పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నుంచి ముంబై దాకా పలుచోట్ల తిరిగి మరీ ప్రమోషన్ చేసుకున్న మట్కాకి బలహీనమైన ఓపెనింగ్ వచ్చింది. పట్టుమని కోటి షేర్ రాకపోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది.
మెగా ఫ్యామిలీ ఫాన్స్ సగం చూసినా మంచి నెంబర్లు కనిపించేవి. కానీ వాళ్ళలోనూ దీని పట్ల ఆసక్తి కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయమే. టాక్ సంగతి పక్కనపెడితే కనీసం ప్రధాన కేంద్రాల్లో మార్నింగ్ షోలైనా హౌస్ ఫుల్ బోర్డులు పడాలి. కానీ ఎక్కడా అవి నమోదైన దాఖలాలు లేవు.
ఇక పబ్లిక్ టాక్, రివ్యూలు మట్కాకు ప్రతికూలంగా ఉన్నాయి. దర్శకుడు కరుణ కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలు ఆయనే చేతల్లో చూపించలేకపోయారని థియేటర్ నుంచి బయటికి వచ్చేలోపే అర్థమయ్యింది.
మట్కా డాన్ గా పిలవబడే రతన్ ఖత్రీ జీవితాన్ని కమర్షియలైజ్ చేయబోయి ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో ఇంత పెద్ద బడ్జెట్ ని వృధా చేసుకున్న వైనం స్క్రీన్ మీద కనిపించింది. అవసరం లేని పాటలు, ఆసక్తి కలిగించని మలుపులు, ఆర్టిస్టుల ఎంపిక, హై అనిపించే ఎపిసోడ్స్ లేకపోవడం, రొటీన్ ట్రీట్మెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్న రీతిలో బోలెడున్నాయి.
కంగువ పోటీ వల్ల ఇలా జరిగిందని సమర్ధించుకోవడానికి లేదు. ఎందుకంటే దానికీ ఫ్లాప్ టాకే తిరుగుతోంది. కాకపోతే సూర్య ఇమేజ్, ప్రమోషన్ల వల్ల క్రేజ్ వచ్చి నిన్న థియేటర్లలో జనం కనిపించారు. ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు.
మట్కానే మరీ అన్యాయంగా తయారయ్యింది. దీనికన్నా రెండు వారాల క్రితం రిలీజైన లక్కీ భాస్కర్, అమరన్, కలకు మెరుగైన వసూళ్లు కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మొత్తానికి వరుణ్ తేజ్ ట్రాక్ తప్పేశాడు. త్వరలోనే దర్శకుడు మేర్లపాక గాంధీతో జట్టు కట్టబోతున్నాడు. మరి ఇతనైనా మెగా హీరోకు కోరుకున్న బ్రేక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశ.
This post was last modified on November 15, 2024 10:42 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…