ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గత కొంత కాలంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఆర్మీ మధ్య ఆన్ లైన్ వార్ జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన స్పష్టత వీటిలో ఏమైనా వస్తుందేమోనని సగటు ప్రేక్షకులు సైతం వెయిట్ చేశారు.
అయితే ఫస్ట్ పార్ట్ అన్నారు కాబట్టి కీలకమైన సంగతులు కొన్ని సీక్వెల్ లో చూడాలన్న మాట. ఇప్పుడొచ్చిన మొదటి భాగంలో ఇద్దరూ భలే భలే కబుర్లు పంచుకున్నారు. కూల్ గా, ఆహ్లాదకరంగా జరిగిన ముఖాముఖీలో డ్యూయల్ ఫైర్ అనిపించారు.
ఇప్పటి జనరేషన్ హీరోల్లో బన్నీకి ఎవరంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – చిరంజీవి – ప్రభాస్ తదితరుల మీద ఉన్న అభిప్రాయాలు, సోషల్ మీడియాలో వైరలైన ఒకప్పటి వైన్ షాప్ వీడియో, తన ప్రాణ స్నేహితుడు బాలయ్య ఫ్యాన్ కావడం లాంటివన్నీ ఇందులో ప్రత్యేకంగా చూపించారు.
తనకు ఈ జెనరేషన్ హీరోలతో ఉన్న పోటీ గురించి కూడా బన్నీ తెలివైన సమాధానం చెప్పాడు. జాతీయ అవార్డుని టాలీవుడ్ హీరోలకు అంకితం ఇవ్వడం ఆకట్టుకునేలా ఉంది. బాలయ్య స్టైల్ లో సరదా ఆటలు, విచిత్ర ప్రశ్నలు అన్నీ ఇందులో పొందుపరిచారు. ఎంటర్ టైన్మెంట్ ఇచ్చారు.
అవన్నీ ఇక్కడ చెప్పుకోవడం భావ్యం కాదు కానీ పార్ట్ 1లోనే ఇన్ని ఉంటే మరో పార్ట్ 2లో ఇంకేం దాచారో వేచి చూడాలి. బహుశా రాజకీయాలకు సంబంధించిన కొన్ని అంశాలు దాంట్లో చోటు చేసుకుని ఉండొచ్చు. తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించిన ముచ్చట్ల కోసం వెయిట్ చేయాలి.
గత సీజన్లోనే బాలయ్య, బన్నీ ఒక ఎపిసోడ్ చేశారు. అయితే పుష్ప 2 ది రూల్ విడుదల దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కలుసుకున్నారు. ఎప్పటిలాగే బాలకృష్ణ హుషారుగా షోని లాగించగా బన్నీ తనదైన మ్యానరిజమ్ తో రక్తి కట్టించాడు. సోషల్ మీడియా రెస్పాన్స్ చూస్తే సూపర్ హిట్టే అనిపిస్తోంది.
This post was last modified on November 15, 2024 10:39 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…