప్రతికూలంగా ఉన్నాయి. దర్శకుడు కరుణ కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలు ఆయనే చేతల్లో చూపించలేకపోయారని థియేటర్ నుంచి బయటికి వచ్చేలోపే అర్థమయ్యింది.
మట్కా డాన్ గా పిలవబడే రతన్ ఖత్రీ జీవితాన్ని కమర్షియలైజ్ చేయబోయి ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో ఇంత పెద్ద బడ్జెట్ ని వృధా చేసుకున్న వైనం స్క్రీన్ మీద కనిపించింది. అవసరం లేని పాటలు, ఆసక్తి కలిగించని మలుపులు, ఆర్టిస్టుల ఎంపిక, హై అనిపించే ఎపిసోడ్స్ లేకపోవడం, రొటీన్ ట్రీట్మెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్న రీతిలో బోలెడున్నాయి.
కంగువ పోటీ వల్ల ఇలా జరిగిందని సమర్ధించుకోవడానికి లేదు. ఎందుకంటే దానికీ ఫ్లాప్ టాకే తిరుగుతోంది. కాకపోతే సూర్య ఇమేజ్, ప్రమోషన్ల వల్ల క్రేజ్ వచ్చి నిన్న థియేటర్లలో జనం కనిపించారు. ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు.
మట్కానే మరీ అన్యాయంగా తయారయ్యింది. దీనికన్నా రెండు వారాల క్రితం రిలీజైన లక్కీ భాస్కర్, అమరన్, కలకు మెరుగైన వసూళ్లు కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మొత్తానికి వరుణ్ తేజ్ ట్రాక్ తప్పేశాడు. త్వరలోనే దర్శకుడు మేర్లపాక గాంధీతో జట్టు కట్టబోతున్నాడు. మరి ఇతనైనా మెగా హీరోకు కోరుకున్న బ్రేక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశ.
This post was last modified on November 15, 2024 10:42 am
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…